టాలీవుడ్ లో అసలు అపజయమే ఎరుగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ పటాస్ తో మొదలుపెట్టి బాలకృష్ణ భగవంత్ కేసరి దాకా ట్రాక్ రికార్డుని ఒకేలా మైంటైన్ చేయడం ఆయనకే చెల్లింది.
ఈ పండక్కు సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో మూడోసారి వెంకటేష్ తో జట్టుకట్టిన ఈ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ మరోసారి ఎఫ్2, ఎఫ్3 మించిన ఫన్ ఇస్తానని గ్యారెంటీగా చెబుతున్నాడు. దానికి తగ్గట్టే పోటీ సినిమాల కన్నా వేగంగా తన సినిమా పాటలు ఛార్ట్ బస్టర్స్ అయిపోయి 90 మిలియన్ల వ్యూస్ దాటేసి వంద మైలురాయి వైపు పరుగులు పెడుతున్నాయి.
ఇదిలా ఉండగా రావిపూడి తర్వాత సినిమా సాహు గారపాటి నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టోరీ లైన్ ఓకే కాగా స్క్రిప్ట్ కు సంబంధించిన డెవలప్మెంట్ల గురించి తాజాగా చిరు ఇంట్లోనే చర్చలు జరిగాయి.
ఈ నేపథ్యంలో చిరుని ఎలా చూపిస్తాడనే దాని మీద ఫ్యాన్స్ ఊహాగానాలు రకరకాలుగా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వింటేజ్ చిరంజీవిని చూపించడం కాదు కానీ ఆయనను తాను ఎలా చూడాలని కోరుకుంటున్నానో అలాగే ప్రెజెంట్ చేస్తానని వివరణ ఇచ్చారు.
శ్రీకాంత్ ఓదెల ఒకలా చూపిస్తే నేను చిరంజీవిని ఇంకోలా చూపిస్తానని, ఫైనల్ గా ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా కథలు రాసుకుంటానని తేల్చి చెప్పాడు. మహేష్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్లతో పని చేసిన రావిపూడి ఇప్పుడీ మెగా ఆఫర్ ని ప్రమోషన్ గా భావిస్తున్నాడు.
కాకపోతే స్క్రిప్ట్ లాకయ్యాక చిరు క్యారెక్టరైజేషన్ గురించి చెబుతానంటున్నారు కాబట్టి ఇంకొన్ని వారాలు వేచి చూడక తప్పదు. విశ్వంభర చివరి దశలో ఉండటంతో బాలన్స్ పూర్తి చేయడంలో మెగాస్టార్ బిజీగా ఉన్నారు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ వేసవిలో థియేటర్లకు తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
This post was last modified on January 4, 2025 2:39 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…