మాళవిక మోహనన్.. చాలా ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో ఈ పేరు ఒక సెన్సేషన్. బాలీవుడ్లో దిశా పటాని తరహాలో హాట్ ఫొటో షూట్లతో ఈ మలయాళ అమ్మాయి కుర్ర కారును ఒక ఊపు ఊపేస్తూ ఉంటుంది. ‘మహర్షి’ సినిమాటోగ్రాఫర్ మోహనన్ తనయురాలైన మాళవిక.. స్టన్నింగ్ అందంతో తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. ఈ భామ ఎప్పుడో టాలీవుడ్లో అడుగు పెట్టాల్సింది. విజయ్ దేవరకొండ సరసన ఆమె కథానాయికగా ‘హీరో’ అనే సినిమా మొదలై కొంత చిత్రీకరణ తర్వాత ఆగిపోయింది.
తర్వాత కొన్ని చిత్రాలకు కథానాయికగా తన పేరు వినిపించింది కానీ.. అవీ ఖరారవ్వలేదు. ఎట్టకేలకు ‘రాజా సాబ్’తో ఆమె వచ్చే ఏడాది డెబ్యూ చేయనుంది. ఐతే తాను ప్రభాస్ సరసన ‘సలార్’ సినిమాలోనే నటించాల్సిందని మాళవిక తాజాగా వెల్లడించింది.‘సలార్’ సినిమాలో కథానాయిక పాత్రకు తనను దర్శకుడు ప్రశాంత్ నీల్ కన్సిడర్ చేసినట్లు ఆమె వెల్లడించింది. తమ మధ్య సంప్రదింపులు కూడా జరిగాయని.. ‘బాహుబలి’ చూసి ప్రభాస్ ఫ్యాన్గా మారిన తాను తన టాలీవుడ్ డెబ్యూ విషయంలో అప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యానని మాళవిక చెప్పింది.
కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నటించలేకపోయినట్లు ఆమె తెలిపింది. ఐతే తర్వాత తనకు మారుతి ఫోన్ చేసి ‘రాజా సాబ్’ కోసం అడిగాడని.. ‘సలార్’లో మిస్సయినప్పటికీ, మళ్లీ ప్రభాస్ చిత్రంతోనే టాలీవుడ్లోకి అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషించానని మాళవిక చెప్పింది.
ఈ సినిమాలో తన పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని.. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆమె తెలిపింది. వచ్చే ఏప్రిల్ 10కి అనుకున్న ఈ చిత్రం కొంత ఆలస్యం అయ్యేలా ఉంది. మే నెలాఖరులో విడుదల కావచ్చని భావిస్తున్నారు. రిలీజ్ డేట్ మీద అధికారిక ప్రకటన వచ్చేవరకు ఫ్యాన్స్ కి ఒక క్లారిటీ వచ్చేలా లేదు.
This post was last modified on December 30, 2024 4:23 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…