ఇవాళ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ మీద తెలంగాణ అసెంబ్లీ పెద్ద బాంబు వేసింది. సంధ్య థియేటర్ ఉదంతం గురించి జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద తీవ్ర విమర్శలు చేయడంతో పాటు పరామర్శకు వెళ్లిన ఇండస్ట్రీ మీద సైతం ఘాటు కామెంట్స్ చేయడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఇకపై ఎలాంటి టికెట్ రేట్ల హైక్స్, బెనిఫిట్ షోల అనుమతులు ఉండవని సీఎంతో పాటు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించడంతో ఒక్కసారిగా పరిశ్రమ షాక్ అయ్యింది. దీని పరిణామాలు మాములుగా ఉండవు.
పుష్ప 2 ది రూల్ తర్వాత రాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. నైజామ్ లో టికెట్ రేట్ల పెంపు లేకపోతే రెవిన్యూ బాగా ప్రభావితం చెందుతుంది. పైగా స్పెషల్ షోలు లేవంటే అదో పెద్ద లాస్. అసలే సంక్రాంతి సీజన్. హైదరాబాద్ జనాలు అధిక శాతం స్వంత ఊళ్లకు వెళ్ళిపోతారు. మిగిలినవాళ్లకు ప్రీమియర్లు లేవంటే దాని ఎఫెక్ట్ ఓపెనింగ్స్ మీద పడుతుంది. ఎందుకంటే రాత్రి సినిమా చూసేస్తే ఉదయం డ్యూటీలు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళెక్కువ. కానీ ఇప్పుడా జనాలు డైవర్ట్ అవుతారు. అసలే దిల్ రాజు దీని మీద మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారని టాక్. ప్రమోషన్లు కూడా ఆ స్థాయిలో చేస్తున్నారు.
సో దిల్ రాజు ఎంత తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్ మెన్ అయినా ప్రభుత్వ అంగీకారం లేకుండా తన సినిమాకైనా సరే వెసులుబాట్లు తెచ్చుకోలేరు. రాబోయే 2025 ప్రారంభంలో గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు హరిహర వీరమల్లు, విశ్వంభర, మిరాయ్, ది రాజా సాబ్ లాంటి చాలా ప్యాన్ ఇండియా సినిమాలు క్యూ కట్టాయి. ఒకవేళ కాంగ్రెస్ సర్కారు తమ పాలనలో వెసులుబాట్ల ప్రసక్తే ఉండదనే మాటకు కట్టుబడితే అందరికీ చిక్కులు తప్పదు. ఎటొచ్చి ఆంధ్రప్రదేశ్ లో సమస్య లేదు కాబట్టి అక్కడ రేట్లు, షోలు కొనసాగుతాయి కాబట్టి. రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కనక కొంత కాలం బెనిఫిట్స్ మర్చిపోవడం ఉత్తమం.
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…