తమిళ హీరో విజయ్ సేతుపతి మనకు బాగా దగ్గరయ్యింది ఉప్పెన నుంచే. కృతి శెట్టి తండ్రి రాయణం పాత్రలో చూపించిన గాంభీర్యం, క్రూరత్వం టాలీవుడ్ జనాలకు బాగా దగ్గర చేసింది. అయితే కోలీవుడ్ లో విపరీతమైన బిజీలో ఉండటంతో తెలుగు ఆఫర్లను అట్టే ఒప్పుకోవడం లేదు. విడుదల పార్ట్ 1 హిట్టయ్యాక ఇప్పుడు విడుదల పార్ట్ 2 డిసెంబర్ 20 రిలీజ్ కు రెడీ అవుతోంది. దీని ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన విజయ్ సేతుపతి కొన్ని ఆసక్తికరమైన కబుర్లు పంచుకున్నాడు. అందులో రామ్ చరణ్ 16 ప్రస్తావన వచ్చింది. అందులో నటిస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాడు.
ఆర్సి 16లో తాను లేనని, అంత టైం దొరకడం లేదని, ప్రస్తుతం కథలు వింటున్నా ఏదీ సెట్ కావడం లేదని క్లారిటీ ఇచ్చాడు. నిజానికి అతనన్న మాటల్లో నిజముంది. ఎక్కువ ప్రాధాన్యం ఉంటే తప్ప చేయలేని ఇమేజ్ తనది. ఏదో ఆషామాషీగా క్యారెక్టర్లు చేసే పరిస్థితి లేదు. ఆ మాటకొస్తే పుష్పలోనూ ముందు ఆఫర్ ఇచ్చారనే టాక్ వచ్చింది. అది ఏ పాత్రనే లీక్ బయటికి రాలేదు కానీ ఫహద్ ఫాసిల్ దేననే ప్రచారం జోరుగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్సి 16లో లేనని స్పష్టంగా చెప్పడంతో డౌట్లన్నీ తీరిపోయాయి. ఉంటే బాగుండేదేమో కానీ బుచ్చిబాబు కథలో స్పేస్ లేకపోవడం వల్ల మిస్ అవుతున్నాం.
విడుదల పార్ట్ 2 మీద విజయ్ సేతుపతి చాలా నమ్మకంగా ఉన్నాడు. సీక్వెల్ మొత్తం ఈయన చుట్టే తిరుగుతుంది. ఫస్ట్ పార్ట్ లో కీలక పాత్ర పోషించిన సూరి ఈసారి తక్కువ కనిపిస్తాడు. ఇళయరాజా సంగీతం, మంజు వారియర్, డెప్త్ గా కనిపిస్తున్న యాక్షన్ విజువల్స్ అంచనాలు పెంచుతున్నాయి. పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ వెట్రిమారన్ డైరెక్షన్ కు మనదగ్గర కూడా బోలెడు ఫ్యాన్స్ ఉన్నారు. విడుదల పార్ట్ 1 కమర్షియల్ గా అద్భుతాలు చేయలేదు కానీ పార్ట్ 2 మాత్రం నిరాశ పరిచే ఛాన్స్ తక్కువగా ఉంది. కాకపోతే అల్లరి నరేష్, ఉపేంద్ర, లయన్ కింగ్, కిచ్చ సుదీప్, మోహన్ లాల్ కాంపిటీషన్ ని తట్టుకుని గెలవాలి.
This post was last modified on December 15, 2024 7:42 pm
రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…
ఐపీఎల్-2026లో అత్యధిక క్రేజ్ దక్కించుకున్న మ్యాచ్లలో సన్రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్లోని రాజీవ్…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…
తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…
ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…