ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక చెప్పుకోదగ్గ కొత్త రిలీజు ఉండేది. కానీ సంక్రాంతి కామధేనువుగా మారాక ఈ డేట్ ని నిర్మాతలు లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే 2025 ఓపెనింగ్ ఈసారి పాత సినిమాలతో మొదలుకానుంది. 1997లో చిరంజీవి కంబ్యాక్ గా నిలిచిన బ్లాక్ బస్టర్ ‘హిట్లర్’ని పాతిక సంవత్సరాల తర్వాత థియేటర్లకు తీసుకొస్తున్నారు. చాలా ఏళ్లుగా ఇది శాటిలైట్ ఛానల్స్ లో రావడం లేదు. యూట్యూబ్ లో అఫీషియల్ గా అందుబాటులో లేదు. సో భారీ స్పందన వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.
ముఖ్యంగా అయిదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా చిరు పండించిన సెంటిమెంట్, అబ్బీబీ పాటకు డాన్స్ లాంటి ఆకర్షణలు వింటేజ్ ఫ్యాన్స్ ని ఆకర్షించే అవకాశం లేకపోలేదు. రాజమౌళి నితిన్ కాంబోలో వచ్చిన ‘సై’ని మరోసారి బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ చేయించబోతున్నారు. ప్యాన్ ఇండియా మూవీస్ మొదలుపెట్టక ముందు జక్కన్న తీసిన సూపర్ హిట్ ఇది. తెలుగోళ్లకు అసలు అలవాటే లేని రగ్బీ ఆట బ్యాక్ డ్రాప్ లో అంత కన్విన్సింగ్ గా తీయడం ఆయనకే చెల్లింది. ఆల్రెడీ ఒకసారి రీ రిలీజ్ జరుపుకుని మంచి కలెక్షన్లు దక్కించుకున్న సిద్దార్థ్ ‘ఓయ్’ మరోసారి పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.
జనవరి 4 ధనుష్ ‘రఘువరన్ బిటెక్’ వస్తోంది. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ యూత్ ఫుల్ మూవీ హాళ్లను మ్యూజిక్ కన్సర్ట్ గా మార్చడం ఖాయం. జనవరి 10 గేమ్ ఛేంజర్ వచ్చేదాకా చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడంతో నిర్మాతలు వీటిని తీసుకొస్తున్నారు. క్రిస్మస్ కొత్త సినిమాలు ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాలు ఇవ్వలేకపోవడంతో పాతవైనా ఫీడింగ్ కి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఎగ్జిబిటర్లున్నారు. రెండు మూడు నెలలుగా రీ రిలీజులకు ఆదరణ తగ్గిన నేపథ్యంలో ఎలాగూ సరిపడా స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ ట్రెండ్ కి ఊపొచ్చేలా ఇవేమైనా వర్కౌట్ అవుతాయేమో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…