టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను విచారణ చేసేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకువెళ్లారు. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఎంక్వయిరీ చేసేందుకు అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకువెళ్లారు. ఆ రోజు తొక్కిసలాట సందర్భంగా రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై గతంలో కేసు నమోదైంది.
ఆ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సంధ్య థియేటర్ ఓనర్ తో పాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ ను పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ ను విచారణ జరిపేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. బన్నీని అరెస్టు చేయలేదని, విచారణ కోసం మాత్రమే స్టేషన్ కు తీసుకువెళ్లారని ఆయన పీఆర్ టీం వివరణనిచ్చింది. అభిమానులు కంగారు పడవద్దని తెలిపింది.
This post was last modified on December 13, 2024 1:00 pm
టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…
ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. బాబు ఔదార్యం…
దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…
కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…