ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక చెప్పుకోదగ్గ కొత్త రిలీజు ఉండేది. కానీ సంక్రాంతి కామధేనువుగా మారాక ఈ డేట్ ని నిర్మాతలు లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే 2025 ఓపెనింగ్ ఈసారి పాత సినిమాలతో మొదలుకానుంది. 1997లో చిరంజీవి కంబ్యాక్ గా నిలిచిన బ్లాక్ బస్టర్ ‘హిట్లర్’ని పాతిక సంవత్సరాల తర్వాత థియేటర్లకు తీసుకొస్తున్నారు. చాలా ఏళ్లుగా ఇది శాటిలైట్ ఛానల్స్ లో రావడం లేదు. యూట్యూబ్ లో అఫీషియల్ గా అందుబాటులో లేదు. సో భారీ స్పందన వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.
ముఖ్యంగా అయిదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా చిరు పండించిన సెంటిమెంట్, అబ్బీబీ పాటకు డాన్స్ లాంటి ఆకర్షణలు వింటేజ్ ఫ్యాన్స్ ని ఆకర్షించే అవకాశం లేకపోలేదు. రాజమౌళి నితిన్ కాంబోలో వచ్చిన ‘సై’ని మరోసారి బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ చేయించబోతున్నారు. ప్యాన్ ఇండియా మూవీస్ మొదలుపెట్టక ముందు జక్కన్న తీసిన సూపర్ హిట్ ఇది. తెలుగోళ్లకు అసలు అలవాటే లేని రగ్బీ ఆట బ్యాక్ డ్రాప్ లో అంత కన్విన్సింగ్ గా తీయడం ఆయనకే చెల్లింది. ఆల్రెడీ ఒకసారి రీ రిలీజ్ జరుపుకుని మంచి కలెక్షన్లు దక్కించుకున్న సిద్దార్థ్ ‘ఓయ్’ మరోసారి పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.
జనవరి 4 ధనుష్ ‘రఘువరన్ బిటెక్’ వస్తోంది. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ యూత్ ఫుల్ మూవీ హాళ్లను మ్యూజిక్ కన్సర్ట్ గా మార్చడం ఖాయం. జనవరి 10 గేమ్ ఛేంజర్ వచ్చేదాకా చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడంతో నిర్మాతలు వీటిని తీసుకొస్తున్నారు. క్రిస్మస్ కొత్త సినిమాలు ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాలు ఇవ్వలేకపోవడంతో పాతవైనా ఫీడింగ్ కి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఎగ్జిబిటర్లున్నారు. రెండు మూడు నెలలుగా రీ రిలీజులకు ఆదరణ తగ్గిన నేపథ్యంలో ఎలాగూ సరిపడా స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ ట్రెండ్ కి ఊపొచ్చేలా ఇవేమైనా వర్కౌట్ అవుతాయేమో చూడాలి.
This post was last modified on December 24, 2024 5:26 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…