Movie News

అంబానీపై సోనూ సూద్ పంచ్

రీల్ విలన్‌గా ఉన్న సోనూ సూద్.. కరోనా-లాక్‌డౌన్ టైంలో రియల్ హీరో అనిపించుకున్నాడు. అతడి ప్రతి మాటా, ప్రతి చర్యా ఇప్పుడు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా అతను చేసిన ఒక ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్లో అతను వేసిన పంచ్ భారత కుబేరుడు ముకేష్ అంబానీకి తగలడం విశేషం. కరోనా టైంలో ధనవంతులు మరింత ధనవంతులుగా మారారని.. పేదవాళ్లు మరింత పేదవాళ్లు అయ్యారని తన ట్వీట్లో పేర్కొన్నాడు సోనూ.

కరోనా-లాక్‌డౌన్‌తో అత్యధికంగా ప్రభావితం అయింది కింది స్థాయి వాళ్లే. రోజువారీ ఆదాయంతో బతికే వాళ్లలో చాలామందికి నెలల తరబడి ఉపాధి పోయింది. పేద, మధ్యతరగతి జీవులు లాక్‌డౌన్ టైంలో అల్లాడిపోయారు. వారి కష్టాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కోట్లాది మంది ఆర్థిక పరిస్థితి తల్లకిందులైంది.

కానీ ఇదే సమయంలో ముకేష్ అంబాని సహా కొందరు కుబేరుల సంపద అమాంతం పెరిగింది. ఈ ఏడాది ఆరంభానికి ముందు ముకేష్ అంబాని సంపద 59 బిలియన్ డాలర్లుగా ఉండగా.. కరోనా అన్ని రంగాలనూ కుదేలు చేసిన కొత్త ఏడాదిలో ముకేష్ సంపద అనూహ్యంగా పెరిగింది. 22 బిలియన్ డాలర్ల వృద్ధితో ఆయన సంపద 79.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆయన ఆధ్వర్యంలోని జియో సంస్థలోకి కరోనా టైంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఆయన సంపదను అమాంతం పెంచాయి.

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ దెబ్బకు అల్లాడిపోయిన కింది స్థాయి వర్గాలకు పెద్దగా చేసిందేమీ లేదు కానీ.. కార్పొరేట్లను మాత్రం తమ పాలసీలతో బాగా ఆదుకుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే సోనూ సూద్.. అంబాని లాంటి కుబేరులకు గట్టిగా తగిలేలా ట్విట్టర్లో పంచ్ వేశాడు. అతడి ట్వీట్‌కు నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది.

This post was last modified on October 11, 2020 10:04 am

Share
Show comments
Published by
satya

Recent Posts

అనిల్ రావిపూడిని చూసి నేర్చుకోవాలి

ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏదో ఫ్లోలో కొన్నిసార్లు నోరు జారుతుంటారు. కొందరిని హర్ట్ చేసేలా మాట్లాడతారు. ఐతే తాము…

17 mins ago

మా మామ నీచుడు-నికృష్టుడు: అంబ‌టి అల్లుడు

ఏపీలో రాజ‌కీయాలు ఊపందుకున్న నేప‌థ్యంలో సంచ‌ల‌నాలు కూడా అదే రేంజ్‌లో తెర‌మీదికి వ‌స్తున్నాయి. ప్ర‌స్తుత ప్ర‌ధాన పార్టీల‌న్నీ కూడా.. పెద్ద…

36 mins ago

నోటి ‘దురుసు’ తీరుస్తుందా ?!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే బూతులు. మంత్రులూ, ఎమ్మెల్యేలు తేడా లేకుండా విపక్ష నాయకుల మీద బూతులతో విరుచుకుపడే తీరు రాజకీయాలంటేనే…

2 hours ago

అన‌కాప‌ల్లిలో సీఎం ర‌మేష్‌పై వైసీపీ నేత‌ల దాడి.. గాయాలు!

ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. వైసీపీ వ‌ర్సెస్ బీజేపీ కార్య‌క‌ర్త ల మ‌ధ్య…

2 hours ago

ప్ర‌తినిధి-2.. ఇదైనా ఖాయం చేసుకోవ‌చ్చా?

నారా రోహిత్ చాలా గ్యాప్ త‌ర్వాత న‌టించిన సినిమా ప్ర‌తినిధి-2. ఒక‌ప్పుడు తీరిక లేకుండా సినిమాలు చేస్తూ ఒకే స‌మ‌యంలో…

3 hours ago

ప్రియాంకపై కాంగ్రెస్ లో కుట్ర ?!

రాయ్ బరేలీ నుండి పోటీకి దిగుతుంది అనుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయలేదు…

3 hours ago