సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టయి ఈరోజు ఉదయం చంచల్ గూడ జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కు సినీ, వ్యాపార ప్రముఖులు సంఘీభావం ప్రకటిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఫోన్ చేశారు. అల్లు అర్జున్ ఇంటికి విక్టరీ వెంకటేష్ స్వయంగా వెళ్లి పరామర్శించారు.వాస్తవానికి అల్లు అర్జున్ ఇంటికి స్వయంగా వెళ్లి ప్రభాస్ పరామర్శిస్తారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే, షూటింగ్ పనుల వల్ల హైదరాబాద్ లో ప్రభాస్ లేని కారణంగా ఆయన రాలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బన్నీకి ఫోన్ చేసిన ప్రభాస్ ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని బన్నీకి చెప్పారు. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా అల్లు అర్జున్ కు ఫోన్ చేసి పరామర్శించారు. కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి కష్ట సమయంలో ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్ కు అండగా ఉంటుందని తారక్ చెప్పారు.
మరోవైపు, అల్లు అర్జున్ ఇంటికి టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వెళ్లారు. అల్లు అర్జున్ ను స్వయంగా కలిసిన వెంకటేష్ కేసుకు సంబంధించిన వివరాలతో పాటు కేసు పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి స్వయంగా పరామర్శించారు. వారితోపాటు యంగ్ హీరో అక్కినేని అఖిల్, అడవి శేష్ తదితరులు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
This post was last modified on December 14, 2024 7:48 pm
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…