ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై వాడీ వేడీ వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి కీలక తీర్పునిచ్చారు. పరిమిత కాలానికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నామని జడ్జి తెలిపారు. దీంతో, అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించినట్లయింది.
వాస్తవానికి నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు, అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆ వాదనలు మరింత సమయం పట్టేలా ఉండడంతో అల్లు అర్జున్ ను జైలుకు తరలిస్తారని అంతా అనుకున్నారు.
దీంతో, చంచల్ గూడ జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడకు భారీగా అల్లు అర్జున్ అభిమానులు చేరుకున్నారు. అయితే, ఈ లోపు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ లభించడంతో అభిమానులు శాంతించారు. మరి కాసేపట్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.
This post was last modified on December 13, 2024 5:55 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…