పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్ చేసుకుని మూకుమ్మడిగా కొత్త సినిమాలు దాడి చేయబోతున్నాయి. అయితే తెలుగులో డబ్బింగుల తాకిడి ఎక్కువగా ఉండటం ఏ మేరకు ఓపెనింగ్స్ తెస్తుందనేది పక్కనపెడితే స్ట్రెయిట్ మూవీ ‘బచ్చల మల్లి’తో వస్తున్న అల్లరి నరేష్ కు ఒక అవకాశం నాలుగు అడ్డంకులు పరీక్ష పెట్టబోతున్నాయి. ముందు అవకాశం సంగతి చూస్తే మాస్ కంటెంట్, విలేజ్ బ్యాక్ డ్రాప్, విశాల్ చంద్రశేఖర్ సంగీతం, ఆసక్తి రేపే క్యాస్టింగ్, అంచనాలు పెంచిన ట్రైలర్ ఇవన్నీ అల్లరోడికి సాఫ్ట్ గా పని చేసే అంశాలు.
అమాంతం ఉదయం ఆటకే జనాలు హౌస్ ఫుల్స్ చేయరు కానీ మార్నింగ్ షోకు వచ్చే టాక్ చాలా కీలకం కానుంది. ఇక అడ్డంకుల సంగతి చూస్తే పేరుకి అనువాదాలే అయినా కంటెంట్ లో ఉన్న వైవిధ్యం వల్ల జనంలో వాటి పట్ల కూడా ఆసక్తి కలుగుతోంది. ‘ముఫాసా లయన్ కింగ్’కి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడన్న ఒకే కారణంతో ఫ్యాన్స్ దాన్ని సొంతం చేసుకుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ‘విడుదల పార్ట్ 2’కి విజయ్ సేతుపతి, వెట్రిమారన్ ఇద్దరి బ్రాండ్ పని చేస్తోంది. ఉపేంద్ర చేస్తున్న నాన్ స్టాప్ ప్రమోషన్లు ‘యుఐ’కి బజ్ పెంచుతున్నాయి. వారం తర్వాత రాబోయే కిచ్చ సుదీప్ ‘మ్యాక్స్’ని తక్కువంచనా వేయడానికి లేదు.
సో అల్లరోడు వీటిని కాచుకోవడం పెద్ద సవాలే. టీమ్ మాత్రం చాలా నమ్మకంగా రోజుల తరబడి బచ్చల మల్లి గురించి మాట్లాడే కంటెంట్ ఇస్తున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి ఓ రేంజ్ లో ఊరిస్తున్నారు. ‘క’ తరహాలో వర్కౌట్ అయితే మాత్రం మంచి వసూళ్లు దక్కుతాయి. అయితే కాంపిటీషన్ ఎలా ఉన్నా భారీ ఓపెనింగ్స్ దేనికి వచ్చేలా కనిపించడం లేదు. ముందు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత థియేటర్లకు వచ్చేందుకు పబ్లిక్ ఆసక్తి చూపిస్తున్నారు. సో అల్లరి నరేష్ కనక యునానిమస్ టాక్ తెచ్చుకుంటే జనవరి 9 దాకా సోలో గ్రౌండ్ దొరుకుతుంది. సీరియస్ సబ్జెక్టుతో మెప్పించాలి మరి.
This post was last modified on December 19, 2024 11:41 am
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…