అభిమానులందు మహేష్ బాబు అభిమానులు వేరయా అని కొత్త సామెత రాయలేమో. మహేష్ బాబు ఫ్యాన్స్ తీరు చూస్తుంటే అలాగే ఉంది. డిసెంబర్ 20 విడుదల కాబోతున్న ముఫాసా ది లయన్ కింగ్ కు హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో ఉదయం 8 గంటలకు బెనిఫిట్ షో వేయబోతున్నారు. దీని టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంటోంది. బెంగళూరు వినాయక థియేటర్ దగ్గర అతి పెద్ద కటవుట్ నెలకొల్పిన తరహాలోనే ఇక్కడ కూడా భారీ ప్లానింగ్ చేస్తున్నారని తెలిసింది. డీజేలు, బ్యానర్లు, బాణాసంచా వగైరాలన్నీ స్టార్ హీరో రెగ్యులర్ రిలీజ్ కు తీసిపోని రీతిలో ఉంటాయని ఫ్యాన్ అసోసియేషన్ల సమాచారం.
ఇంతా చేసి ముఫాసాకు మహేష్ బాబు చెప్పింది కేవలం డబ్బింగ్ మాత్రమే. మనిషి కనిపించడు. ఆ మాటకొస్తే ఈ హాలీవుడ్ మూవీ పూర్తిగా బొమ్మల ఆధారంగా అంటే యానిమేషన్ లో తీసింది. కొత్త టెక్నాలజీ కాబట్టి తెరపై పాత్రలు సజీవంగా ఉన్నట్టు అనిపిస్తాయి తప్పించి అవేవి నిజం కాదు. మరి ఈ మాత్రం దానికి ఇంత హంగామా ఎందుకయ్యా అంటే మళ్ళీ మహేష్ ని ఎప్పుడు చూస్తామో ఎప్పుడు వింటామో అందుకే ఎంజాయ్ చేసేస్తామని అంటున్నారు. ముఫాసా రెగ్యులర్ వెర్షన్లతో పాటు ఐమాక్స్, త్రీడి, ఫోర్డిఎక్స్ తదితర అన్ని ఫార్మాట్లలో రిలీజ్ కానుంది. స్పెషల్ షో వేసేది మాత్రం నార్మల్ 2డిలోనేనట.
మహేష్ పెట్టని కోటగా భావించే సుదర్శన్ లో ముఫాసా రిలీజ్ కావడం చూస్తే ఇది మాములు అరాచకం అనిపించడం లేదు. రెండు గంటల పాటు మహేష్ గొంతు విన్నా అది చూసినదాంతో సమానమని తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఇంకా నయం విదేశాల్లో ఉండటం వల్ల మహేష్ అందుబాటులో లేడు కానీ ఒకవేళ ఇండియాలో ఉండి ప్రమోషన్లు కూడా చేసి ఉంటే ఇంకే స్థాయిలో సెలబ్రేషన్స్ చేసేవాళ్ళో. జనవరి నుంచి రాజమౌళి సినిమా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దానికి ఎక్కువ సమయం పట్టకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయినా అది వాళ్ళ చేతిలో ఎక్కడుంది. అంతా జక్కన్న అదుపాజ్ఞల్లోనే.
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…