Movie News

ఆ డైరెక్టర్‍ అన్నిట్లో రాజీ పడిపోయాడు

‘ఆర్‍ఎక్స్ 100’ తర్వాత చేసే చిత్రానికి క్రేజీ స్టార్‍ కాస్ట్ వుండాలని అజయ్‍ భూపతి చాలా ట్రై చేసాడు. ఫామ్‍లో వున్న యువ హీరోలు అందరితోను కథాచర్చలు జరిపినా కానీ వర్కవుట్‍ అవలేదు. దాంతో రవితేజకు అనుగుణంగా కథలో మార్పులు చేసి మహాసముద్రం అనౌన్స్ చేసాడు. కానీ ఏవో కారణాలతో రవితేజ హ్యాండ్‍ ఇవ్వడంతో అజయ్‍ భూపతి ఏడాదికి పైగా హీరో దొరకక ఇబ్బందులు పడ్డాడు.

నాగచైతన్య, సమంత కాంబినేషన్లో ఈ చిత్రం లాంఛ్‍ చేయడానికి అతను చేయని ప్రయత్నమంటూ లేదు. హీరోలతో పాటు నిర్మాతలు కూడా వెనక్కు తగ్గడంతో చివరకు శర్వానంద్‍తో సినిమా ఖాయం చేసుకున్నాడు. శర్వానంద్‍ ఇప్పుడు ఏమంత ఫామ్‍లో లేడు. అతడిని యాక్షన్‍ నప్పదని ‘రాధా’, ‘రణరంగం’ చిత్రాలు నిరూపించినా కానీ మళ్లీ ఆ జోనర్‍పై ఒక రాయేసి చూస్తున్నాడు.

క్రేజీ హీరోయిన్‍ కావాలని అనుకున్న అజయ్‍ భూపతి హీరోయిన్‍ పరంగా కూడా రాజీ పడక తప్పలేదు. ఫ్లాప్‍ హీరోయిన్‍గా ముద్ర పడిన అదితి రావు హైదరి ఈ చిత్రంలో హీరోయిన్‍గా ఎంపికయింది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కనుమరుగయిన సిద్ధార్థ్కి మరో పాత్ర ఇవ్వడంతో కాంబినేషన్‍ పరంగా ఈ చిత్రం ఎలాంటి బజ్‍ క్రియేట్‍ చేయడం లేదు.

This post was last modified on October 13, 2020 7:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదుగా బాబూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పెట్టుబడుల‌కు ఎక్క‌డ అవ‌కాశం ఉంటే..…

2 hours ago

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

8 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

10 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

10 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

12 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

12 hours ago