తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు అగ్ర నిర్మాత అశ్వినీదత్. ఆయన సంస్థ వైజయంతీ మూవీస్ది టాలీవుడ్లో దాదాపు ఐదు దశాబ్దాల ప్రస్థానం. మహానటి సినిమాతో ఆ సంస్థ మరోసారి తన స్థాయిని చాటిచెప్పింది. త్వరలో ప్రభాస్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని తలపెట్టిన ఈ సంస్థ మరో మెట్టు ఎక్కబోతోంది.
ఈ నేపథ్యంలో వింటేజ్ వైజయంతి’ పేరుతో సంస్థకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాల్ని వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి వీడియోను వైజయంతి మూవీస్ పంచుకుంది. రానా దగ్గుబాటి వాయిస్తోనే ఈ వీడియో రూపొందడం విశేషం. ఈ వీడియోలో వైజయంతి మూవీస్ సంస్థకు ఆ పేరు ఎలా వచ్చింది.. ఆ పేరు ఎవరు పెట్టారనే విషయాల్ని రానా పంచుకున్నాడు.
అశ్వనీదత్ 21 ఏళ్ల వయసులో విశ్వనాధ్ సినిమా ‘ఓ సీత కథ’తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఐతే నందమూరి తారక రామారావుగారితో సినిమా తీయాలన్నది ఆయన కల. పట్టువదలని విక్రమార్కుడిలా కష్టపడి ఎన్టీఆర్ అపాయింట్మెంట్ సాధించారు. ఆయనతో సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నారో ఎన్టీఆర్కు చెప్పారు.
దత్ మాటలకు ముచ్చటేసి ఎన్టీఆర్ ఒప్పుకున్నారు. అంతవరకు అశ్వనీదత్ బేనర్ కూడా స్థాపించలేదు. ఎన్టీఆర్ అడిగిన మొదటి ప్రశ్న.. బేనర్ పేరేంటి అని. విజయా సంస్థ లాంటిదేదో అయితే బాగుండు అని దత్ మనసులో మాట అట. కానీ బయటపెట్టలేదు.
అప్పుడే ఎన్టీఆర్.. అక్కడే ఉన్న కృష్ణుడి ఫొటోని చూపించి ఎన్నటికీ వాడిపోని వైజయంతి.. అదే నీ సంస్థ అని చెప్పారట. అప్పుడు స్వీయ దస్తూరితో ‘వైజయంతి మూవీస్’ అని రాసి ఇచ్చారట. ఎన్టీఆర్తో ఈ బేనర్లో దత్ చేసిన తొలి సినిమా ‘ఎదురులేని మనిషి’ సపర్ హిట్ అయింది. తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు.
This post was last modified on April 29, 2020 11:10 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…