తమిళ హీరో విజయ్ సేతుపతి మనకు బాగా దగ్గరయ్యింది ఉప్పెన నుంచే. కృతి శెట్టి తండ్రి రాయణం పాత్రలో చూపించిన గాంభీర్యం, క్రూరత్వం టాలీవుడ్ జనాలకు బాగా దగ్గర చేసింది. అయితే కోలీవుడ్ లో విపరీతమైన బిజీలో ఉండటంతో తెలుగు ఆఫర్లను అట్టే ఒప్పుకోవడం లేదు. విడుదల పార్ట్ 1 హిట్టయ్యాక ఇప్పుడు విడుదల పార్ట్ 2 డిసెంబర్ 20 రిలీజ్ కు రెడీ అవుతోంది. దీని ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన విజయ్ సేతుపతి కొన్ని ఆసక్తికరమైన కబుర్లు పంచుకున్నాడు. అందులో రామ్ చరణ్ 16 ప్రస్తావన వచ్చింది. అందులో నటిస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాడు.
ఆర్సి 16లో తాను లేనని, అంత టైం దొరకడం లేదని, ప్రస్తుతం కథలు వింటున్నా ఏదీ సెట్ కావడం లేదని క్లారిటీ ఇచ్చాడు. నిజానికి అతనన్న మాటల్లో నిజముంది. ఎక్కువ ప్రాధాన్యం ఉంటే తప్ప చేయలేని ఇమేజ్ తనది. ఏదో ఆషామాషీగా క్యారెక్టర్లు చేసే పరిస్థితి లేదు. ఆ మాటకొస్తే పుష్పలోనూ ముందు ఆఫర్ ఇచ్చారనే టాక్ వచ్చింది. అది ఏ పాత్రనే లీక్ బయటికి రాలేదు కానీ ఫహద్ ఫాసిల్ దేననే ప్రచారం జోరుగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్సి 16లో లేనని స్పష్టంగా చెప్పడంతో డౌట్లన్నీ తీరిపోయాయి. ఉంటే బాగుండేదేమో కానీ బుచ్చిబాబు కథలో స్పేస్ లేకపోవడం వల్ల మిస్ అవుతున్నాం.
విడుదల పార్ట్ 2 మీద విజయ్ సేతుపతి చాలా నమ్మకంగా ఉన్నాడు. సీక్వెల్ మొత్తం ఈయన చుట్టే తిరుగుతుంది. ఫస్ట్ పార్ట్ లో కీలక పాత్ర పోషించిన సూరి ఈసారి తక్కువ కనిపిస్తాడు. ఇళయరాజా సంగీతం, మంజు వారియర్, డెప్త్ గా కనిపిస్తున్న యాక్షన్ విజువల్స్ అంచనాలు పెంచుతున్నాయి. పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ వెట్రిమారన్ డైరెక్షన్ కు మనదగ్గర కూడా బోలెడు ఫ్యాన్స్ ఉన్నారు. విడుదల పార్ట్ 1 కమర్షియల్ గా అద్భుతాలు చేయలేదు కానీ పార్ట్ 2 మాత్రం నిరాశ పరిచే ఛాన్స్ తక్కువగా ఉంది. కాకపోతే అల్లరి నరేష్, ఉపేంద్ర, లయన్ కింగ్, కిచ్చ సుదీప్, మోహన్ లాల్ కాంపిటీషన్ ని తట్టుకుని గెలవాలి.
ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో…
తొలి రోజు పూర్తి చేసుకున్న పెద్ది మొత్తం ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ దాటేసి బలమైన సెకండ్…
అతిలోకసుందరిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీదేవి అంటే ఎప్పటికీ చెక్కుచెదరని పేరు. అలాంటి గొప్ప నటికి…
తెలంగాణకు రావొచ్చు.. పోవచ్చు.. ఇక్కడ నివసించొచ్చు కానీ, మా రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే ఊరు కునేది లేదంటూ.. పెద్ద…
గ్రాండ్ ఓల్ద్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ షర్మిలకు ఝలక్ ఇచ్చింది. షర్మిలను రాజ్యసభకు పంపనున్నట్లు బలమైన వార్తలు వచ్చాక కూడా…
ఏపీలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన తీర ప్రాంతం(బీచ్) ఏపీలో…