తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు అగ్ర నిర్మాత అశ్వినీదత్. ఆయన సంస్థ వైజయంతీ మూవీస్ది టాలీవుడ్లో దాదాపు ఐదు దశాబ్దాల ప్రస్థానం. మహానటి సినిమాతో ఆ సంస్థ మరోసారి తన స్థాయిని చాటిచెప్పింది. త్వరలో ప్రభాస్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని తలపెట్టిన ఈ సంస్థ మరో మెట్టు ఎక్కబోతోంది.
ఈ నేపథ్యంలో వింటేజ్ వైజయంతి’ పేరుతో సంస్థకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాల్ని వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి వీడియోను వైజయంతి మూవీస్ పంచుకుంది. రానా దగ్గుబాటి వాయిస్తోనే ఈ వీడియో రూపొందడం విశేషం. ఈ వీడియోలో వైజయంతి మూవీస్ సంస్థకు ఆ పేరు ఎలా వచ్చింది.. ఆ పేరు ఎవరు పెట్టారనే విషయాల్ని రానా పంచుకున్నాడు.
అశ్వనీదత్ 21 ఏళ్ల వయసులో విశ్వనాధ్ సినిమా ‘ఓ సీత కథ’తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఐతే నందమూరి తారక రామారావుగారితో సినిమా తీయాలన్నది ఆయన కల. పట్టువదలని విక్రమార్కుడిలా కష్టపడి ఎన్టీఆర్ అపాయింట్మెంట్ సాధించారు. ఆయనతో సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నారో ఎన్టీఆర్కు చెప్పారు.
దత్ మాటలకు ముచ్చటేసి ఎన్టీఆర్ ఒప్పుకున్నారు. అంతవరకు అశ్వనీదత్ బేనర్ కూడా స్థాపించలేదు. ఎన్టీఆర్ అడిగిన మొదటి ప్రశ్న.. బేనర్ పేరేంటి అని. విజయా సంస్థ లాంటిదేదో అయితే బాగుండు అని దత్ మనసులో మాట అట. కానీ బయటపెట్టలేదు.
అప్పుడే ఎన్టీఆర్.. అక్కడే ఉన్న కృష్ణుడి ఫొటోని చూపించి ఎన్నటికీ వాడిపోని వైజయంతి.. అదే నీ సంస్థ అని చెప్పారట. అప్పుడు స్వీయ దస్తూరితో ‘వైజయంతి మూవీస్’ అని రాసి ఇచ్చారట. ఎన్టీఆర్తో ఈ బేనర్లో దత్ చేసిన తొలి సినిమా ‘ఎదురులేని మనిషి’ సపర్ హిట్ అయింది. తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…