సాయి దుర్గ తేజ్ కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘రిపబ్లిక్’ ఒకటి. వెన్నెల, ప్రస్థానం చిత్రాలతో తనదైన ముద్ర వేసిన దేవ్ కట్టా ఈ చిత్రాన్ని రూపొందించాడు. చాలా మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ ‘రిపబ్లిక్’ కమర్షియల్ సక్సెస్ మాత్రం కాలేదు. ఈ చిత్రానికి సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. కానీ ఓటీటీ రిలీజైనపుడు అందరూ ఆహా ఓహో అన్నారు. దేవ్ కట్టా రైటింగ్, డైరెక్షన్.. అలాగే తేజు నటనను అందరూ కొనియాడారు. ఐతే ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి ఉంటే కమర్షియల్గా సక్సెస్ అయ్యేదన్న అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి.
ముఖ్యంగా చివర్లో హీరోను చంపేయడం పట్ల మాస్ ప్రేక్షకుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాంటి ముగింపును తెలుగు ప్రేక్షకులు భరించలేరనే అభిప్రాయాలున్నాయి. సినిమాకు కొంచెం కమర్షియల్ టచ్ ఇవ్వాల్సిందన్న చర్చ జరిగింది.ఐతే తాను కూడా ఒక దశలో ‘రిపబ్లిక్’ క్లైమాక్స్ను మార్చే విషయమై ఆలోచన చేసినట్లు దర్శకుడు దేవ్ కట్టా ఇప్పుడు వెల్లడించాడు.
కానీ తేజునే అందుకు ఒప్పుకోలేదని అతనన్నాడు. తేజు కొత్త చిత్రం ఫస్ల్ గ్లింప్స్ లాంచ్ వేడుకకు అతిథుల్లో ఒకడిగా వచ్చిన దేవ్.. ‘రిపబ్లిక్’ అనుభవం గురించి మాట్లాడాడు. ‘రిపబ్లిక్’ సినిమా రిలీజైనపుడు చాలామంది ఈ సినిమా క్లైమాక్స్ మారిస్తే కమర్షియల్గా మంచి విజయం సాధించేదని అభిప్రాయపడినట్లు దేవ్ వెల్లడించాడు.
రిలీజ్ రోజు కూడా చాలామంది ఫోన్ చేసి చివర్లో హీరో చనిపోవడం బాగా లేదని అన్నారని.. దీంతో తాను కూడా ఆఖరి సీన్ తీసేద్దామా అని ఆలోచించాలనని దేవ్ చెప్పాడు. ఇదే విషయమై తేజుకు ఫోన్ చేస్తే.. ‘‘క్లైమాక్స్ మారిస్తే ఈ సినిమా నాది కాదు’’ అని తేల్చి చెప్పేశాడని, దటీజ్ తేజు అని దేవ్ కట్టా వ్యాఖ్యానించాడు. ‘హనుమాన్’ నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్న తేజు కొత్త చిత్రాన్ని రోహిత్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది దసరాకు ఈ చిత్రం విడుదల కానుంది.
This post was last modified on December 13, 2024 12:43 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…