Movie News

మహేష్ – రాజమౌలి కాంబో : ప్రపంచ స్థాయి ఒప్పందాలు?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ప్రారంభానికి జనవరి 2 ఎంచుకోవడం హాట్ టాపిక్ అయిపోయింది. రెగ్యులర్ షూటింగ్ కి ఎప్పుడు వెళ్ళేది ఇంకా వెల్లడించలేదు కానీ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి సెట్స్ లోకి అడుగు పెట్టేందుకు ఎక్కువ సమయం పట్టదు. దీనికి సంబంధించిన కొన్ని క్రేజీ లీక్స్ ఆశ్చర్యం కాదు సంభ్రమాశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. ప్రాథమికంగా దీనికి అనుకున్న బడ్జెట్ 1000 కోట్లకు పైమాటేననే టాక్ గతంలోనే రాగా ఇప్పుడది నిజమేననే దిశగా ప్లాన్స్ జరుగుతున్నాయట. సోనీ, డిస్నీ లాంటి సంస్థల భాగస్వామ్యం ఉండొచ్చని వినికిడి.

రాజమౌళి, మహేష్ బాబు తమ రెగ్యులర్ పారితోషికాలు కాకుండా లాభాల్లో 40 శాతం వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని ఇన్ సైడ్ టాక్. అధికారికంగా చెప్పలేదు కానీ ఆ మేరకు నిర్మాతలతో అంగీకారం జరిగిపోయిందని అంటున్నారు. పెట్టుబడి ఎంత పెట్టినా సరే దానికి రెండు మూడింతలు ఎక్కువ వసూలు చేసే కెపాసిటీ దీనికి ఉండటంతో ఆకాశమే హద్దుగా బిజినెస్ జరుగుతుంది. మొదటి భాగం 2027, రెండో భాగం 2029లో రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ టూ పార్ట్ న్యూస్ అఫీషియల్ గా బయటికి వచ్చేది జక్కన్న, మహేష్ బాబులు పెట్టే ప్రెస్ మీట్ లోనే. అప్పటిదాకా వెయిట్ చేయాలి.

బాహుబలి కన్నా ముందు రాజమౌళి కమిట్ మెంట్ ఇచ్చిన నిర్మాతలు ఇద్దరు. డివివి దానయ్యకు ఆర్ఆర్ఆర్ ద్వారా దాన్ని నెరవేర్చారు. ఇప్పుడు కెఎల్ నారాయణకు మహేష్ 29 ద్వారా ఆ మాటను పూర్తి చేస్తున్నారు. ఈ కాంబినేషన్ కోసమే ఎంతో కాలంగా నిర్మాణానికి దూరంగా నారాయణ తిరిగి యాక్టివ్ ప్రొడ్యూసర్ కాబోతున్నారు. అటవీ నేపథ్యంలో జంతువులు, నిధి నిక్షేపాలు, అడ్వెంచర్లు ఇలా ఎన్నో సాహసోపేతమైన యాక్షన్ ఎపిసోడ్లు ఇందులో బోలెడు ఉంటాయట. సింపుల్ గా చెప్పాలంటే ట్రిపులార్ కు పదింతలు ఎక్కువ విజువల్ గ్రాండియర్ గా ఉంటుందని సమాచారం. చాలా క్రేజీ కదూ.

This post was last modified on January 2, 2025 10:21 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

5 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

6 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

7 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

7 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

9 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

10 hours ago