ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించనున్న కొత్త చిత్రానికి హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభోత్సవ వేడుకను సింపుల్గా కానిచ్చేసింది చిత్ర బృందం.
ఇందులో రాజమౌళి, మహేష్లతో పాటు పరిమిత సంఖ్యలో చిత్ర బృందం, కొందరు ప్రముఖుల హాజరైనట్లు తెలుస్తోంది. ఐతే రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది.. సినిమా ఎప్పుడు పూర్తయి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే విషయాల్లో క్లారిటీ లేదు.
ఈ విషయంలో రాజమౌళి వర్కింగ్ స్టైల్ మీద బాగా అవగాహన ఉన్న హీరో రామ్ చరణ్ ఒక అంచనా వేయడం విశేషం. ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరైన నేపథ్యంలో అభిమానుల నుంచి కొన్ని ప్రశ్నలు తీసుకున్నాడు చరణ్.
ఇందులో భాగంగా రజామౌళి-మహేష్ సినిమా ఎప్పుడు రిలీజ్ కావచ్చని అడిగారు. దీనికి చరణ్ బదులిస్తూ.. ‘‘కొవిడ్ లాంటివి లేకపోతే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏడాదిన్నరలో వచ్చేస్తుంది’’ అని చెప్పాడు.
ఇంతలో మైక్ అందుకున్న రాజమౌళి బాగా ట్రైనింగ్ ఇచ్చా అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ‘బాహుబలి’ రెండు పార్టులకు కలిపి రాజమౌళి ఐదేళ్ల సమయం తీసుకోగా.. ‘ఆర్ఆర్ఆర్’ను కొంచెం త్వరగానే పూర్తి చేశాడు. కానీ కొవిడ్ వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమైంది.
మహేష్ బాబు సినిమా కోసం ప్రి ప్రొడక్షన్, రిహార్సల్స్ కోసం బాగానే టైం వెచ్చించారు. అయినా సరే.. ఈ సినిమా స్కేల్ దృష్ట్యా మేకింగ్ పూర్తయి విడుదల కావడానికి కనీసం ఇంకో రెండేళ్ల సమయం అయినా పడుతుందని అంచనా వేస్తున్నారు.
జనవరిలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కావచ్చని సమాచారం. ప్రస్తుతానికి అయితే మహేష్ ఫ్యాన్స్ 2026 రెండో అర్ధంలో కానీ, 2027 ప్రథమార్ధంలో కానీ సినిమా రిలీజవుతుందని అనుకుంటున్నారు.
కొన్నేళ్ల ముందు వరకు తెలుగులో రాశి ఖన్నా కెరీర్ మంచి ఊపులో ఉండేది. జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు స్టార్…
గాయని సునీత అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర, జానకి లాంటి సీనియర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న టైంలో…
కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన దాదాపు ఖరారైన నేపథ్యంలో ఏపీ నుంచి మరో ఇద్దరు ఎంపీలకు మంత్రి యోగం పట్టనుందని టీడీపీ…
కెరీర్లో ఒక దశ వరకు మామూలు మాస్ మసాలా సినిమాలే తీశాడు రాజమౌళి. మగధీర నుంచి ఆయనలోని మరో కోణం…
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…