జనవరి 14 విడుదల కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్లకు సంబంధించిన ఏ అవకాశాన్ని వెంకటేష్, అనిల్ రావిపూడి వదలడం లేదు. ఇప్పటికే వెరైటీ పబ్లిసిటీతో సోషల్ మీడియాలో టాపిక్ గా మారిపోయిన ఈ టీమ్ ఇంకోవైపు భీమ్స్ ఇచ్చిన మూడు ఛార్ట్ బస్టర్ సాంగ్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ఛాయస్ ని తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ సాధించింది.
చివరిగా వస్తోందన్న మాటే కానీ ఓపెనింగ్స్ బలంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. వెంకీ పాత గెటప్పులుతో అనిల్, ఐశ్వర్య, మీనాక్షి, దిల్ రాజు చేసిన ఇంటర్వ్యూ తొలుత ట్రోలింగ్ అయినా తర్వాత ఇదీ సూపర్ హిట్ అనిపించుకుంది.
ఇక తాజాగా వెంకటేష్ అభిమానులతో ఫోటో షూట్ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ఫ్యాన్స్ తో గంటల తరబడి ఓపిగ్గా నిలబడి వాళ్ళ ముచ్చట తీర్చారు. మూడు వేలకు పైగా వచ్చి ఉంటారని అంచనా. రేపు కూడా కొనసాగించవచ్చని సమాచారం.
గత నెలే రామ్ చరణ్ ఇది చేసినప్పటికీ ఇంత కౌంట్ లేదు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో పరిమిత సంఖ్యలో ఫ్యాన్స్ ని పిలవడంతో సైలెంట్ గా అయిపోయింది. టైం తక్కువగా ఉంది కాబట్టి మరోసారి చేసే అవకాశం లేనట్టే. ఇక బాలకృష్ణ ప్రత్యేకంగా వీటికి టైం కేటయించడం ఉండదు కాబట్టి డాకు మహారాజ్ కు నో ఛాన్స్. ఇక్కడే వెంకీ మామకు ఎడ్జ్ కలిసి వస్తోంది.
ఎల్లుండి జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ వచ్చేస్తుంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ పోటీని తట్టుకుంటుందా అనే అనుమానం నుంచి ఇప్పుడీ లెవెల్ కు బజ్ పెంచుకోవడంలో మొదటి క్రెడిట్ వెంకటేష్ ఆ తర్వాత అనిల్ రావిపూడికే దక్కుతుంది. రెండు బ్యాలన్స్ చేయాల్సిన ఒత్తిడిలో దిల్ రాజు ఉండగా ఆ ప్రెజర్ ని వీళ్లిద్దరూ తగ్గించేశారు.
దానికి తోడు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి రెండు వారాల డేట్లు ప్రమోషన్లకు ఇవ్వడం మరింత ప్లస్ అవుతోంది. పండక్కు వచ్చే మూడు సినిమాలు దేనికవే ప్రత్యేకంగా అనిపిస్తున్నా సంథింగ్ స్పెషలనే రేంజులో వెంకీ మామ ఆకట్టుకోవడం వాస్తవం.
This post was last modified on January 4, 2025 2:49 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…