Movie News

గేమ్ ఛేంజర్ మీద తెలంగాణ అసెంబ్లీ బాంబు!

ఇవాళ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ మీద తెలంగాణ అసెంబ్లీ పెద్ద బాంబు వేసింది. సంధ్య థియేటర్ ఉదంతం గురించి జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద తీవ్ర విమర్శలు చేయడంతో పాటు పరామర్శకు వెళ్లిన ఇండస్ట్రీ మీద సైతం ఘాటు కామెంట్స్ చేయడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఇకపై ఎలాంటి టికెట్ రేట్ల హైక్స్, బెనిఫిట్ షోల అనుమతులు ఉండవని సీఎంతో పాటు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించడంతో ఒక్కసారిగా పరిశ్రమ షాక్ అయ్యింది. దీని పరిణామాలు మాములుగా ఉండవు.

పుష్ప 2 ది రూల్ తర్వాత రాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. నైజామ్ లో టికెట్ రేట్ల పెంపు లేకపోతే రెవిన్యూ బాగా ప్రభావితం చెందుతుంది. పైగా స్పెషల్ షోలు లేవంటే అదో పెద్ద లాస్. అసలే సంక్రాంతి సీజన్. హైదరాబాద్ జనాలు అధిక శాతం స్వంత ఊళ్లకు వెళ్ళిపోతారు. మిగిలినవాళ్లకు ప్రీమియర్లు లేవంటే దాని ఎఫెక్ట్ ఓపెనింగ్స్ మీద పడుతుంది. ఎందుకంటే రాత్రి సినిమా చూసేస్తే ఉదయం డ్యూటీలు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళెక్కువ. కానీ ఇప్పుడా జనాలు డైవర్ట్ అవుతారు. అసలే దిల్ రాజు దీని మీద మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారని టాక్. ప్రమోషన్లు కూడా ఆ స్థాయిలో చేస్తున్నారు.

సో దిల్ రాజు ఎంత తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్ మెన్ అయినా ప్రభుత్వ అంగీకారం లేకుండా తన సినిమాకైనా సరే వెసులుబాట్లు తెచ్చుకోలేరు. రాబోయే 2025 ప్రారంభంలో గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు హరిహర వీరమల్లు, విశ్వంభర, మిరాయ్, ది రాజా సాబ్ లాంటి చాలా ప్యాన్ ఇండియా సినిమాలు క్యూ కట్టాయి. ఒకవేళ కాంగ్రెస్ సర్కారు తమ పాలనలో వెసులుబాట్ల ప్రసక్తే ఉండదనే మాటకు కట్టుబడితే అందరికీ చిక్కులు తప్పదు. ఎటొచ్చి ఆంధ్రప్రదేశ్ లో సమస్య లేదు కాబట్టి అక్కడ రేట్లు, షోలు కొనసాగుతాయి కాబట్టి. రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కనక కొంత కాలం బెనిఫిట్స్ మర్చిపోవడం ఉత్తమం.

Kumar

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

1 hour ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

2 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

2 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

3 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

3 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

3 hours ago