ఇవాళ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ మీద తెలంగాణ అసెంబ్లీ పెద్ద బాంబు వేసింది. సంధ్య థియేటర్ ఉదంతం గురించి జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద తీవ్ర విమర్శలు చేయడంతో పాటు పరామర్శకు వెళ్లిన ఇండస్ట్రీ మీద సైతం ఘాటు కామెంట్స్ చేయడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఇకపై ఎలాంటి టికెట్ రేట్ల హైక్స్, బెనిఫిట్ షోల అనుమతులు ఉండవని సీఎంతో పాటు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించడంతో ఒక్కసారిగా పరిశ్రమ షాక్ అయ్యింది. దీని పరిణామాలు మాములుగా ఉండవు.
పుష్ప 2 ది రూల్ తర్వాత రాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. నైజామ్ లో టికెట్ రేట్ల పెంపు లేకపోతే రెవిన్యూ బాగా ప్రభావితం చెందుతుంది. పైగా స్పెషల్ షోలు లేవంటే అదో పెద్ద లాస్. అసలే సంక్రాంతి సీజన్. హైదరాబాద్ జనాలు అధిక శాతం స్వంత ఊళ్లకు వెళ్ళిపోతారు. మిగిలినవాళ్లకు ప్రీమియర్లు లేవంటే దాని ఎఫెక్ట్ ఓపెనింగ్స్ మీద పడుతుంది. ఎందుకంటే రాత్రి సినిమా చూసేస్తే ఉదయం డ్యూటీలు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళెక్కువ. కానీ ఇప్పుడా జనాలు డైవర్ట్ అవుతారు. అసలే దిల్ రాజు దీని మీద మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారని టాక్. ప్రమోషన్లు కూడా ఆ స్థాయిలో చేస్తున్నారు.
సో దిల్ రాజు ఎంత తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్ మెన్ అయినా ప్రభుత్వ అంగీకారం లేకుండా తన సినిమాకైనా సరే వెసులుబాట్లు తెచ్చుకోలేరు. రాబోయే 2025 ప్రారంభంలో గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు హరిహర వీరమల్లు, విశ్వంభర, మిరాయ్, ది రాజా సాబ్ లాంటి చాలా ప్యాన్ ఇండియా సినిమాలు క్యూ కట్టాయి. ఒకవేళ కాంగ్రెస్ సర్కారు తమ పాలనలో వెసులుబాట్ల ప్రసక్తే ఉండదనే మాటకు కట్టుబడితే అందరికీ చిక్కులు తప్పదు. ఎటొచ్చి ఆంధ్రప్రదేశ్ లో సమస్య లేదు కాబట్టి అక్కడ రేట్లు, షోలు కొనసాగుతాయి కాబట్టి. రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కనక కొంత కాలం బెనిఫిట్స్ మర్చిపోవడం ఉత్తమం.
This post was last modified on December 21, 2024 5:19 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…