కొన్ని క్రేజీ కలయికలు తెరమీద చూడాలని ఎంత బలంగా కోరుకున్నా జరగవు. ముఖ్యంగా మల్టీస్టారర్లు. అందుకే ఆర్ఆర్ఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేతులు కలిపినప్పుడు అదో సెన్సేషన్ అయ్యింది. సీనియర్ హీరోల్లోనూ ఇలాంటి కాంబోలు రావాలని అభిమానులు ఎన్నోసార్లు అనుకున్నారు కానీ జరగలేదు. ఆ ముచ్చటని మరో రూపంలో అన్ స్టాపబుల్ టాక్ షో తీరుస్తోంది. తాజాగా బాలకృష్ణతో కబుర్లు పంచుకునేందుకు విక్టరీ వెంకటేష్ రావడంతో ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. బయట ఈవెంట్లలో కలవడం సహజమే కానీ ఇలా గంటన్నరసేపు మాట్లాడుకోవడం ఏ సినిమాకూ తీసిపోలేదు.
ఈ సందర్భంగా వెంకటేష్ పలు కబుర్లు ప్రేక్షకుల కోసం పంచుకున్నారు. నాగచైతన్య చిన్నప్పుడు బొద్దుగా ఉండి హగ్ చేసుకునే జ్ఞాపకాలతో మొదలుపెట్టి వెంకీ మామ స్పెషల్ మెమరీగా ఎలా ఉండిపోయిందనేది చెప్పుకొచ్చారు. రానా, వెంకీ ఇద్దరు కుమార్తెలు, భార్య నీరజ, అన్నయ్య సురేష్ బాబు గురించి మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు హత్తుకునేలా సాగాయి. తండ్రి రామానాయుడు ప్రస్తావన వచ్చినప్పుడు ఎమోషనలైన వెంకటేష్ ఆయనని చూసే కుటుంబాన్ని, వృత్తిని బ్యాలన్స్ చేయడం నేర్చుకున్నానని చెప్పారు. పనిలో పనిగా సురేష్ బాబు కూడా అక్కడికి విచ్చేయడం మరింత కళను తీసుకొచ్చింది.
వెంకటేష్ డెబ్యూ కలియుగ పాండవుల ప్రస్తావన కూడా ఈ సందర్భంగా వచ్చింది. 1986 లో విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న టైంలో ఇండియాలో బిజినెస్ చేయాలనే ఆలోచన ఉండేదని, కానీ నాన్న పిలుపుతో హీరో అయ్యానని గుర్తు చేసుకున్నారు. పరిశ్రమకు వచ్చే సమయానికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఫామ్ లో ఉండటాన్ని ప్రస్తావించారు. నలుగురిని నాలుగు స్తంభాలుగా చెప్పుకోవడం బాగుంది. టాక్ షో ప్రీ క్లైమాక్స్ లో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, దర్శకుడు అనిల్ రావిపూడి రావడంతో సందడి వాతావరణం పెరిగింది. మొత్తానికి బొబ్బిలి సింహంతో బొబ్బిలి రాజా కాంబో బుల్లితెరపై చూడముచ్చటగా సాగింది.
This post was last modified on December 28, 2024 10:18 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…