టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను విచారణ చేసేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకువెళ్లారు. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఎంక్వయిరీ చేసేందుకు అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకువెళ్లారు. ఆ రోజు తొక్కిసలాట సందర్భంగా రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై గతంలో కేసు నమోదైంది.
ఆ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సంధ్య థియేటర్ ఓనర్ తో పాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ ను పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ ను విచారణ జరిపేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. బన్నీని అరెస్టు చేయలేదని, విచారణ కోసం మాత్రమే స్టేషన్ కు తీసుకువెళ్లారని ఆయన పీఆర్ టీం వివరణనిచ్చింది. అభిమానులు కంగారు పడవద్దని తెలిపింది.
This post was last modified on December 13, 2024 1:00 pm
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. సమావేశాలను వారు ప్రత్యక్షంగా…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…