ఈసారి సంక్రాంతికి రాబోయే చిత్రాల గురించి కొంచెం ముందుగానే క్లారిటీ వచ్చేసింది. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’తో పాటు నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ పండక్కి ఖరారయ్యాయి. ఐతే వీటిలో బడ్జెట్, బిజినెస్ పరంగా ‘గేమ్ చేంజర్’ నంబర్ వన్ ప్లేసులో ఉంటే.. రెండో స్థానం ‘డాకు మహారాజ్’కు దక్కుతుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ది మూడవ స్థానంగా చెప్పొచ్చు.
కానీ పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో, ప్రమోషన్లలో వెంకీ సినిమానే దూసుకెళ్తుండడం విశేషం. దాదాపు నెల రోజుల నుంచి నాన్ స్టాప్గా కంటెంట్ ఇస్తూ, ఏదో రకంగా ప్రమోషన్లు చేస్తూ టీం ఈ సినిమాను వార్తల్లో నిలబెడుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్.. హీరోయిన్లు ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి యాక్టివ్గా ప్రమోషన్లలో భాగం అవుతున్నారు. ‘గోదారి గట్టు మీద..’ పాట ఆల్రెడీ చార్ట్ బస్టర్ అయిపోయింది.
ఇప్పుడు వెంకీ స్వయంగా ఆలపించిన ‘పొంగల్ బ్లాక్బస్టర్’ సోషల్ మీడియాను ఊపేస్తోంది. మామూలుగా వెంకీ ప్రమోషన్లలో మరీ యాక్టివ్గా ఏమీ ఉండరు. ఆయన కొంచెం బిడియస్తుడు. ప్రి రిలీజ్ ఈవెంట్లో సందడి చేయడం, మీడియాతో చిట్ చాట్ నిర్వహించడం లాంటివి చేస్తారంతే. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ విషయంలో మాత్రం ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ప్రమోషనల్ ఈవెంట్లకు హాజరవుతున్నారు. అలాగే ప్రమోషనల్ వీడియోల్లోనూ భాగం అవుతున్నారు.
వెంకీ ఇంతగా ఏ సినిమాను ప్రమోట్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా తీయడంతో సరిపెట్టకుండా డిఫరెంట్గా, ఎంటర్టైనింగ్గా ప్రమోషన్లనూ ప్లాన్ చేస్తూ సినిమాకు చాలా మేలే చేస్తున్నారు. పండక్కి సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం వల్ల ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. మిగతా రెండు సంక్రాంతి చిత్రాలు ప్రమోషన్ల పరంగా బాగా వెనుకబడి ఉన్నాయనే చెప్పాలి. ఇకనైనా అవి జోరు పెంచాల్సిందే.
This post was last modified on December 29, 2024 9:15 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…