ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి అమెరికాలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతున్న ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన నిర్మాత దిల్ రాజు ఊహించిన దానికన్నా చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన వైనం వీడియోల రూపంలో ఎక్స్ మొత్తం తిరుగుతోంది. వేడుక సందర్భంగా ఇవాళ ధోప్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు తమన్ దీని గురించి కొన్ని వారాలుగా ఫ్యాన్స్ ని తెగ ఊరిస్తున్నాడు. బెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్ గా అభిమానులు మాములు అంచనాలు పెట్టుకోలేదు.
పాట విషయానికి వస్తే స్లో మెలోడీలో హుషారైన బీట్స్ కంపోజ్ చేసిన తమన్ ఒక వెరైటీ అనుభూతి అయితే కలిగించాడు. వెంటనే మళ్ళీ మళ్ళీ వినాలనిపించిందనే ఎక్సైట్మెంట్ ని ఫ్యాన్స్ కి ఇస్తుందో లేదు వేచి చూడాలి. వీడియోలో ఆకట్టుకున్న ప్రధానమైన అంశం రామ్ చరణ్ స్టెప్పులు. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు తప్ప వేరే డాన్స్ చేసే అవకాశం రాజమౌళి ఇవ్వలేదు. ఆచార్యలోనూ పెద్దగా స్కోప్ దక్కలేదు తండ్రితో కలిసి కాలు కదపడం తప్ప. కానీ గేమ్ ఛేంజర్ లో మాత్రం శంకర్ ఫుల్ గా వాడుకున్న వైనం కనిపిస్తోంది. ముఖ్యంగా సింగల్ టేక్ లో అరనిమిషం పైగా ఉన్న రెండు క్లిప్స్ అప్పుడే విపరీతమైన రీచ్ తెచ్చుకుంటున్నాయి.
ఇప్పటిదాకా వచ్చిన నాలుగు పాటల్లో దీని స్థానం ఏమిటనేది మ్యూజిక్ లవర్స్ డిసైడ్ చేస్తారు కానీ దర్శకుడు శంకర్ నుంచి ఆశించిన గ్రాండియర్ మాత్రం ప్రతిపాటలోనూ కనిపిస్తోంది. చరణ్ లుక్స్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, కియారా అద్వాని గ్లామర్ అన్ని బాగా మిక్స్ అయ్యాయి. తమన్ చెప్పినంత స్థాయిలో ఈ దోప్ అనేది స్లో పాయిజన్ లా ఏ రేంజ్ కు వెళ్తుందో చూడాలి. జనవరి 10 రిలీజవుతున్న గేమ్ ఛేంజర్ కోసం ఏపీ, తెలంగాణలో భారీ ఎత్తున థియేటర్లకు సిద్ధం చేస్తున్నారు దిల్ రాజు. పోటీ సినిమాల కంటే రెండు రోజులు ముందే రావడం ఓపెనింగ్స్ పరంగా చాలా పెద్ద ప్లస్ కానుంది. సో కౌంట్ డౌన్ స్టార్ట్.
This post was last modified on December 22, 2024 11:44 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…