ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక చెప్పుకోదగ్గ కొత్త రిలీజు ఉండేది. కానీ సంక్రాంతి కామధేనువుగా మారాక ఈ డేట్ ని నిర్మాతలు లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే 2025 ఓపెనింగ్ ఈసారి పాత సినిమాలతో మొదలుకానుంది. 1997లో చిరంజీవి కంబ్యాక్ గా నిలిచిన బ్లాక్ బస్టర్ ‘హిట్లర్’ని పాతిక సంవత్సరాల తర్వాత థియేటర్లకు తీసుకొస్తున్నారు. చాలా ఏళ్లుగా ఇది శాటిలైట్ ఛానల్స్ లో రావడం లేదు. యూట్యూబ్ లో అఫీషియల్ గా అందుబాటులో లేదు. సో భారీ స్పందన వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.
ముఖ్యంగా అయిదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా చిరు పండించిన సెంటిమెంట్, అబ్బీబీ పాటకు డాన్స్ లాంటి ఆకర్షణలు వింటేజ్ ఫ్యాన్స్ ని ఆకర్షించే అవకాశం లేకపోలేదు. రాజమౌళి నితిన్ కాంబోలో వచ్చిన ‘సై’ని మరోసారి బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ చేయించబోతున్నారు. ప్యాన్ ఇండియా మూవీస్ మొదలుపెట్టక ముందు జక్కన్న తీసిన సూపర్ హిట్ ఇది. తెలుగోళ్లకు అసలు అలవాటే లేని రగ్బీ ఆట బ్యాక్ డ్రాప్ లో అంత కన్విన్సింగ్ గా తీయడం ఆయనకే చెల్లింది. ఆల్రెడీ ఒకసారి రీ రిలీజ్ జరుపుకుని మంచి కలెక్షన్లు దక్కించుకున్న సిద్దార్థ్ ‘ఓయ్’ మరోసారి పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.
జనవరి 4 ధనుష్ ‘రఘువరన్ బిటెక్’ వస్తోంది. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ యూత్ ఫుల్ మూవీ హాళ్లను మ్యూజిక్ కన్సర్ట్ గా మార్చడం ఖాయం. జనవరి 10 గేమ్ ఛేంజర్ వచ్చేదాకా చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడంతో నిర్మాతలు వీటిని తీసుకొస్తున్నారు. క్రిస్మస్ కొత్త సినిమాలు ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాలు ఇవ్వలేకపోవడంతో పాతవైనా ఫీడింగ్ కి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఎగ్జిబిటర్లున్నారు. రెండు మూడు నెలలుగా రీ రిలీజులకు ఆదరణ తగ్గిన నేపథ్యంలో ఎలాగూ సరిపడా స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ ట్రెండ్ కి ఊపొచ్చేలా ఇవేమైనా వర్కౌట్ అవుతాయేమో చూడాలి.
This post was last modified on December 24, 2024 5:26 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…