Movie News

15 సంవత్సరాల స్వప్నం… సెంటిమెంట్ బ్రేక్ చేసిన మహేష్

అభిమానులు రోజుకు కనీసం ఒక్కసారైనా తలుచుకోనిదే నిద్రపోని ఎస్ఎస్ఎంబి 29 ఇవాళ పూజ కార్యక్రమంతో మొదలైపోయింది. టాలీవుడ్ నే కాదు యావత్ దేశాన్ని షేక్ చేయబోయే ఈ కాంబినేషన్ ప్రకటన స్టేజి నుంచే ఎన్నో సంచలనాలకు దారి తీసింది. ఇవాళ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన పూజా కార్యక్రమాలకు మహేష్ బాబు హాజరై తన సెంటిమెంట్ ని బ్రేక్ చేసుకున్నాడు. చాలా ఏళ్లుగా తన కొత్త సినిమా ఓపెనింగ్ కి మహేష్ రాకపోవడం సంప్రదాయంగా మారింది. తన స్థానంలో నమ్రతాను పంపించేవాడు తప్ప అందుబాటులో ఉన్నా సరే హాజరు కాకపోవడం పరిపాటి. ఒకప్పుడు వచ్చేవాడు కానీ ఇప్పుడు లేదు.

జక్కన్న కోసం సూపర్ స్టార్ ఏకంగా తన అలవాటుని మార్చుకోవడం ఒకరకంగా సెన్సేషనని చెప్పాలి. ఇక్కడితో అయిపోలేదు. ఈ కలయిక మహేష్ 15 సంవత్సరాల స్వప్నం. 2010 సంవత్సరం మే 22న రాజమౌళితో తాను కలిసి పనిచేయబోయే ప్రాజెక్టు కార్యరూపం దాల్చబోతోందంటూ ట్విట్టర్ ద్వారా తను షేర్ చేసుకున్న గుడ్ న్యూస్ ఇప్పుడు వైరలవుతోంది. చెప్పాడు కానీ అప్పట్లో ఇది సాధ్యం కాలేదు. దర్శకధీర ఆ తర్వాత ప్రభాస్ బాహుబలి రెండు భాగాలు, RRR లతో బిజీ అయిపోవడంతో మళ్ళీ ఎలాంటి చప్పుడు లేకుండా పోయింది. ఇన్నేళ్ల తర్వాత 2025లో కోట్లాది మహేష్ ఫ్యాన్స్ కల నెరవేరింది.

ఇకపై రాబోయే రోజుల్లో ఏ చిన్న లీక్ అయినా పెద్ద బ్లాస్ట్ అయ్యేలా ఉంది. ఇప్పటికే క్యాస్టింగ్ కు సంబంధించిన చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రాజమౌళి అఫీషియల్ గా ఏర్పాటు చేసే ప్రెస్ మీట్ కోసం మీడియాతో పాటు మూవీ ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఇవాళ గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దీని గురించి ప్రస్తావన వచ్చే అవకాశముంది కానీ జక్కన్న తప్పించుకునే ఛాన్సే ఎక్కువ. ఏది అడిగినా ఇది సందర్భం వేదిక కాదు అంటారేమో. ఇకపై 2027 దాకా థియేటర్లో మహేష్ ని చూడాలంటె కేవలం రీ రిలీజులతోనే సర్దుకోవాలి. అప్పటిదాకా అప్డేట్స్ వర్షంలో తడిసేందుకు ఎదురు చూడాలి.

This post was last modified on January 2, 2025 1:16 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

23 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

1 hour ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

1 hour ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

2 hours ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

2 hours ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

3 hours ago