కొన్ని క్రేజీ కలయికలు తెరమీద చూడాలని ఎంత బలంగా కోరుకున్నా జరగవు. ముఖ్యంగా మల్టీస్టారర్లు. అందుకే ఆర్ఆర్ఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేతులు కలిపినప్పుడు అదో సెన్సేషన్ అయ్యింది. సీనియర్ హీరోల్లోనూ ఇలాంటి కాంబోలు రావాలని అభిమానులు ఎన్నోసార్లు అనుకున్నారు కానీ జరగలేదు. ఆ ముచ్చటని మరో రూపంలో అన్ స్టాపబుల్ టాక్ షో తీరుస్తోంది. తాజాగా బాలకృష్ణతో కబుర్లు పంచుకునేందుకు విక్టరీ వెంకటేష్ రావడంతో ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. బయట ఈవెంట్లలో కలవడం సహజమే కానీ ఇలా గంటన్నరసేపు మాట్లాడుకోవడం ఏ సినిమాకూ తీసిపోలేదు.
ఈ సందర్భంగా వెంకటేష్ పలు కబుర్లు ప్రేక్షకుల కోసం పంచుకున్నారు. నాగచైతన్య చిన్నప్పుడు బొద్దుగా ఉండి హగ్ చేసుకునే జ్ఞాపకాలతో మొదలుపెట్టి వెంకీ మామ స్పెషల్ మెమరీగా ఎలా ఉండిపోయిందనేది చెప్పుకొచ్చారు. రానా, వెంకీ ఇద్దరు కుమార్తెలు, భార్య నీరజ, అన్నయ్య సురేష్ బాబు గురించి మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు హత్తుకునేలా సాగాయి. తండ్రి రామానాయుడు ప్రస్తావన వచ్చినప్పుడు ఎమోషనలైన వెంకటేష్ ఆయనని చూసే కుటుంబాన్ని, వృత్తిని బ్యాలన్స్ చేయడం నేర్చుకున్నానని చెప్పారు. పనిలో పనిగా సురేష్ బాబు కూడా అక్కడికి విచ్చేయడం మరింత కళను తీసుకొచ్చింది.
వెంకటేష్ డెబ్యూ కలియుగ పాండవుల ప్రస్తావన కూడా ఈ సందర్భంగా వచ్చింది. 1986 లో విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న టైంలో ఇండియాలో బిజినెస్ చేయాలనే ఆలోచన ఉండేదని, కానీ నాన్న పిలుపుతో హీరో అయ్యానని గుర్తు చేసుకున్నారు. పరిశ్రమకు వచ్చే సమయానికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఫామ్ లో ఉండటాన్ని ప్రస్తావించారు. నలుగురిని నాలుగు స్తంభాలుగా చెప్పుకోవడం బాగుంది. టాక్ షో ప్రీ క్లైమాక్స్ లో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, దర్శకుడు అనిల్ రావిపూడి రావడంతో సందడి వాతావరణం పెరిగింది. మొత్తానికి బొబ్బిలి సింహంతో బొబ్బిలి రాజా కాంబో బుల్లితెరపై చూడముచ్చటగా సాగింది.
This post was last modified on December 28, 2024 10:18 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…