నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర పుణ్యక్షేత్రం కాశి ఘాట్ లో శివ శక్తి పాట లాంచ్ నిర్వహించబోతున్నారు. రెగ్యులర్ గా చేసే ఈవెంట్లకు భిన్నంగా ఎలాంటి హడావిడి కూడా ఆధ్యాత్మిక ప్రదేశం కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారు. శ్రీకాకుళం శ్రీముఖలింగం గుడిలో జరిగే జాతర సందర్భంగా వచ్చే ఈ పాటను శేఖర్ మాస్టర్ నేతృత్వంలో భారీగా షూట్ చేశారు. సినిమా హైలైట్స్ లో ఇది ప్రధానంగా నిలుస్తుందట. చైతు, సాయిపల్లవి డాన్స్ చూసేందుకు రెండు కళ్ళు చాలవని షూటింగ్ స్పాట్ టాక్.
ప్రత్యేకంగా ఇక్కడ ప్రశ్నలకు సమాధానం అని చెప్పడానికి కారణముంది. దేవిశ్రీ ప్రసాద్ కు ఈ ఆల్బమ్ చాలా కీలకం. పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో జరిగిన రాద్ధాంతం తనకు డ్యామేజ్ చేయకపోయినా వేరొకరితో బీజీఎమ్ పంచుకోవడం ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు. ఇదే తరహాలో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీకు కూడా జరిగింది. సో ఒకప్పటి వింటేజ్ దేవిని తండేల్ లో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక చైతు ఈ సినిమా కోసమే చాలా సమయం ఖర్చు పెట్టాడు. వేరే కమిట్ మెంట్స్ పక్కనపెట్టి విపరీతంగా కష్టపడి, ప్రేమించి మరీ నటించాడు. దానికి న్యాయం జరగాలి.
అల్లు అరవింద్, బన్నీ వాస్ లు వంద కోట్ల దాకా బడ్జెట్ పెట్టారనే టాక్ ఉన్న నేపథ్యంలో నిజంగా అంత ఉందా అని తేలడానికి మొదటి మెట్టు ఈ శివశక్తి పాటే. 400 మంది డాన్సర్లు, రోజుకి 1000కి పైగా సెట్లో జనాన్ని తీసుకొచ్చి భారీ ఎత్తున చిత్రీకరించారు. సో చైతు ఫ్యాన్స్ దీని కోసం చాలా ఎగ్జైట్ అవుతున్నారు. తండేల్ మొదటి ఆడియో సింగల్ ఛార్ట్ బస్టర్ అయినప్పటికీ ఇప్పుడీ శివ శక్తి మాత్రం స్పెషల్ గా నిలవనుంది. శివరాత్రి పండగ ఫిబ్రవరిలో ఉన్న నేపథ్యంలో ఎక్కడ విన్నా ఇదే పాట హోరెత్తిపోవడం ఖాయమనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. ఈ ప్రశ్నలు అన్నింటికి బదులు డిసెంబర్ 22 దొరకనుంది. చూద్దాం.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…