అభిమానులందు మహేష్ బాబు అభిమానులు వేరయా అని కొత్త సామెత రాయలేమో. మహేష్ బాబు ఫ్యాన్స్ తీరు చూస్తుంటే అలాగే ఉంది. డిసెంబర్ 20 విడుదల కాబోతున్న ముఫాసా ది లయన్ కింగ్ కు హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో ఉదయం 8 గంటలకు బెనిఫిట్ షో వేయబోతున్నారు. దీని టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంటోంది. బెంగళూరు వినాయక థియేటర్ దగ్గర అతి పెద్ద కటవుట్ నెలకొల్పిన తరహాలోనే ఇక్కడ కూడా భారీ ప్లానింగ్ చేస్తున్నారని తెలిసింది. డీజేలు, బ్యానర్లు, బాణాసంచా వగైరాలన్నీ స్టార్ హీరో రెగ్యులర్ రిలీజ్ కు తీసిపోని రీతిలో ఉంటాయని ఫ్యాన్ అసోసియేషన్ల సమాచారం.
ఇంతా చేసి ముఫాసాకు మహేష్ బాబు చెప్పింది కేవలం డబ్బింగ్ మాత్రమే. మనిషి కనిపించడు. ఆ మాటకొస్తే ఈ హాలీవుడ్ మూవీ పూర్తిగా బొమ్మల ఆధారంగా అంటే యానిమేషన్ లో తీసింది. కొత్త టెక్నాలజీ కాబట్టి తెరపై పాత్రలు సజీవంగా ఉన్నట్టు అనిపిస్తాయి తప్పించి అవేవి నిజం కాదు. మరి ఈ మాత్రం దానికి ఇంత హంగామా ఎందుకయ్యా అంటే మళ్ళీ మహేష్ ని ఎప్పుడు చూస్తామో ఎప్పుడు వింటామో అందుకే ఎంజాయ్ చేసేస్తామని అంటున్నారు. ముఫాసా రెగ్యులర్ వెర్షన్లతో పాటు ఐమాక్స్, త్రీడి, ఫోర్డిఎక్స్ తదితర అన్ని ఫార్మాట్లలో రిలీజ్ కానుంది. స్పెషల్ షో వేసేది మాత్రం నార్మల్ 2డిలోనేనట.
మహేష్ పెట్టని కోటగా భావించే సుదర్శన్ లో ముఫాసా రిలీజ్ కావడం చూస్తే ఇది మాములు అరాచకం అనిపించడం లేదు. రెండు గంటల పాటు మహేష్ గొంతు విన్నా అది చూసినదాంతో సమానమని తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఇంకా నయం విదేశాల్లో ఉండటం వల్ల మహేష్ అందుబాటులో లేడు కానీ ఒకవేళ ఇండియాలో ఉండి ప్రమోషన్లు కూడా చేసి ఉంటే ఇంకే స్థాయిలో సెలబ్రేషన్స్ చేసేవాళ్ళో. జనవరి నుంచి రాజమౌళి సినిమా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దానికి ఎక్కువ సమయం పట్టకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయినా అది వాళ్ళ చేతిలో ఎక్కడుంది. అంతా జక్కన్న అదుపాజ్ఞల్లోనే.
This post was last modified on December 16, 2024 4:55 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…