సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె తనయుడు శ్రీ తేజ్ ఆరోగ్యం విషమంగా ఉండడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే శ్రీతేజ్ ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా పరామర్శించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్కు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని, బాలుడు కోలుకోవడానికి చాలా టైం పడుతుందని చెప్పారు. సంధ్య ధియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ వస్తున్నారని పోలీసులకు సమాచారం ఇవ్వడంలో నిర్వాహకులు ఫెయిల్ అయ్యారని, ఎంట్రీ, ఎగ్జిట్, సీటింగ్ ప్లాన్ చేయలేదని ఆరోపించారు. రెండు థియేటర్లకు కలిపి ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ ఉన్నాయని అన్నారు.
అల్లు అర్జున్, ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని లోపలికి అనుమతించారని, టిక్కెట్ల తనిఖీకి సరైన సిస్టం లేదని, అనధికారిక ప్రవేశం వల్ల రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగిందని చెప్పారు. ఈ క్రమంలోనే థియేటర్ లైసెన్స్పై యాజమాన్యానికి పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఒకరి మృతికి కారణమైన థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు, శ్రీతేజ్ కు మరిన్ని రోజులు ట్రీట్మెంట్ జరగనుందని, శ్రీతేజ్ ఆరోగ్యం గురించి సమాచారం ఎప్పటికపుడు తెలుసుకుంటున్నామని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా తెలిపారు. ఇక, శ్రీతేజ్ ఆరోగ్యంపై హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. శ్రీతేజ్ పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నామని తెలిపారు. జ్వరం తగ్గుతోందని, మినిమం ఐనోట్రోప్స్లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయని చెప్పారు. ఫీడ్లను బాగా తట్టుకుంటున్నాడని, స్టాటిక్ న్యూరోలాజికల్ స్థితి దృష్ట్యా, వెంటిలేటర్ పై నుంచి తీసుకురావడానికి ట్రాకియోస్టోమీని ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు.
This post was last modified on December 17, 2024 9:40 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…