ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తో తన కంబ్యాక్ ఇస్తానని అభిమానులను ఊరిస్తున్న దర్శకుడు శంకర్ దానికి తగ్గట్టే ట్రైలర్ ద్వారా మొదటి పరీక్ష పాసవ్వడం చూశాం. ఒకప్పటి వింటేజ్ డైరెక్టర్ కనిపించాడని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇండియన్ 2 కొట్టిన దెబ్బకు ఏకంగా ట్రోలింగ్ చవిచూడాల్సి వచ్చిన శంకర్ కు రామ్ చరణ్ సినిమా చాలా కీలకం. బడ్జెట్ పరంగా రాజీ లేకుండా తెలుగులో మొదటిసారి స్ట్రెయిట్ మూవీ చేయడంతో అంచనాల పరంగా బరువు మరింత పెరిగింది. జనవరి 10 ఎంతో దూరంలో లేనందున సినీ ప్రియుల చూపంతా ఎప్పుడెప్పుడు ఆ డేట్ వస్తుందనే దాని మీదే ఉంది.
గేమ్ ఛేంజర్ లాభపడితే ముందుగా ప్రయోజనం కలిగేది ఇండియన్ 3కే. వీటి తర్వాత శంకర్ మరో ప్యాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. వీరయుగ నాయగన్ వేల్పరి అనే పుస్తకం ఆధారంగా మూడు భాగాలతో వందల కోట్ల బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా మలచడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. 2022లోనే దీనికి సంబంధించిన అప్డేట్ మా గుల్టే అందించింది. ఇప్పుడదే నిజమవుతోంది. గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్ రూపకల్పనలో సహాయం చేసిన మధురై ఎంపి ఎస్ వెంకటేశన్ రాసిన వేల్పరి నవలలో చాలా చారిత్రాత్మక నేపథ్యం ఉంది. పొన్నియిన్ సెల్వన్ ఈ పుస్తకం నుంచే కొంత స్ఫూర్తి చెందిందనే కామెంట్స్ లేకపోలేదు.
వేల్పరిలో హీరో ఎవరనేది శంకర్ వెల్లడించలేదు. చెన్నై ప్రెస్ మీట్ లో ప్రాజెక్టు మాత్రమే కన్ఫర్మ్ చేశారు. గతంలో బాలీవుడ్ నుంచి రణ్వీర్ సింగ్ చేయొచ్చనే టాక్ వచ్చింది. అపరిచితుడు రీమేక్ వద్దనుకున్నాక శంకర్ ఈ ప్రతిపాదన చెప్పారట. పెన్ స్టూడియోస్ నిర్మించే అవకాశముంది. ఒకవేళ రణ్వీర్ చేయలేని పరిస్థితి వస్తే మాత్రం ఆ స్థానంలో ఎవరొస్తారో చూడాలి. సౌత్ స్టార్ హీరోలందరూ రెండు మూడేళ్ళకు సరిపడా బిజీ ఉన్నారు. మరి శంకర్ తో చేతులు కలపబోయేది రణ్వీరా వేరొకరానేది వేచి చూడాలి. గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 సక్సెస్ అయితే దీనికి మరింత వేగంగా అడుగులు పడతాయి.
This post was last modified on January 3, 2025 10:30 pm
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…