Movie News

సూర్యకు సరైన రూటు వేసిన సుబ్బరాజ్!

కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీగా కంగువ మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సూర్యకి అది కోలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలవడం జీర్ణించుకోలేకపోయాడు. ఇతర భాషల్లో ఏమో కానీ తమిళంలోనూ కనీసం యావరేజ్ కాకపోవడం ఫ్యాన్స్ ఊహించని షాక్. సరే జరిగిందేదో జరిగిందని సర్దిచెప్పుకున్నారు కానీ నిజానికి గత కొన్నేళ్లుగా సూర్య సెలక్షన్ ఏమంత బాగాలేదు. కథలు, దర్శకుల ఎంపికలో చేస్తున్న తప్పుల వల్ల మార్కెట్ చేజేతులా దెబ్బ తింటోంది. ఎట్టకేలకు తన నుంచి అభిమానులు ఏది కోరుకుంటున్నారో దాన్నిచ్చే కాంబినేషన్ ని సూర్య ఎంచుకున్నాడు.

సూర్య, పేట ఫేమ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాకు రెట్రో టైటిల్ ఫిక్స్ చేశారు. ఇవాళ క్రిస్మస్ సందర్భంగా టీజర్ రిలీజయ్యింది. మెయిన్ పాయింట్ ఏంటో చెప్పేశారు. పేరు మోసిన ఒక డాన్ కొడుకు తండ్రి మాఫియా వారసత్వాన్ని మోస్తూ హింస, రక్తపాతం మధ్య బ్రతుకుతూ ఉంటాడు. ఓ అందమైన అమ్మాయి పరిచయమయ్యాక ఆమె కోసం అన్నీ వదిలేసి ఒక మాములు మనిషిగా మారాలని నిర్ణయించుకుంటాడు. దాని కోసమే కొత్త జీవితాన్ని మొదలుపెడతాడు. అయితే నేరాలతో నిండిపోయిన గత చరిత్ర తాలూకు మరకలు వెంటాడుతూనే ఉంటాయి. అతనేం చేశాడనేది రెట్రో.

కథ పరంగా కొత్తదనం లేకపోయినా యాక్షన్ విజువల్స్, రెండు షేడ్స్ లో సూర్య వయొలెంట్ మాస్ అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఇంటెన్స్ టేకింగ్ తో ఆకట్టుకునే కార్తీక్ సుబ్బరాజ్ మరోసారి మేజిక్ చేసేలా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా వింటేజ్ సూర్యని బయటికి తీసిన విధానం కొత్తగా ఉంది. ఇలాంటివి సూర్య గతంలో చేశాడు కానీ రెట్రో మాత్రం అంచనాలు రేకెత్తించేలా ఉంది. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేటయ్యింది. ఇవన్నీ ఒక ఎత్తయితే మంచి హోమ్లీ లుక్స్ లో అమాయకంగా కనిపించే పాత్రలో హీరోయిన్ పూజా హెగ్డే సరికొత్తగా దర్శనమిస్తోంది. 2025 వేసవిలో రెట్రో రిలీజ్ కానుంది.

This post was last modified on December 25, 2024 12:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

58 seconds ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago