సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె తనయుడు శ్రీ తేజ్ ఆరోగ్యం విషమంగా ఉండడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే శ్రీతేజ్ ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా పరామర్శించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్కు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని, బాలుడు కోలుకోవడానికి చాలా టైం పడుతుందని చెప్పారు. సంధ్య ధియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ వస్తున్నారని పోలీసులకు సమాచారం ఇవ్వడంలో నిర్వాహకులు ఫెయిల్ అయ్యారని, ఎంట్రీ, ఎగ్జిట్, సీటింగ్ ప్లాన్ చేయలేదని ఆరోపించారు. రెండు థియేటర్లకు కలిపి ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ ఉన్నాయని అన్నారు.
అల్లు అర్జున్, ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని లోపలికి అనుమతించారని, టిక్కెట్ల తనిఖీకి సరైన సిస్టం లేదని, అనధికారిక ప్రవేశం వల్ల రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగిందని చెప్పారు. ఈ క్రమంలోనే థియేటర్ లైసెన్స్పై యాజమాన్యానికి పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఒకరి మృతికి కారణమైన థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు, శ్రీతేజ్ కు మరిన్ని రోజులు ట్రీట్మెంట్ జరగనుందని, శ్రీతేజ్ ఆరోగ్యం గురించి సమాచారం ఎప్పటికపుడు తెలుసుకుంటున్నామని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా తెలిపారు. ఇక, శ్రీతేజ్ ఆరోగ్యంపై హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. శ్రీతేజ్ పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నామని తెలిపారు. జ్వరం తగ్గుతోందని, మినిమం ఐనోట్రోప్స్లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయని చెప్పారు. ఫీడ్లను బాగా తట్టుకుంటున్నాడని, స్టాటిక్ న్యూరోలాజికల్ స్థితి దృష్ట్యా, వెంటిలేటర్ పై నుంచి తీసుకురావడానికి ట్రాకియోస్టోమీని ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు.
This post was last modified on December 17, 2024 9:40 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…