Movie News

అంబానీపై సోనూ సూద్ పంచ్

రీల్ విలన్‌గా ఉన్న సోనూ సూద్.. కరోనా-లాక్‌డౌన్ టైంలో రియల్ హీరో అనిపించుకున్నాడు. అతడి ప్రతి మాటా, ప్రతి చర్యా ఇప్పుడు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా అతను చేసిన ఒక ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్లో అతను వేసిన పంచ్ భారత కుబేరుడు ముకేష్ అంబానీకి తగలడం విశేషం. కరోనా టైంలో ధనవంతులు మరింత ధనవంతులుగా మారారని.. పేదవాళ్లు మరింత పేదవాళ్లు అయ్యారని తన ట్వీట్లో పేర్కొన్నాడు సోనూ.

కరోనా-లాక్‌డౌన్‌తో అత్యధికంగా ప్రభావితం అయింది కింది స్థాయి వాళ్లే. రోజువారీ ఆదాయంతో బతికే వాళ్లలో చాలామందికి నెలల తరబడి ఉపాధి పోయింది. పేద, మధ్యతరగతి జీవులు లాక్‌డౌన్ టైంలో అల్లాడిపోయారు. వారి కష్టాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కోట్లాది మంది ఆర్థిక పరిస్థితి తల్లకిందులైంది.

కానీ ఇదే సమయంలో ముకేష్ అంబాని సహా కొందరు కుబేరుల సంపద అమాంతం పెరిగింది. ఈ ఏడాది ఆరంభానికి ముందు ముకేష్ అంబాని సంపద 59 బిలియన్ డాలర్లుగా ఉండగా.. కరోనా అన్ని రంగాలనూ కుదేలు చేసిన కొత్త ఏడాదిలో ముకేష్ సంపద అనూహ్యంగా పెరిగింది. 22 బిలియన్ డాలర్ల వృద్ధితో ఆయన సంపద 79.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆయన ఆధ్వర్యంలోని జియో సంస్థలోకి కరోనా టైంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఆయన సంపదను అమాంతం పెంచాయి.

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ దెబ్బకు అల్లాడిపోయిన కింది స్థాయి వర్గాలకు పెద్దగా చేసిందేమీ లేదు కానీ.. కార్పొరేట్లను మాత్రం తమ పాలసీలతో బాగా ఆదుకుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే సోనూ సూద్.. అంబాని లాంటి కుబేరులకు గట్టిగా తగిలేలా ట్విట్టర్లో పంచ్ వేశాడు. అతడి ట్వీట్‌కు నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది.

This post was last modified on October 11, 2020 10:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

46 minutes ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

54 minutes ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

57 minutes ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

2 hours ago

చాట్ జీపీటీ-డీప్ సీక్‌ల‌కు దూరం: కేంద్రం ఆదేశాలు!

ప్ర‌స్తుతం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్ర‌పంచం పుంజుకుంటోంది. ప్ర‌ధానంగా ఐటీ సంస్థ‌ల నుంచి ప్ర‌భుత్వ కార్యాల‌యాల వ‌ర‌కు కూడా ఏఐ ఆధారిత…

3 hours ago

వద్దనుకున్న దర్శకుడితో నాని సినిమా ?

ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…

3 hours ago