ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై వాడీ వేడీ వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి కీలక తీర్పునిచ్చారు. పరిమిత కాలానికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నామని జడ్జి తెలిపారు. దీంతో, అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించినట్లయింది.
వాస్తవానికి నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు, అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆ వాదనలు మరింత సమయం పట్టేలా ఉండడంతో అల్లు అర్జున్ ను జైలుకు తరలిస్తారని అంతా అనుకున్నారు.
దీంతో, చంచల్ గూడ జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడకు భారీగా అల్లు అర్జున్ అభిమానులు చేరుకున్నారు. అయితే, ఈ లోపు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ లభించడంతో అభిమానులు శాంతించారు. మరి కాసేపట్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.
This post was last modified on December 13, 2024 5:55 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…