టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను విచారణ చేసేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకువెళ్లారు. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఎంక్వయిరీ చేసేందుకు అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకువెళ్లారు. ఆ రోజు తొక్కిసలాట సందర్భంగా రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై గతంలో కేసు నమోదైంది.
ఆ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సంధ్య థియేటర్ ఓనర్ తో పాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ ను పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ ను విచారణ జరిపేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. బన్నీని అరెస్టు చేయలేదని, విచారణ కోసం మాత్రమే స్టేషన్ కు తీసుకువెళ్లారని ఆయన పీఆర్ టీం వివరణనిచ్చింది. అభిమానులు కంగారు పడవద్దని తెలిపింది.
This post was last modified on December 13, 2024 1:00 pm
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…