సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయగా..ఆ తర్వాత ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టులో కొద్ది రోజుల క్రితం వాదనలు ముగియగా తీర్పు రిజర్వ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా నేడు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది.
రూ.50 వేల రూపాయల సొంత పూచీకత్తుతోపాటు రెండు సాక్షి సంతకాలతో కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పునిచ్చింది. దీంతో, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించినట్లయింది.
కాగా, ఈ కేసులో ‘పుష్ప-2’ నిర్మాతలకు కూడా ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిర్మాతలను నిందించవద్దు అని కోర్టు తేల్చి చెప్పింది. వారిని అరెస్ట్ చేయొద్దని ఇంటరిమ్ ఆర్డర్ జారీ చేసింది. దీనికి కౌంటర్గా పోలీసులను ఒక అఫిడవిట్ ఫైల్ చేయాలని ఆదేశించింది.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…