Movie News

రేవతి కుమారుడు కోలుకోడానికి మేము ఏమైనా చేస్తాం : అల్లు అరవింద్!

హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రేవతి తనయుడు శ్రీతేజ్ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే బాలుడిని, ఆయన కుటుంబ సభ్యులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ కిమ్స్ లో పరామర్శించారు. శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అతడి కుటుంబ సభ్యులను అల్లు అరవింద్ అడిగి తెలుసుకున్నారు. రేవతి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని అల్లు అరవింద్ భరోసానిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం తమకు అన్ని విధాలుగా పూర్తిస్థాయిలో సహకరిస్తోందని చెప్పారు. అయితే, ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున అల్లు అర్జున్‌ ఆసుపత్రికి రాలేకపోయారని, అందుకే అల్లు అర్జున్‌ తరపున తాను ఆస్పత్రికి వచ్చానని అల్లు అరవింద్ చెప్పారు.అయితే, సంధ్య థియేటర్ తొక్కిసలాట వంటి ఘటనలు భవిష్యత్తులో రిపీట్ కాకుండా చూడాలని అల్లు అరవింద్ అన్నారు. అందుకు అవసరమైన భద్రతా చర్యలు నిర్వాహకులు తీసుకోవాలని కోరారు.

విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాల విడుదల సమయంలో థియేటర్ల దగ్గరకు భారీ సంఖ్యలో వచ్చే జనాన్ని కంట్రోల్ చేసేందుకు తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని థియేటర్ల యాజమాన్యాలకు సూచించారు.భారీ సంఖ్యలో జనం వచ్చే ఈవెంట్లలో జనాన్ని కంట్రోల్ చేసేందుకు తగిన ప్రణాళిక ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ తొక్కిసలాటకు ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారని అన్నారు.తాను శ్రీతేజ్ ను స్వయంగా వెళ్లి పరామర్శిస్తానని అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే.

This post was last modified on December 18, 2024 6:34 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

20 minutes ago

రివ్యూల మీద ఫిర్యాదు చేసి లాభం లేదు

నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…

1 hour ago

హర్మూజ్ ప్లాన్ బెడిసికొట్టిందా ట్రంప్?

అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…

2 hours ago

ప్ర‌భాస్‌… త‌న వాళ్ల సినిమా అంటే చాలు

ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా సూప‌ర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…

3 hours ago

భారత రాజ్యాంగ చరిత్రలో తొలిసారి ‘అమరావతి’ అనుభవం

భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…

5 hours ago

బీజేపీ బాట‌లో వైసీపీ ఎంపీ?

రాజ‌కీయాల్లో జంపింగులు కొత్త‌కాదు. ఎవ‌రికి న‌చ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవ‌డ‌మూ కొత్త‌కాదు. ఎవ‌రికి అవ‌స‌రం.. అవ‌కాశం ఉన్న దిశ‌గా నాయ‌కులు,…

7 hours ago