తమ జీవితంలో అనుభవాలనే కథలుగా మార్చి సినిమాలు తీసే దర్శకులు చాలామందే ఉన్నారు. ఐతే లార్జర్ ధ్యాన్ లైఫ్ సినిమాలే తీసే రాజమౌళి కూడా ఇలా ఓ సినిమా తీశాడని.. పైగా ఆయనకు స్ఫూర్తిగా నిలిచింది ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం అని తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేం. రానా దగ్గుబాటి టాక్ షోలో ఆయన ఈ ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించారు. రాజమౌళి సినిమాల్లో ఒక సిన్సియర్ ప్రేమకథను చూపించిన సినిమా అంటే.. ‘ఈగ’నే.
ఈ కథలోకి ఈగ పాత్ర వచ్చే వరకు నాని-సమంత మధ్య అందమైన ప్రేమకథను చూస్తాం. ఈ ప్రేమకథకు తన జీవితంలో ఓ అమ్మాయితో వన్ సైడ్ లవ్ స్టోరీనే స్ఫూర్తి అని రాజమౌళి తెలిపాడు. ఇంటర్మీడియట్ రోజుల్లో తాను భారతి అనే అమ్మాయిని ప్రేమించినట్లు జక్కన్న వెల్లడించాడు. ఆ అమ్మాయి అంటే తనకు చాలా ఇష్టమని.. కానీ బేసిగ్గా చాలా బిడియస్థుడు కావడంతో ఆ అమ్మాయితో మాట్లాడేవాడినే కాదని జక్కన్న తెలిపాడు.
తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు కాలేజీలో అందరికీ తెలుసని.. స్నేహితులు ఈ విషయంలో తనను ఏడిపిస్తూ ఉండేవారని.. కానీ ఆ అమ్మాయితో మాట్లాడేందుకు ధైర్యం సరిపోయేది కాదని రాజమౌళి తెలిపాడు. మొత్తానికి ఒక రోజు ఆమెతో మాట్లాడానని.. ‘‘భారతీ.. ఎగ్జామ్ ఫీజు కట్టావా’’ అని అడిగానని రాజమౌళి వెల్లడించాడు. ‘‘నేను ఎంతో కాలంగా నువ్వు పిలుస్తావని ఎదురు చూస్తున్నా’’ అన్నట్లుగా ఆమె తన వైపు చూసిందని.. తన కళ్లలో ఒక మెరుపు కనిపించిందని.. కానీ తాను అడిగిన ప్రశ్న విన్నాక ఇది అడగడానికా పిలిచావు అన్నట్లు నిరాశగా చూస్తూ తల ఊపి వెళ్లిపోయిందని ఆయన తెలిపాడు.
ఆమె తన వైపు చూసినపుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ను ఎప్పటికీ మరిచిపోలేనని ఆయనన్నాడు. ఇలా మాట్లాడకుండా కళ్లతోనే సాగిన తన ప్రేమకథనే ‘ఈగ’ సినిమాలో తొలి అరగంటలో నాని-సమంత మధ్య చూపించానని.. చాలామంది దర్శకులు ఇలాగే తమ అనుభవాలను సినిమాలో చూపిస్తుంటారని రాజమౌళి వ్యాఖ్యానించాడు.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…