హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం లాంటి ఎన్నో క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం, కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు లాంటి సూపర్ హిట్స్ ని ఇండస్ట్రీకి అందించారు. బాలీవుడ్ లో చూసుకుంటే లెజెండరీ రాజ్ కపూర్ ఇచ్చిన ఆణిముత్యాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. ఇదే తరహాలో తాను కూడా డైరెక్షన్ లో ప్రూవ్ చేసుకుందామని నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న నటనానుభవం నుంచి నేర్చుకున్న పాఠాలతో మోహన్ లాల్ మెగా ఫోన్ పట్టుకున్నారు.
బరోజ్ 3డిని భారీ ఎత్తున నిన్న మలయాళం, తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేశారు. నాలుగు వందల సంవత్సరాల క్రితం పోర్చుగీస్ రాజు డీగామా దాచి పెట్టిన బంగారు నిధిని కాపాడే బరోజ్ దాన్ని వారసులకు అందజేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పదమూడో తరానికి చెందిన గామా మనవరాలు ఇసబెల్లా గోవాకు వచ్చినప్పుడు బరోజ్ ఆమెను కలుస్తాడు. తర్వాత జరిగేది అసలు స్టోరీ. పాయింట్ పరంగా చూస్తే చందమామ కథలా అనిపించినా దాన్ని ఆసక్తికరంగా మలచడంలో మోహన్ లాల్ తడబడిన వైనం సాంకేతికంగా బలంగా ఉన్న కంటెంట్ ని బలహీనంగా మార్చింది. ఎలాంటి భావోద్వేగాలు ఉండవు.
బాహుబలిలో కట్టప్పని స్ఫూర్తిగా తీసుకుని బరోజ్ డిజైన్ చేశారు కానీ రాజమౌళి తరహాలో భావోద్వేగాలు, ఎలివేషన్లు పండించడంలో మోహన్ లాల్ విఫలమయ్యారు. పైగా హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉండాలని నేటివిటీని మిస్ చేయడంతో ఏదో ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కథనం మీద ఇంకా బాగా పని చేయాల్సింది. బాక్సాఫీస్ ఫలితం మలయాళంలో ఏమో కానీ ఇతర భాషల్లో మాత్రం సోసోగానే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బలమైన పోటీలో దిగిన బరోజ్ కు అటు కేరళలోనూ మార్కో రూపంలో పెద్ద పోటీ అడ్డుగా నిలుస్తుంది. ఈ లెక్కన లాల్ కష్టానికి తగ్గ రిజల్ట్ రావడం అనుమానంగానే ఉంది.
This post was last modified on December 26, 2024 9:58 am
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…