తమ జీవితంలో అనుభవాలనే కథలుగా మార్చి సినిమాలు తీసే దర్శకులు చాలామందే ఉన్నారు. ఐతే లార్జర్ ధ్యాన్ లైఫ్ సినిమాలే తీసే రాజమౌళి కూడా ఇలా ఓ సినిమా తీశాడని.. పైగా ఆయనకు స్ఫూర్తిగా నిలిచింది ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం అని తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేం. రానా దగ్గుబాటి టాక్ షోలో ఆయన ఈ ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించారు. రాజమౌళి సినిమాల్లో ఒక సిన్సియర్ ప్రేమకథను చూపించిన సినిమా అంటే.. ‘ఈగ’నే.
ఈ కథలోకి ఈగ పాత్ర వచ్చే వరకు నాని-సమంత మధ్య అందమైన ప్రేమకథను చూస్తాం. ఈ ప్రేమకథకు తన జీవితంలో ఓ అమ్మాయితో వన్ సైడ్ లవ్ స్టోరీనే స్ఫూర్తి అని రాజమౌళి తెలిపాడు. ఇంటర్మీడియట్ రోజుల్లో తాను భారతి అనే అమ్మాయిని ప్రేమించినట్లు జక్కన్న వెల్లడించాడు. ఆ అమ్మాయి అంటే తనకు చాలా ఇష్టమని.. కానీ బేసిగ్గా చాలా బిడియస్థుడు కావడంతో ఆ అమ్మాయితో మాట్లాడేవాడినే కాదని జక్కన్న తెలిపాడు.
తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు కాలేజీలో అందరికీ తెలుసని.. స్నేహితులు ఈ విషయంలో తనను ఏడిపిస్తూ ఉండేవారని.. కానీ ఆ అమ్మాయితో మాట్లాడేందుకు ధైర్యం సరిపోయేది కాదని రాజమౌళి తెలిపాడు. మొత్తానికి ఒక రోజు ఆమెతో మాట్లాడానని.. ‘‘భారతీ.. ఎగ్జామ్ ఫీజు కట్టావా’’ అని అడిగానని రాజమౌళి వెల్లడించాడు. ‘‘నేను ఎంతో కాలంగా నువ్వు పిలుస్తావని ఎదురు చూస్తున్నా’’ అన్నట్లుగా ఆమె తన వైపు చూసిందని.. తన కళ్లలో ఒక మెరుపు కనిపించిందని.. కానీ తాను అడిగిన ప్రశ్న విన్నాక ఇది అడగడానికా పిలిచావు అన్నట్లు నిరాశగా చూస్తూ తల ఊపి వెళ్లిపోయిందని ఆయన తెలిపాడు.
ఆమె తన వైపు చూసినపుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ను ఎప్పటికీ మరిచిపోలేనని ఆయనన్నాడు. ఇలా మాట్లాడకుండా కళ్లతోనే సాగిన తన ప్రేమకథనే ‘ఈగ’ సినిమాలో తొలి అరగంటలో నాని-సమంత మధ్య చూపించానని.. చాలామంది దర్శకులు ఇలాగే తమ అనుభవాలను సినిమాలో చూపిస్తుంటారని రాజమౌళి వ్యాఖ్యానించాడు.
This post was last modified on December 15, 2024 6:12 pm
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…