సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. కమల్ హాసన్ ని పొట్టివాడిగా మార్చి విచిత్ర సోదరులు తీసినా, బాలకృష్ణని శ్రీకృష్ణదేవరాయలుగా ఆదిత్య 369లో చూపించినా, జానపదాలు తగ్గిపోయిన రోజుల్లో భైరవ ద్వీపంతో దానికి తిరిగి జీవం పోసినా ఆయనకే చెల్లింది. ఎన్నో ట్రెండ్ సెట్టర్స్ పరిశ్రమకు కానుకగా ఇచ్చారు. అసలు మాటలే లేని పుష్పక విమానంతో బాషలకున్న సరిహద్దులు చెరిపేసి మొదటి ప్యాన్ ఇండియా మూవీ ఇచ్చిన ఘనత ఆయనకే చెల్లింది. ఎనిమిది పదులు దాటిన వయసులోనూ చలాకీగా ఉండటం అందరికీ సాధ్యమయ్యేది కాదు.
సింగీతంతో ఉన్న అనుబంధంతో ఈ లెజెండరీ అనుభవాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో గత నెల కమల్ హాసన్ అపూర్వ సింగీతం పేరుతో ఫిలిం ఫెస్టివల్ గా నాలుగు రోజులు స్పెషల్ ఈవెంట్ చేశారు. రాజా పార్వై (అమావాస్య చంద్రుడు) స్క్రీనింగ్ తో మొదలుపెట్టి వివిధ క్లాసిక్స్ ని ప్రదర్శిస్తూ ఎందరో మహామహులను భాగం చేసి ఫిలిం మేకింగ్ ని ఒక రిఫరెన్స్ గా నిర్వహించారు. నాగ అశ్విన్, లోకేష్ కనగరాజ్, మణిరత్నం, రాజీవ్ మీనన్, సంతాన భారతి, వైరముత్తు, సుహాసిని, అక్కినేని అమల, పిసి శ్రీరామ్, సిద్దార్థ్, శివ కార్తికేయన్, నాజర్, ఇళయరాజా, దేవిశ్రీ ప్రసాద్ లాంటి ఎందరో దిగ్గజాలు ఈ వేడుకకు విచ్చేశారు.
ఇంత ఏజ్ లోనూ సింగీతం శ్రీనివాసరావు వచ్చిన అతిథులతో ఓపికగా కబుర్లు చెబుతూ, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వివరణాత్మకంగా జవాబులు చెబుతూ ఉల్లాసంగా గడిపేశారు. ఇప్పటి ప్యాన్ ఇండియా సినిమాల పట్ల ఆయనకున్న అవగాహన చూసి తెల్లబోవడం గెస్టుల వంతయ్యింది. ఇలాంటివి తెలుగులోనూ జరగాలి. రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి లాంటి సీనియర్ దర్శకులను ఇలాంటి వేదికలకు తీసుకురావాలి. కె విశ్వనాధ్ కాలం చేశారు కానీ లేదంటే ఆ మహానుభావుడి జ్ఞాపకాలు నిక్షిప్తం అయ్యేవి. కమల్ తీసుకున్న చొరవ మూవీ లవర్స్ నే కాదు భవిష్యత్తు దర్శకులకు కూడా గొప్ప పాఠాలు అందించిందంటే అతిశయోక్తి కాదు.
This post was last modified on January 1, 2025 7:15 pm
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…