మాళవిక మోహనన్.. చాలా ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో ఈ పేరు ఒక సెన్సేషన్. బాలీవుడ్లో దిశా పటాని తరహాలో హాట్ ఫొటో షూట్లతో ఈ మలయాళ అమ్మాయి కుర్ర కారును ఒక ఊపు ఊపేస్తూ ఉంటుంది. ‘మహర్షి’ సినిమాటోగ్రాఫర్ మోహనన్ తనయురాలైన మాళవిక.. స్టన్నింగ్ అందంతో తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. ఈ భామ ఎప్పుడో టాలీవుడ్లో అడుగు పెట్టాల్సింది. విజయ్ దేవరకొండ సరసన ఆమె కథానాయికగా ‘హీరో’ అనే సినిమా మొదలై కొంత చిత్రీకరణ తర్వాత ఆగిపోయింది.
తర్వాత కొన్ని చిత్రాలకు కథానాయికగా తన పేరు వినిపించింది కానీ.. అవీ ఖరారవ్వలేదు. ఎట్టకేలకు ‘రాజా సాబ్’తో ఆమె వచ్చే ఏడాది డెబ్యూ చేయనుంది. ఐతే తాను ప్రభాస్ సరసన ‘సలార్’ సినిమాలోనే నటించాల్సిందని మాళవిక తాజాగా వెల్లడించింది.‘సలార్’ సినిమాలో కథానాయిక పాత్రకు తనను దర్శకుడు ప్రశాంత్ నీల్ కన్సిడర్ చేసినట్లు ఆమె వెల్లడించింది. తమ మధ్య సంప్రదింపులు కూడా జరిగాయని.. ‘బాహుబలి’ చూసి ప్రభాస్ ఫ్యాన్గా మారిన తాను తన టాలీవుడ్ డెబ్యూ విషయంలో అప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యానని మాళవిక చెప్పింది.
కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నటించలేకపోయినట్లు ఆమె తెలిపింది. ఐతే తర్వాత తనకు మారుతి ఫోన్ చేసి ‘రాజా సాబ్’ కోసం అడిగాడని.. ‘సలార్’లో మిస్సయినప్పటికీ, మళ్లీ ప్రభాస్ చిత్రంతోనే టాలీవుడ్లోకి అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషించానని మాళవిక చెప్పింది.
ఈ సినిమాలో తన పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని.. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆమె తెలిపింది. వచ్చే ఏప్రిల్ 10కి అనుకున్న ఈ చిత్రం కొంత ఆలస్యం అయ్యేలా ఉంది. మే నెలాఖరులో విడుదల కావచ్చని భావిస్తున్నారు. రిలీజ్ డేట్ మీద అధికారిక ప్రకటన వచ్చేవరకు ఫ్యాన్స్ కి ఒక క్లారిటీ వచ్చేలా లేదు.
This post was last modified on December 30, 2024 4:23 pm
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…
మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…
భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో…