పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఓ మహిళ మృతి చెందిన కేసులో హీరో అల్లు అర్జున్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం.. అతను ఒక రోజు జైలులో ఉండి విడుదల కావడంతో ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది పరామర్శకు వెళ్లారు. శనివారం ఉదయం నుంచి బన్నీ ఇల్లు సెలబ్రెటీలతో కళకళలాడిపోయింది. పొద్దుపోయే వరకు పరామర్శలు కొనసాగాయి.
బన్నీని విక్టరీ వెంకటేష్ సహా ఎంతోమంది స్టార్లు, సన్నిహితులు, బంధువులు కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అన్నింట్లోకి ఒక వీడియో మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. బన్నీ మేనత్త, చిరంజీవి సతీమణి సురేఖ.. బన్నీని కలిసిన వీడియో అందరినీ అమితంగా ఆకట్టుకుంది. మేనల్లుడిని ఆమె ఆప్యాయంగా హత్తుకోవడం.. బన్నీ భావోద్వేగానికి గురవుతూ ఆమె చేతికి ముద్దుపెట్టడం అందరికీ చూడముచ్చటగా అనిపించింది.
ఇటీవల మెగా ఫ్యామిలీకి, అల్లు కుటుంబానికి కొంచెం దూరం పెరిగినట్లు భావిస్తున్న నేపథ్యంలో బన్నీని సురేఖ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా సురేఖను అక్కడున్న ఓ పెద్ద మనిషి.. బాగా కంగారు పడ్డట్లున్నారే అని అడగ్గా, అందుకామె బదులిస్తూ అంతే కదండీ. పిల్లలకు ఇలా జరిగితే టెన్షన్ పడతాం కదా. నిన్న ఆయన కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేశారు అని వ్యాఖ్యానించింది. ఆయన అంటే ఇక్కడ చిరంజీవి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
బన్నీ అరెస్టవగానే చిరంజీవి.. తన ఇంటికి వచ్చేశారు. అంతే కాక తనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన లాయర్ నిరంజన్ రెడ్డిని పురమాయించి.. ఈ కేసు టేకప్ చేసేలా చూశారు. నిరంజన్ రెడ్డి కోర్టులో సమర్థంగా వాదించి బన్నీకి మధ్యంతర బెయిల్ వచ్చేలా చూశారు. మొత్తానికి బన్నీ అరెస్ట్ ఉదంతంతో.. ఇప్పటిదాకా మెగా, అల్లు కుటుంబాల మధ్య నెలకొన్న చిన్న గ్యాప్ పూడుకున్నట్లే కనిపిస్తోంది.అంతా మన మంచికే అనే మాట ఇలాంటి సందర్భాల్లోనే నిజం అనిపిస్తుంది ఎవరికైనా.
This post was last modified on December 15, 2024 9:46 am
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…