Movie News

సంధ్య కి షోకాజ్ నోటీసులు : వివరణ ఇవ్వకపోతే లైసెన్స్ రద్దు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె తనయుడు శ్రీ తేజ్ ఆరోగ్యం విషమంగా ఉండడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే శ్రీతేజ్ ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌, హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా పరామర్శించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్‌కు బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయిందని, బాలుడు కోలుకోవడానికి చాలా టైం పడుతుందని చెప్పారు. సంధ్య ధియేటర్ దగ్గరకు అల్లు అర్జున్‌ వస్తున్నారని పోలీసులకు సమాచారం ఇవ్వడంలో నిర్వాహకులు ఫెయిల్ అయ్యారని, ఎంట్రీ, ఎగ్జిట్‌, సీటింగ్‌ ప్లాన్‌ చేయలేదని ఆరోపించారు. రెండు థియేటర్లకు కలిపి ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ ఉన్నాయని అన్నారు.

అల్లు అర్జున్, ఆయన ప్రైవేట్‌ సెక్యూరిటీని లోపలికి అనుమతించారని, టిక్కెట్‌ల తనిఖీకి సరైన సిస్టం లేదని, అనధికారిక ప్రవేశం వల్ల రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగిందని చెప్పారు. ఈ క్రమంలోనే థియేటర్ లైసెన్స్‌పై యాజమాన్యానికి పోలీసులు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఒకరి మృతికి కారణమైన థియేటర్ లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

మరోవైపు, శ్రీతేజ్ కు మరిన్ని రోజులు ట్రీట్‌మెంట్‌ జరగనుందని, శ్రీతేజ్‌ ఆరోగ్యం గురించి సమాచారం ఎప్పటికపుడు తెలుసుకుంటున్నామని హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా తెలిపారు. ఇక, శ్రీతేజ్ ఆరోగ్యంపై హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. శ్రీతేజ్ పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నామని తెలిపారు. జ్వరం తగ్గుతోందని, మినిమం ఐనోట్రోప్స్‌లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయని చెప్పారు. ఫీడ్‌లను బాగా తట్టుకుంటున్నాడని, స్టాటిక్ న్యూరోలాజికల్ స్థితి దృష్ట్యా, వెంటిలేటర్ పై నుంచి తీసుకురావడానికి ట్రాకియోస్టోమీని ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు.

This post was last modified on December 17, 2024 9:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

17 seconds ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago