అల్లరి నరేష్ కెరీర్లో అతి పెద్ద హిట్.. సుడిగాడు. తమిళ బ్లాక్ బస్టర్ ‘తమిళ్ పడం’ ఆధారంగా తెరకెక్కినప్పటికీ.. తెలుగు సినిమాల మీద అదిరిపోయే స్పూఫ్లు, పేరడీలతో దీన్ని నాన్ స్టాప్ కామెడీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దారు భీమనేని శ్రీనివాసరావు. ఐతే ఈ సినిమా నరేష్కు ఎంత పెద్ద విజయాన్ని అందించిందో.. కెరీర్ను అంతగా డ్యామేజ్ చేసింది కూడా. అప్పటిదాకా తన చిత్రాల్లో అక్కడక్కడా ఒకట్రెండు స్పూఫులు ఉండేవి. కానీ ‘సుడిగాడు’ నిండా స్పూఫ్లు, పేరడీలతో నింపేయడంతో అది ఓవర్ డోస్ అయిపోయి.. తర్వాత ఈ టైపు కామెడీ చేస్తే జనాలకు మొహం మొత్తేసింది.
అందుకే అతను వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు. చివరికి కామెడీ వదిలేసి వేరే జానర్ల వైపు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఐతే ఇప్పుడు ఎక్కువగా సీరియస్ సినిమాలే చేస్తున్నప్పటికీ.. కామెడీని వదిలేయాలని అనుకోవట్లేదు నరేష్. సుడిగాడు-2 చేయడానికి అతను సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ ప్రాజెక్టు గురించి ‘బచ్చలమల్లి’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాల మీద స్ఫూఫ్ల ఆధారంగా తెరకెక్కించనున్నట్లు నరేష్ తెలిపాడు.
‘‘సుడిగాడు సినిమా రిలీజైనపుడు హిందీ ప్రేక్షకులకు అందులోని డైలాగులు అర్థం కాలేదు. స్పూఫులను కూడా అర్థం చేసుకోలేకపోయారు. తెలుగు సినిమాలంటే ఇంతేనేమో అనుకున్నారు. అందుకే ఈసారి.. వాళ్లు కూడా చూసిన పాన్ ఇండియా సినిమాల మీద స్పూఫులు చేయబోతున్నాం. సుడిగాడు సినిమా స్క్రిప్టు కోసం అప్పట్లో చాలా టైం పెట్టాం.
15 నెలల పట్టింది కథ తయారు చేయడానికి. ఈసారి ఇంకా ఎక్కువ టైం తీసుకుని కథ రెడీ చేస్తున్నాం’’ అని నరేష్ తెలిపాడు. ఐతే సుడిగాడు-2కు దర్శకుడు ఎవరు అన్నది నరేష్ వెల్లడించలేదు. భీమనేని శ్రీనివాసరావు చాలా ఏళ్లుగా సినిమాలు చేయని నేపథ్యంలో ఆయనే దీన్ని డైరెక్ట్ చేస్తారా అన్నది సందేహమే.
This post was last modified on December 18, 2024 2:21 pm
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…