ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన పుష్ప… 2000 కోట్ల రూపాయల కలెక్షన్లను టార్గెట్ చేశాడు. అయితే, మరికొద్ది రోజుల్లో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రచారాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఖండించింది. పుష్ప-2 చిత్రం ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదని, 56 రోజుల తర్వాత మాత్రమే ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడగలరని క్లారిటీనిచ్చారు.
పుష్ప-2 వంటి పాన్ ఇండియా మూవీని ఈ హాలిడే సీజన్ లో థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని చెప్పారు. వరల్డ్ వైడ్ థియేటర్లలో పుష్ప వైల్డ్ ఫైర్ రాజుకుందని, కేవలం థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అంటున్నారు. పీలింగ్స్, కిస్సిక్ పాటల ఫుల్ వీడియో సాంగ్స్ రిలీజ్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా ఆ వార్త నిజమే అనుకున్నారు.
సాధారణంగా చిత్రం ఓటీటీలో విడుదల కావడానికి ముందు యూట్యూబ్లో రిలీజ్ అవుతుంటాయి. దీంతో పుష్ప-2 ఓటిటి రిలీజ్ డేట్ త్వరలోనే ఉంది అనే వాదనకు బలం చేకూరినట్లు అయింది. ఈ నేపథ్యంలోనే ఆ పుకార్లను మైత్రి మూవీ మేకర్స్ ఖండించారు. మైత్రి మూవీ మేకర్స్ తాజా ప్రకటనతో ఆ రూమర్లకు చెక్ పడ్డట్లయింది. కాబట్టి పుష్ప గాడి రూల్ ఇప్పట్లో ఇంటికి వచ్చేలా లేదు కాబట్టి సినిమా ని కేవలం ధియేటర్ లోనే చూడక తప్పదు.
కాబట్టి మరో నెల రోజుల పాటు పుష్ప గాడి రూల్ థియేటర్ లోనే బ్లాస్ట్ అవుతుందని తెలియడంతో 2000 కోట్ల మార్క్ ను పుష్ప 2 దాటేస్తుందని ఫ్యాన్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఆ రికార్డు బద్దలవుతుందో లేదో.
This post was last modified on December 20, 2024 8:40 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…