సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ప్రారంభానికి జనవరి 2 ఎంచుకోవడం హాట్ టాపిక్ అయిపోయింది. రెగ్యులర్ షూటింగ్ కి ఎప్పుడు వెళ్ళేది ఇంకా వెల్లడించలేదు కానీ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి సెట్స్ లోకి అడుగు పెట్టేందుకు ఎక్కువ సమయం పట్టదు. దీనికి సంబంధించిన కొన్ని క్రేజీ లీక్స్ ఆశ్చర్యం కాదు సంభ్రమాశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. ప్రాథమికంగా దీనికి అనుకున్న బడ్జెట్ 1000 కోట్లకు పైమాటేననే టాక్ గతంలోనే రాగా ఇప్పుడది నిజమేననే దిశగా ప్లాన్స్ జరుగుతున్నాయట. సోనీ, డిస్నీ లాంటి సంస్థల భాగస్వామ్యం ఉండొచ్చని వినికిడి.
రాజమౌళి, మహేష్ బాబు తమ రెగ్యులర్ పారితోషికాలు కాకుండా లాభాల్లో 40 శాతం వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని ఇన్ సైడ్ టాక్. అధికారికంగా చెప్పలేదు కానీ ఆ మేరకు నిర్మాతలతో అంగీకారం జరిగిపోయిందని అంటున్నారు. పెట్టుబడి ఎంత పెట్టినా సరే దానికి రెండు మూడింతలు ఎక్కువ వసూలు చేసే కెపాసిటీ దీనికి ఉండటంతో ఆకాశమే హద్దుగా బిజినెస్ జరుగుతుంది. మొదటి భాగం 2027, రెండో భాగం 2029లో రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ టూ పార్ట్ న్యూస్ అఫీషియల్ గా బయటికి వచ్చేది జక్కన్న, మహేష్ బాబులు పెట్టే ప్రెస్ మీట్ లోనే. అప్పటిదాకా వెయిట్ చేయాలి.
బాహుబలి కన్నా ముందు రాజమౌళి కమిట్ మెంట్ ఇచ్చిన నిర్మాతలు ఇద్దరు. డివివి దానయ్యకు ఆర్ఆర్ఆర్ ద్వారా దాన్ని నెరవేర్చారు. ఇప్పుడు కెఎల్ నారాయణకు మహేష్ 29 ద్వారా ఆ మాటను పూర్తి చేస్తున్నారు. ఈ కాంబినేషన్ కోసమే ఎంతో కాలంగా నిర్మాణానికి దూరంగా నారాయణ తిరిగి యాక్టివ్ ప్రొడ్యూసర్ కాబోతున్నారు. అటవీ నేపథ్యంలో జంతువులు, నిధి నిక్షేపాలు, అడ్వెంచర్లు ఇలా ఎన్నో సాహసోపేతమైన యాక్షన్ ఎపిసోడ్లు ఇందులో బోలెడు ఉంటాయట. సింపుల్ గా చెప్పాలంటే ట్రిపులార్ కు పదింతలు ఎక్కువ విజువల్ గ్రాండియర్ గా ఉంటుందని సమాచారం. చాలా క్రేజీ కదూ.
This post was last modified on January 2, 2025 10:21 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…