Movie News

రేవతి కుమారుడు కోలుకోడానికి మేము ఏమైనా చేస్తాం : అల్లు అరవింద్!

హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రేవతి తనయుడు శ్రీతేజ్ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే బాలుడిని, ఆయన కుటుంబ సభ్యులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ కిమ్స్ లో పరామర్శించారు. శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అతడి కుటుంబ సభ్యులను అల్లు అరవింద్ అడిగి తెలుసుకున్నారు. రేవతి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని అల్లు అరవింద్ భరోసానిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం తమకు అన్ని విధాలుగా పూర్తిస్థాయిలో సహకరిస్తోందని చెప్పారు. అయితే, ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున అల్లు అర్జున్‌ ఆసుపత్రికి రాలేకపోయారని, అందుకే అల్లు అర్జున్‌ తరపున తాను ఆస్పత్రికి వచ్చానని అల్లు అరవింద్ చెప్పారు.అయితే, సంధ్య థియేటర్ తొక్కిసలాట వంటి ఘటనలు భవిష్యత్తులో రిపీట్ కాకుండా చూడాలని అల్లు అరవింద్ అన్నారు. అందుకు అవసరమైన భద్రతా చర్యలు నిర్వాహకులు తీసుకోవాలని కోరారు.

విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాల విడుదల సమయంలో థియేటర్ల దగ్గరకు భారీ సంఖ్యలో వచ్చే జనాన్ని కంట్రోల్ చేసేందుకు తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని థియేటర్ల యాజమాన్యాలకు సూచించారు.భారీ సంఖ్యలో జనం వచ్చే ఈవెంట్లలో జనాన్ని కంట్రోల్ చేసేందుకు తగిన ప్రణాళిక ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ తొక్కిసలాటకు ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారని అన్నారు.తాను శ్రీతేజ్ ను స్వయంగా వెళ్లి పరామర్శిస్తానని అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే.

This post was last modified on December 18, 2024 6:34 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

9 minutes ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

46 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

2 hours ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

2 hours ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

2 hours ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

3 hours ago