ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక చెప్పుకోదగ్గ కొత్త రిలీజు ఉండేది. కానీ సంక్రాంతి కామధేనువుగా మారాక ఈ డేట్ ని నిర్మాతలు లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే 2025 ఓపెనింగ్ ఈసారి పాత సినిమాలతో మొదలుకానుంది. 1997లో చిరంజీవి కంబ్యాక్ గా నిలిచిన బ్లాక్ బస్టర్ ‘హిట్లర్’ని పాతిక సంవత్సరాల తర్వాత థియేటర్లకు తీసుకొస్తున్నారు. చాలా ఏళ్లుగా ఇది శాటిలైట్ ఛానల్స్ లో రావడం లేదు. యూట్యూబ్ లో అఫీషియల్ గా అందుబాటులో లేదు. సో భారీ స్పందన వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.
ముఖ్యంగా అయిదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా చిరు పండించిన సెంటిమెంట్, అబ్బీబీ పాటకు డాన్స్ లాంటి ఆకర్షణలు వింటేజ్ ఫ్యాన్స్ ని ఆకర్షించే అవకాశం లేకపోలేదు. రాజమౌళి నితిన్ కాంబోలో వచ్చిన ‘సై’ని మరోసారి బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ చేయించబోతున్నారు. ప్యాన్ ఇండియా మూవీస్ మొదలుపెట్టక ముందు జక్కన్న తీసిన సూపర్ హిట్ ఇది. తెలుగోళ్లకు అసలు అలవాటే లేని రగ్బీ ఆట బ్యాక్ డ్రాప్ లో అంత కన్విన్సింగ్ గా తీయడం ఆయనకే చెల్లింది. ఆల్రెడీ ఒకసారి రీ రిలీజ్ జరుపుకుని మంచి కలెక్షన్లు దక్కించుకున్న సిద్దార్థ్ ‘ఓయ్’ మరోసారి పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.
జనవరి 4 ధనుష్ ‘రఘువరన్ బిటెక్’ వస్తోంది. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ యూత్ ఫుల్ మూవీ హాళ్లను మ్యూజిక్ కన్సర్ట్ గా మార్చడం ఖాయం. జనవరి 10 గేమ్ ఛేంజర్ వచ్చేదాకా చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడంతో నిర్మాతలు వీటిని తీసుకొస్తున్నారు. క్రిస్మస్ కొత్త సినిమాలు ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాలు ఇవ్వలేకపోవడంతో పాతవైనా ఫీడింగ్ కి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఎగ్జిబిటర్లున్నారు. రెండు మూడు నెలలుగా రీ రిలీజులకు ఆదరణ తగ్గిన నేపథ్యంలో ఎలాగూ సరిపడా స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ ట్రెండ్ కి ఊపొచ్చేలా ఇవేమైనా వర్కౌట్ అవుతాయేమో చూడాలి.
This post was last modified on December 24, 2024 5:26 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…