టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను విచారణ చేసేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకువెళ్లారు. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఎంక్వయిరీ చేసేందుకు అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకువెళ్లారు. ఆ రోజు తొక్కిసలాట సందర్భంగా రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై గతంలో కేసు నమోదైంది.
ఆ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సంధ్య థియేటర్ ఓనర్ తో పాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ ను పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ ను విచారణ జరిపేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. బన్నీని అరెస్టు చేయలేదని, విచారణ కోసం మాత్రమే స్టేషన్ కు తీసుకువెళ్లారని ఆయన పీఆర్ టీం వివరణనిచ్చింది. అభిమానులు కంగారు పడవద్దని తెలిపింది.
This post was last modified on December 13, 2024 1:00 pm
తెలంగాణాలో ఇంజనీరింగ్ కళాశాలలు విద్యార్థుల వేటలో పడ్డాయి. కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ కాకపోవడంతో ఏమి చేయాలో…
స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం సర్వసాధారణం. దక్షిణాదిలో అత్యధిక శాతం దీన్ని కొడుకులకే పరిమితం చేస్తూ ఉంటారు.…
నిన్న విడుదలైన రామాయణ నాలుగు నిమిషాల ట్రైలర్ సోషల్ మీడియాలో పెద్ద చిచ్చే పెట్టింది. ఒకవైపు ఆదిపురుష్ పోలికలను తీసుకొచ్చి…
జూలై అయిపోయింది. వేసవిలో ఎండల బాలన్స్ ఏదైనా ఉందంటే ఈ నెలతో సమాప్తం అయినట్టే. ఆల్రెడీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను…
పేపర్ లీకేజి భూతం ఒదిలిపెట్టేలా కనిపించడం లేదు. కేంద్ర విద్యా శాఖ మంత్రిని పదవిని బలిగొన్నా అక్రమార్కులు వెనకంజ వేయడం…
నిత్యం పాఠశాలల్లోనూ.. జాతీయ పండుగల దినాల్లోనూ అందరూ కలసి పాడుకునే జాతీయ గేయం వందేమాతరం ఇక, చట్టబద్ధం కానుంది. దీనికి…