హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రేవతి తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే బాలుడిని, ఆయన కుటుంబ సభ్యులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కిమ్స్ లో పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అతడి కుటుంబ సభ్యులను అల్లు అరవింద్ అడిగి తెలుసుకున్నారు. రేవతి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని అల్లు అరవింద్ భరోసానిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం తమకు అన్ని విధాలుగా పూర్తిస్థాయిలో సహకరిస్తోందని చెప్పారు. అయితే, ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున అల్లు అర్జున్ ఆసుపత్రికి రాలేకపోయారని, అందుకే అల్లు అర్జున్ తరపున తాను ఆస్పత్రికి వచ్చానని అల్లు అరవింద్ చెప్పారు.అయితే, సంధ్య థియేటర్ తొక్కిసలాట వంటి ఘటనలు భవిష్యత్తులో రిపీట్ కాకుండా చూడాలని అల్లు అరవింద్ అన్నారు. అందుకు అవసరమైన భద్రతా చర్యలు నిర్వాహకులు తీసుకోవాలని కోరారు.
విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాల విడుదల సమయంలో థియేటర్ల దగ్గరకు భారీ సంఖ్యలో వచ్చే జనాన్ని కంట్రోల్ చేసేందుకు తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని థియేటర్ల యాజమాన్యాలకు సూచించారు.భారీ సంఖ్యలో జనం వచ్చే ఈవెంట్లలో జనాన్ని కంట్రోల్ చేసేందుకు తగిన ప్రణాళిక ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ తొక్కిసలాటకు ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారని అన్నారు.తాను శ్రీతేజ్ ను స్వయంగా వెళ్లి పరామర్శిస్తానని అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే.
This post was last modified on December 18, 2024 6:34 pm
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…