మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద కాస్త సందడి వాతావరణాన్ని తీసుకొచ్చింది. అయితే యునానిమస్ టాక్ దేనికీ రాకపోవడం విచారమే అయినా వీటితో పాటు ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో డాక్యుమెంటరీని థియేటర్లకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే పరిమిత స్క్రీన్లలో విడుదల చేయడం వల్ల ఎక్కువ శాతం ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. అయినా ఓటిటిలో పెట్టాల్సిన కంటెంట్ ని రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి చూస్తారా అనే కామెంట్స్ రాకపోలేదు. ప్రమోషన్ పెద్దగా చేయలేదు.
వీటి సంగతి ఎలా ఉన్నా 1 గంట 40 నిమిషాల ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఫ్యాన్స్ కి పైసా వసూల్ అనిపించేలా ఉంది. ఎందుకంటే చరణ్ ఇంట్రోలో వేలాది మందిని పోగేసి తీసిన పోలీస్ స్టేషన్ ఫైట్, పులితో తలపడే తారక్ ఎపిసోడ్, ఇంటర్వెల్ బాంగ్ లో జంతువులను ట్రక్కు నుంచి దూసుకొచ్చే ఘట్టం, నాటు నాటు పాట వెనుక కష్టాలు, క్లైమాక్స్ ని గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసిన విధానం, పనిచేసిన వాళ్ళ ఇంటర్వ్యూలు ఇలా బోలెడు విశేషాలను ఇందులో పొందుపరిచారు. ఇప్పటిదాకా చూడని అరుదైన ఫుటేజ్, విజువల్స్, ఆన్ సెట్స్ వీడియోలు దీంట్లో రివీల్ చేశారు.
సంతృప్తి పరిచింది కానీ ఇలాంటివి థియేటర్ కు వెళ్లి మరీ చూసేంత ఆసక్తి అందరికీ ఉండదనే ఉద్దేశంతో లిమిటెడ్ స్క్రీన్స్ కాన్సెప్ట్ పెట్టుకున్నారు. అందుకే దీనికొచ్చే వసూళ్ల గురించి ఎక్కడా ప్రస్తావన ఉండబోదు. ఈ డాక్యుమెంటరీని త్వరగా ఓటిటిలోకి వదిలితే బ్లాక్ బస్టర్ అవ్వొచ్చు. ఎందుకంటే చరణ్, తారక్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అన్ సీన్ (ఇప్పటిదాకా చూడని) కంటెంట్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. అది ఒక పరిధి వరకు నెరవేరిందనే చెప్పాలి. అయినా మహేష్ బాబు 29 ఎప్పుడు మొదలుపెడతారాని ఎదురు చూస్తుంటే ఇంకా ఆర్ఆర్ఆర్ హ్యాంగోవర్ ఏమిటి స్వామి అనేది సూపర్ స్టార్ ఫ్యాన్స్ ప్రశ్న.
This post was last modified on December 23, 2024 9:21 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…