డైలాగ్ కింగ్ మోహన్బాబు కుటుంబంలో తెరమీదికి వచ్చిన ఆస్తుల వివాదం.. అనేక మలుపులు తిరుతు న్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. ఈ వార్తలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపైనా దాడులు జరిగాయి. తాజాగా మంచు విష్ణుకు మద్దతుగా మోహన్బాబు సతీమణి నిర్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం తప్పంతా మనోజ్దేనని ఆమె చెప్పుకొచ్చారు. ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశారు. దీనినే పోలీసులకు కూడా పంపించారు.
శనివారం మంచు విష్ణు.. తన సోదరుడు మనోజ్ ఇంట్లో ఘర్షణకు దిగాడని, హత్యాయత్నానికి పాల్పడ్డాడని చేసిన వ్యాఖ్యలను నిర్మల ఖండించారు. తన పుట్టిన రోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకువచ్చి సంబరాలు చేశాడని.. కానీ, ఏదో జరిగిపోయిందన్నట్టుగా విష్ణుపై అభాండాలు వేసి.. మనోజ్ పోలీసులకు ఫిర్యాదులు చేశారని తెలిపారు. విష్ణు ఏమీ గొడవ పడలేదని.. తన బట్టలు తీసుకుని వెళ్లిపోయాడని నిర్మల వాంగ్మూలంలో తెలిపారు.
తన పుట్టిన రోజు సందర్భంగా జల్పల్లిలోని ఇంట్లో ఏదో గొడవ జరిగినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అసలు విష్ణుకు గొడవ పడే స్వభావం కూడా లేదని.. ఎవరినీ పన్నెత్తు మాట అనే రకం కూడా కాదన్నారు. కానీ, లేనిపోని విషయాలతో మనోజ్.. పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు. ఇంట్లో పనిమనుషులతోనూ విష్ణు గొడవ పడ్డాడన్న మనోజ్ వ్యాఖ్యలను కూడా నిర్మల విభేదించారు. అలాంటిదేమీలేద న్నారు. పనిమనుషులే వారికి వారు పని మానేశారని తెలిపారు.
ఇక్కడ పనిచేయలేమంటూ.. మనోజ్ వైఖరి నచ్చకే పనిమనుషులు మానేసినట్టు నిర్మల చెప్పుకొచ్చారు. ఇక, జల్ పల్లి నివాసానికి సంబంధించిన హక్కులపై కూడా నిర్మల క్లారిటీ ఇచ్చారు. ఈ నివాసంపై మనోజ్కుఎంత హక్కు ఉందో.. విష్ణుకు కూడా అంతే హక్కు ఉందన్నారు. ఈ మేరకు ఆమె పోలీసులకు లేఖను పంపించారు. ఇప్పుడు నిర్మల స్టేట్మెంటు ఈ కేసులో కీలకం కాదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 17, 2024 3:17 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…