దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొంత విరామం తర్వాత మళ్లీ ఓ సినిమా తీయబోతున్నాడు. తన దర్శకత్వంలో 90ల్లో అద్భుత విజయం సాధించిన పెళ్ళిసందడి మ్యాజిక్ను రీక్రియేట్ చేయాలన్నది ఆయన ప్రయత్నం. అదే పేరుతో ఆయన తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టెక్నీషియన్లు, ప్రొడక్షన్ టీంను మాత్రమే అనౌన్స్ చేశారు రాఘవేంద్రరావు. నటీనటులు ఎవరన్నది తర్వాత వెల్లడిస్తానని ప్రకటించాడు.
ఐతే ఇందులో హీరో ఎవరనే విషయంలో ఆసక్తికర ప్రచారం సాగుతోంది. పెళ్ళిసందడి హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ను ఈ సినిమాతో కథానాయకుడిగా రీలాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.
రోషన్ ఇప్పటికే నిర్మలా కాన్వెంట్ సినిమాలో హీరోగా నటించాడు. ఐతే అది ఒక రకంగా చెప్పాలంటే పిల్లల సినిమా. ఆ టీనేజ్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రోషన్ లాంచింగ్ అంత బాగా జరగలేదు. దీంతో శ్రీకాంత్ మళ్లీ తొందరపడలేదు. ఈసారి మంచి సినిమాతో కొడుకును రీలాంచ్ చేయాలని భావించాడు. అతడికి తగ్గ కథ కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు శ్రీకాంత్కు హీరోగా లైఫ్ ఇచ్చిన రాఘవేంద్రరావే.. ఇప్పుడు అతడి కొడుకును హీరోగా పెట్టి పెళ్ళిసందడి కొత్త వెర్షన్ తీయాలని భావించాడని అంటున్నారు.
సరికొత్త లుక్తో రోషన్ రీలాంచ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో.. అది నిజమే అయితే జూనియర్ శ్రీకాంత్ను దర్శకేంద్రుడు ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావుతో కలిసి శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించనుండగా.. కీరవాణి సంగీతం సమకూర్చనున్నాడు.
This post was last modified on October 10, 2020 12:20 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…