ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పుష్ప 2 ది రూల్ కి ఇచ్చిన భారీ టికెట్ రేట్ల వెసులుబాట్లు ఈ రోజుతో ముగియనున్నాయి. ఇప్పటికీ ఏపీ కొన్ని కేంద్రాల్లో మల్టీప్లెక్సుల్లో 200 రూపాయల పెంపుతో ఒక్కో టికెట్ 377 ఉంది . సింగల్ స్క్రీన్ లో 250 నుంచి 295 దాకా ఉంది. ఇవన్నీ బుధవారం నుంచి సాధారణ స్థితి (110 – 177) కి చేరుకుంటాయి. నైజామ్ లో హైదరాబాద్ తో సహా గరిష్టంగా ప్రభుత్వం అనుమతించిన మాములు రేట్ (మల్టీప్లెక్స్ 295, సింగల్ స్క్రీన్ 175) ఆల్రెడీ అమలులో పెట్టగా రేపటి నుంచి వసూళ్లలో కొత్త పెరుగుదల ఉంటుందని బయ్యర్లు భావిస్తున్నారు. అధిక శాతం ప్రధాన థియేటర్లు పుష్ప 2ని మూడో వారం కొనసాగిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల కోట్ల మార్కు దాటి పరుగులు పెడుతున్న పుష్ప 2 రెండు వేల కోట్లను అందుకుంటుందా లేదానేది ఈ వారంలో తేలనుంది. కాకపోతే కొత్త రిలీజులు చాలా ఎక్కువగా ఉండటం వసూళ్లపై ప్రభావం చూపేలా ఉంది. కానీ టికెట్ రేట్లు మాములు స్థితికి రావడం బయ్యర్లు పాజిటివ్ కోణంలో చూస్తున్నారు. పుష్ప 2కి ఇంకా రావాల్సిన ఫ్యామిలీలు చాలా ఉన్నాయని, మాస్ వర్గాలు ధరల కోసం ఎదురు చూశారని, వాళ్ళందరూ వస్తే మళ్ళీ భారీ స్థాయిలో పికప్ చూడొచ్చని అంటున్నారు. ఈ వెర్షన్ లో నిజం లేకపోలేదు. అయితే ముఫాసా రూపంలో పొంచి ఉన్న కాంపిటీషన్ ని అంత తేలిగ్గా కొట్టి పారేయలేం.
తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో ఉపేంద్ర, తెలుగులో అల్లరి నరేష్ ఇలా ప్రతి భాషలోనూ ఏదో ఒకటి చెప్పుకోదగ్గ సినిమా ఈ శుక్రవారం థియేటర్లకు వస్తున్నాయి. అవేవి పుష్ప 2 గ్రాండియర్ తో సమానం కానప్పటికీ పాజిటివ్ వస్తే చూపించే ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉన్నా అల్లు అర్జున్ జోరు ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఇప్పట్లో తగ్గేలా లేదు. కనీసం 700 కోట్లకు ఫైనల్ ఫిగర్ వస్తుందని డిస్టిబ్యూటర్లు ధీమాగా ఉన్నారు. వరల్డ్ వైడ్ ఎంత అనేది తేలాలంటే డిసెంబర్ చివరి దాకా వేచి చూడాల్సిందే. గేమ్ ఛేంజర్ వచ్చే దాకా ఉన్న అడ్వాంటేజ్ ని పుష్ప 2 పూర్తిగా వాడుకోవడం ఖాయం.
This post was last modified on December 18, 2024 10:42 am
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…