అభిమానులందు మహేష్ బాబు అభిమానులు వేరయా అని కొత్త సామెత రాయలేమో. మహేష్ బాబు ఫ్యాన్స్ తీరు చూస్తుంటే అలాగే ఉంది. డిసెంబర్ 20 విడుదల కాబోతున్న ముఫాసా ది లయన్ కింగ్ కు హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో ఉదయం 8 గంటలకు బెనిఫిట్ షో వేయబోతున్నారు. దీని టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంటోంది. బెంగళూరు వినాయక థియేటర్ దగ్గర అతి పెద్ద కటవుట్ నెలకొల్పిన తరహాలోనే ఇక్కడ కూడా భారీ ప్లానింగ్ చేస్తున్నారని తెలిసింది. డీజేలు, బ్యానర్లు, బాణాసంచా వగైరాలన్నీ స్టార్ హీరో రెగ్యులర్ రిలీజ్ కు తీసిపోని రీతిలో ఉంటాయని ఫ్యాన్ అసోసియేషన్ల సమాచారం.
ఇంతా చేసి ముఫాసాకు మహేష్ బాబు చెప్పింది కేవలం డబ్బింగ్ మాత్రమే. మనిషి కనిపించడు. ఆ మాటకొస్తే ఈ హాలీవుడ్ మూవీ పూర్తిగా బొమ్మల ఆధారంగా అంటే యానిమేషన్ లో తీసింది. కొత్త టెక్నాలజీ కాబట్టి తెరపై పాత్రలు సజీవంగా ఉన్నట్టు అనిపిస్తాయి తప్పించి అవేవి నిజం కాదు. మరి ఈ మాత్రం దానికి ఇంత హంగామా ఎందుకయ్యా అంటే మళ్ళీ మహేష్ ని ఎప్పుడు చూస్తామో ఎప్పుడు వింటామో అందుకే ఎంజాయ్ చేసేస్తామని అంటున్నారు. ముఫాసా రెగ్యులర్ వెర్షన్లతో పాటు ఐమాక్స్, త్రీడి, ఫోర్డిఎక్స్ తదితర అన్ని ఫార్మాట్లలో రిలీజ్ కానుంది. స్పెషల్ షో వేసేది మాత్రం నార్మల్ 2డిలోనేనట.
మహేష్ పెట్టని కోటగా భావించే సుదర్శన్ లో ముఫాసా రిలీజ్ కావడం చూస్తే ఇది మాములు అరాచకం అనిపించడం లేదు. రెండు గంటల పాటు మహేష్ గొంతు విన్నా అది చూసినదాంతో సమానమని తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఇంకా నయం విదేశాల్లో ఉండటం వల్ల మహేష్ అందుబాటులో లేడు కానీ ఒకవేళ ఇండియాలో ఉండి ప్రమోషన్లు కూడా చేసి ఉంటే ఇంకే స్థాయిలో సెలబ్రేషన్స్ చేసేవాళ్ళో. జనవరి నుంచి రాజమౌళి సినిమా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దానికి ఎక్కువ సమయం పట్టకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయినా అది వాళ్ళ చేతిలో ఎక్కడుంది. అంతా జక్కన్న అదుపాజ్ఞల్లోనే.
This post was last modified on December 16, 2024 4:55 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…