తమ జీవితంలో అనుభవాలనే కథలుగా మార్చి సినిమాలు తీసే దర్శకులు చాలామందే ఉన్నారు. ఐతే లార్జర్ ధ్యాన్ లైఫ్ సినిమాలే తీసే రాజమౌళి కూడా ఇలా ఓ సినిమా తీశాడని.. పైగా ఆయనకు స్ఫూర్తిగా నిలిచింది ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం అని తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేం. రానా దగ్గుబాటి టాక్ షోలో ఆయన ఈ ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించారు. రాజమౌళి సినిమాల్లో ఒక సిన్సియర్ ప్రేమకథను చూపించిన సినిమా అంటే.. ‘ఈగ’నే.
ఈ కథలోకి ఈగ పాత్ర వచ్చే వరకు నాని-సమంత మధ్య అందమైన ప్రేమకథను చూస్తాం. ఈ ప్రేమకథకు తన జీవితంలో ఓ అమ్మాయితో వన్ సైడ్ లవ్ స్టోరీనే స్ఫూర్తి అని రాజమౌళి తెలిపాడు. ఇంటర్మీడియట్ రోజుల్లో తాను భారతి అనే అమ్మాయిని ప్రేమించినట్లు జక్కన్న వెల్లడించాడు. ఆ అమ్మాయి అంటే తనకు చాలా ఇష్టమని.. కానీ బేసిగ్గా చాలా బిడియస్థుడు కావడంతో ఆ అమ్మాయితో మాట్లాడేవాడినే కాదని జక్కన్న తెలిపాడు.
తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు కాలేజీలో అందరికీ తెలుసని.. స్నేహితులు ఈ విషయంలో తనను ఏడిపిస్తూ ఉండేవారని.. కానీ ఆ అమ్మాయితో మాట్లాడేందుకు ధైర్యం సరిపోయేది కాదని రాజమౌళి తెలిపాడు. మొత్తానికి ఒక రోజు ఆమెతో మాట్లాడానని.. ‘‘భారతీ.. ఎగ్జామ్ ఫీజు కట్టావా’’ అని అడిగానని రాజమౌళి వెల్లడించాడు. ‘‘నేను ఎంతో కాలంగా నువ్వు పిలుస్తావని ఎదురు చూస్తున్నా’’ అన్నట్లుగా ఆమె తన వైపు చూసిందని.. తన కళ్లలో ఒక మెరుపు కనిపించిందని.. కానీ తాను అడిగిన ప్రశ్న విన్నాక ఇది అడగడానికా పిలిచావు అన్నట్లు నిరాశగా చూస్తూ తల ఊపి వెళ్లిపోయిందని ఆయన తెలిపాడు.
ఆమె తన వైపు చూసినపుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ను ఎప్పటికీ మరిచిపోలేనని ఆయనన్నాడు. ఇలా మాట్లాడకుండా కళ్లతోనే సాగిన తన ప్రేమకథనే ‘ఈగ’ సినిమాలో తొలి అరగంటలో నాని-సమంత మధ్య చూపించానని.. చాలామంది దర్శకులు ఇలాగే తమ అనుభవాలను సినిమాలో చూపిస్తుంటారని రాజమౌళి వ్యాఖ్యానించాడు.
This post was last modified on December 15, 2024 6:12 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…