కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీగా కంగువ మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సూర్యకి అది కోలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలవడం జీర్ణించుకోలేకపోయాడు. ఇతర భాషల్లో ఏమో కానీ తమిళంలోనూ కనీసం యావరేజ్ కాకపోవడం ఫ్యాన్స్ ఊహించని షాక్. సరే జరిగిందేదో జరిగిందని సర్దిచెప్పుకున్నారు కానీ నిజానికి గత కొన్నేళ్లుగా సూర్య సెలక్షన్ ఏమంత బాగాలేదు. కథలు, దర్శకుల ఎంపికలో చేస్తున్న తప్పుల వల్ల మార్కెట్ చేజేతులా దెబ్బ తింటోంది. ఎట్టకేలకు తన నుంచి అభిమానులు ఏది కోరుకుంటున్నారో దాన్నిచ్చే కాంబినేషన్ ని సూర్య ఎంచుకున్నాడు.
సూర్య, పేట ఫేమ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాకు రెట్రో టైటిల్ ఫిక్స్ చేశారు. ఇవాళ క్రిస్మస్ సందర్భంగా టీజర్ రిలీజయ్యింది. మెయిన్ పాయింట్ ఏంటో చెప్పేశారు. పేరు మోసిన ఒక డాన్ కొడుకు తండ్రి మాఫియా వారసత్వాన్ని మోస్తూ హింస, రక్తపాతం మధ్య బ్రతుకుతూ ఉంటాడు. ఓ అందమైన అమ్మాయి పరిచయమయ్యాక ఆమె కోసం అన్నీ వదిలేసి ఒక మాములు మనిషిగా మారాలని నిర్ణయించుకుంటాడు. దాని కోసమే కొత్త జీవితాన్ని మొదలుపెడతాడు. అయితే నేరాలతో నిండిపోయిన గత చరిత్ర తాలూకు మరకలు వెంటాడుతూనే ఉంటాయి. అతనేం చేశాడనేది రెట్రో.
కథ పరంగా కొత్తదనం లేకపోయినా యాక్షన్ విజువల్స్, రెండు షేడ్స్ లో సూర్య వయొలెంట్ మాస్ అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఇంటెన్స్ టేకింగ్ తో ఆకట్టుకునే కార్తీక్ సుబ్బరాజ్ మరోసారి మేజిక్ చేసేలా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా వింటేజ్ సూర్యని బయటికి తీసిన విధానం కొత్తగా ఉంది. ఇలాంటివి సూర్య గతంలో చేశాడు కానీ రెట్రో మాత్రం అంచనాలు రేకెత్తించేలా ఉంది. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేటయ్యింది. ఇవన్నీ ఒక ఎత్తయితే మంచి హోమ్లీ లుక్స్ లో అమాయకంగా కనిపించే పాత్రలో హీరోయిన్ పూజా హెగ్డే సరికొత్తగా దర్శనమిస్తోంది. 2025 వేసవిలో రెట్రో రిలీజ్ కానుంది.
This post was last modified on December 25, 2024 12:13 pm
కొన్ని సినీ సిత్రాలు విచిత్రంగా ఉంటాయి. అవి సదరు హీరోలు దర్శకులు చెప్పినప్పుడే బయటికి వస్తాయి. అలాంటిదే ఇది. ఎల్లుండి…
పహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో భారత్ కు చెందిన 26 మంది సాధారణ పౌరులు మృత్యువాత పడిన సంగతి…
సమంత నిర్మాతగా మారి తీసిన శుభం ఎల్లుండి విడుదల కాబోతోంది. దీని మీద బోలెడంత నమ్మకంతో ఉన్న సామ్ నిన్నటి…
జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగానే పరిగణించింది. ఉగ్ర దాడి జరిగిన నాటి…
ఇవాళ ఉదయం నిద్ర లేచి కళ్ళు తెరిచి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా చూసిన భారతీయుల మొహాలు ఒక్కసారిగా ఆనందంతో…
భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ సిందూర్’…