జనవరి 14 విడుదల కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్లకు సంబంధించిన ఏ అవకాశాన్ని వెంకటేష్, అనిల్ రావిపూడి వదలడం లేదు. ఇప్పటికే వెరైటీ పబ్లిసిటీతో సోషల్ మీడియాలో టాపిక్ గా మారిపోయిన ఈ టీమ్ ఇంకోవైపు భీమ్స్ ఇచ్చిన మూడు ఛార్ట్ బస్టర్ సాంగ్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ఛాయస్ ని తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ సాధించింది.
చివరిగా వస్తోందన్న మాటే కానీ ఓపెనింగ్స్ బలంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. వెంకీ పాత గెటప్పులుతో అనిల్, ఐశ్వర్య, మీనాక్షి, దిల్ రాజు చేసిన ఇంటర్వ్యూ తొలుత ట్రోలింగ్ అయినా తర్వాత ఇదీ సూపర్ హిట్ అనిపించుకుంది.
ఇక తాజాగా వెంకటేష్ అభిమానులతో ఫోటో షూట్ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ఫ్యాన్స్ తో గంటల తరబడి ఓపిగ్గా నిలబడి వాళ్ళ ముచ్చట తీర్చారు. మూడు వేలకు పైగా వచ్చి ఉంటారని అంచనా. రేపు కూడా కొనసాగించవచ్చని సమాచారం.
గత నెలే రామ్ చరణ్ ఇది చేసినప్పటికీ ఇంత కౌంట్ లేదు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో పరిమిత సంఖ్యలో ఫ్యాన్స్ ని పిలవడంతో సైలెంట్ గా అయిపోయింది. టైం తక్కువగా ఉంది కాబట్టి మరోసారి చేసే అవకాశం లేనట్టే. ఇక బాలకృష్ణ ప్రత్యేకంగా వీటికి టైం కేటయించడం ఉండదు కాబట్టి డాకు మహారాజ్ కు నో ఛాన్స్. ఇక్కడే వెంకీ మామకు ఎడ్జ్ కలిసి వస్తోంది.
ఎల్లుండి జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ వచ్చేస్తుంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ పోటీని తట్టుకుంటుందా అనే అనుమానం నుంచి ఇప్పుడీ లెవెల్ కు బజ్ పెంచుకోవడంలో మొదటి క్రెడిట్ వెంకటేష్ ఆ తర్వాత అనిల్ రావిపూడికే దక్కుతుంది. రెండు బ్యాలన్స్ చేయాల్సిన ఒత్తిడిలో దిల్ రాజు ఉండగా ఆ ప్రెజర్ ని వీళ్లిద్దరూ తగ్గించేశారు.
దానికి తోడు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి రెండు వారాల డేట్లు ప్రమోషన్లకు ఇవ్వడం మరింత ప్లస్ అవుతోంది. పండక్కు వచ్చే మూడు సినిమాలు దేనికవే ప్రత్యేకంగా అనిపిస్తున్నా సంథింగ్ స్పెషలనే రేంజులో వెంకీ మామ ఆకట్టుకోవడం వాస్తవం.
This post was last modified on January 4, 2025 2:49 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…