పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా దీని ప్రస్తావన తేకుండా ఉండలేకపోతున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ మన్యం ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు పలుమార్లు ఫ్యాన్స్ ఒత్తిడి వల్ల ఓజి ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది. నిన్న అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్, తమన్ కు సైతం ఇది తప్పలేదు. ఒకవేళ తాను కనక సంక్రాంతికి రాకపోయి ఉంటే కళ్యాణ్ బాబాయ్ ని ఒప్పించి ఎలాగైనా ఓజి రిలీజయ్యేలా చూసేవాడినని చెప్పడంతో ఒక్కసారిగా స్టేడియం ఈలలతో హోరెత్తిపోయింది.
తమన్ ప్రసంగం మొదలుకాగానే వేరేది వినిపించనంత హోరులో ఎన్ఆర్ఐలు ఉక్కిరిబిక్కిరి చేశారు. ముందు గేమ్ ఛేంజర్ లో ఓజిని చూద్దామని ఆ తర్వాత మీ కోరిక నెరవేరుతుందని చెప్పిన తమన్ గతంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రోకు ఏం చేశానో తెలుసుగా ఈసారి అంతకు మించి చూస్తారనేలా హింట్ ఇవ్వడం మాములు కిక్ ఇవ్వలేదు. ఇండియన్ హిస్టరీని తిరగరాసే స్థాయిలో ఓజి ఉంటుందని చెప్పిన తమన్ ఈవెంట్ కొచ్చిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కావలసిన జోష్ అయితే ఇచ్చాడు. ఎస్ జే సూర్య మాట్లాడేటప్పుడు పవన్ పేరు ఎత్తగానే ఓ రెండు మూడు నిమిషాల పాటు ఏ సౌండ్ వినిపించనంత అల్లరి రేగింది.
దీన్ని బట్టే ఓజి ఫీవర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో ఇంకా పవన్ ఎంటర్ కాలేదు. ప్రస్తుతం హీరో లేని సన్నివేశాలు, పాటను బ్యాంకాక్ లో పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఓజి కన్నా ముందు హరిహర వీరమల్లు రిలీజవుతుందని తెలిసినా కూడా ఫ్యాన్స్ మాత్రం తమ ఛాయస్ ఏంటో పలు సందర్భాల్లో చెబుతూనే వస్తున్నారు. ఎలా చూసుకున్నా 2025 దీపావళి కన్నా ముందు ఓజి వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ అంతకన్నా ఆలస్యమైతే మాత్రం 2026 సంక్రాంతి బరిలో దింపుతారు. అప్పుడు ఎన్టీఆర్ నీల్ తో పాటు పోటీ రసవత్తరంగా మారుతుంది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…