అతి తక్కువ రోజుల్లో వెయ్యి కోట్ల మార్కుని దాటిన మొదటి ఇండియన్ సినిమాగా పుష్ప 2 ది రూల్ సాధించిన సక్సెస్ ని పంచుకోవడానికి ఇవాళ అల్లు అర్జున్ అండ్ టీమ్ ఢిల్లీలో అడుగు పెట్టింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ ఆనందాన్ని వ్యక్తపరచడానికి నార్త్ మీడియాని కలుసుకుంది. హిందీలో డిస్ట్రిబ్యూట్ చేసిన పంపిణీదారులు హాజరు కావడమే కాక తమకు పుష్ప 2 ఎంత కనక వర్షం కురిపించిందో వర్ణిస్తూ, షోల డిమాండ్ తట్టుకోలేకపోయిన వైనాన్ని వివరించారు. ఎప్పుడూ ఇంత వసూళ్ల సునామిని చూడలేదంటూ యుపి తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎగ్జిబిటర్లు ఆనందం వ్యక్తం చేశారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ హిందీ ఆడియన్స్ లేకపోతే పుష్ప 1, పుష్ప 2 రెండూ ఉండేవి కావని, ఇంత విజయం సాధించడంలో మీరే ప్రధాన భూమిక పోషించారని ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ రికార్డులు ఇంకో రెండు మూడు నెలలు లేదా వేసవి దాకా ఉండొచ్చేమో కానీ వీటిని దాటే మరో గొప్ప సినిమా ఏ భాషలో అయినా వస్తుందని, కంటిన్యూటీ కొనసాగుతూ ఉండాలని ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా ఫలానా మూవీ అని ప్రస్తావించలేదు కానీ పుష్ప 2 రికార్డులు శాశ్వతంగా ఉండవని చెప్పడం చూస్తే టాలీవుడ్ స్థాయి మరింత పైపైకి వెళ్తుందనే సంకేతం తన మాటల ద్వారా ఐకాన్ స్టార్ ఇచ్చాడు.
ప్రసంగం మొదట్లోనే దర్శకుడు సుకుమార్ మీద తనకున్న అభిమానం, ప్రేమను మనస్ఫూర్తిగా ప్రదర్శించిన బన్నీ ఆయన లేకపోతే పుష్ప ప్రపంచం ఉండేది కాదని మరోసారి నొక్కి చెప్పాడు. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీ భార్య మాట వింటే జీవితంలో పైకి వస్తారని పుష్ప 2లో శ్రీవల్లి అడిగిన ఫోటో వల్లే అంత కథ నడిచిందనే పాయింట్ మరోసారి గుర్తు చేశాడు. పుష్ప 3 ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానంగా ఈసారి ఝుకేగా నహీ కాదు రుకేగా నహీ (ఆగేది లేదు) అంటూ సీక్వెల్ ఉండొచ్చనే హింట్ అయితే ఇచ్చాడు బన్నీ. గంటకు పైగా జరిగిన ఢిల్లీ ప్రెస్ మీట్ ఆద్యంతం సరదాగా గడిచిపోయింది.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…