జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ క్యాన్సర్ తో పోరాడుతూ ‘దేవర’ సినిమా చూడాలని ఉందని కోరిన వీడియో గతంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడిన తారక్…కౌశిక్ చికిత్సకు సాయం చేస్తానని మాటిచ్చారు. అయితే, ఆ తర్వాత ఎన్టీఆర్ తమకు ఏ సాయం చేయలేదని, తారక్ అభిమానులు మాత్రం రెండున్నర లక్షలు ఇచ్చారని కౌశిక్ తల్లి సరస్వతి నిన్న చేసిన ఆరోపణలు దుమారం రేపాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా తారక్ టీం ఆస్పత్రి పెండింగ్ బిల్లు చెల్లించడంతో కౌశిక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చెన్నైలో అపోలో చికిత్స నిమిత్తం ఏపీ ప్రభుత్వం రూ.11 లక్షలు, టీటీడీ నుంచి రూ.40 లక్షలు ఆర్థిక సాయం అందిందని చెప్పారు సరస్వతి. ఇంకా, రూ. 20 లక్షలు కట్టాలని ఆసుపత్రి యాజమాన్యం అడుగుతోందని, తమను ఆదుకోవాలని కోరారు.
జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ సంప్రదించేందుకు, సోషల్ మీడియా ద్వారా ఆయనకు సందేశం పంపడం తమకు తెలియలేదని చెప్పారు. అయితే, ఈ విషయంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పందించారు. కౌశిక్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నామని, వారి కుటుంబంతో టచ్ లో ఉన్నామని అన్నారు. ఈ క్రమంలోనే హాస్పిటల్ కి వెళ్లి కౌశిక్ చికిత్స తాలూకు పెండింగ్ బిల్స్ ను తారక్ టీం క్లియర్ చేసినట్లు తెెలుస్తోంది. బిల్ సెటిల్డ్ అంటూ తారక్ ఫ్యాన్ ఒకరు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కౌశిక్ ఇష్యూ ద్వారా తారక్ పై కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని కొందరు ట్రై చేశారని, వారు ఇక విశ్రాంతి తీసుకోవచ్చని తారక్ ప్యాన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అభిమానులను ఆదుకోవడంలో తారక్ ఎప్పుడూ ముందే ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా వివాదానికి తావు లేకుండా ఈ ఇష్యూ సాల్వ్ అయిందని, ఇందులో ఎవరి తప్పు లేదని నెటిజన్లు అంటున్నారు.
This post was last modified on December 24, 2024 7:41 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…