నిన్న రాత్రి హఠాత్తుగా దేశవ్యాప్తంగా ఉన్న పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో పుష్ప 2 ది రూల్ బుకింగ్స్ తీసేయడం సంచలనమయ్యింది. ఇవాళ ఉదయం నుంచి తిరిగి కొనసాగించారు కానీ ఆ కొన్నిగంటలు మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. ఎందుకంటే పదిహేను వందల కోట్ల గ్రాస్ దాటి రెండు వేల మైలురాయి వైపు పరుగులు పెడుతున్న తరుణంలో ఇలా జరగడం వసూళ్ల పరంగా పెద్ద దెబ్బ కొడుతుంది. పైగా ఉత్తరాది రాష్ట్రాల్లో పివిఆర్ తో పాటు మిరాజ్ సినిమాస్ కీలక థియేటర్ చైన్. ఈ ఇద్దరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. పరిష్కారం అయ్యింది కానీ అసలేం జరిగిందో చూద్దాం.
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం పుష్ప 2 ది రూల్ హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అనిల్ తదాని మూడో వారంలోనూ పెద్ద సంఖ్యలో స్క్రీన్లు కావాలని కోరుకున్నారు. డిసెంబర్ 25 బేబీ జాన్ రిలీజవుతున్నా సరే దాంతో సమానంగా యాభై శాతం థియేటర్లు పంచేలా వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు అగ్రిమెంట్ అడిగారట. ఇలా అయితే వరుణ్ ధావన్ మూవీకి రెండు రోజులు పెద్ద దెబ్బ పడుతుంది. దాంతో డిస్ట్రిబ్యూటర్లు ససేమిరా అన్నారు. ముఖ్యంగా పివిఆర్ కు ఈ కండీషన్ అభ్యంతరకరంగా అనిపించింది. దీంతో పలు దఫాల చర్చలు, మంతనాలు అవసరమయ్యాయి.
ఎట్టకేలకు కథ క్లైమాక్స్ కు చేరుకుంది కానీ పుష్ప 2 ప్రకంపనలు నార్త్ లో ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలేమో. వీకెండ్స్ లో మరోసారి పుంజుకునేలా కనిపిస్తున్న పుష్పరాజ్ వీలైనంత త్వరగా నెమ్మదించకపోతే బేబీ జాన్ కు ఇబ్బంది తప్పదు. తేరి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇది కనక హిట్టయితే ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ మార్పులను వాడుకునే అవకాశం లేకపోలేదు. దేశవ్యాప్తంగా బేబీ జాన్ కు పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా హిందీలో వస్తున్న చిత్రం ఇదొక్కటే.
This post was last modified on December 20, 2024 9:37 am
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…