దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొంత విరామం తర్వాత మళ్లీ ఓ సినిమా తీయబోతున్నాడు. తన దర్శకత్వంలో 90ల్లో అద్భుత విజయం సాధించిన పెళ్ళిసందడి మ్యాజిక్ను రీక్రియేట్ చేయాలన్నది ఆయన ప్రయత్నం. అదే పేరుతో ఆయన తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టెక్నీషియన్లు, ప్రొడక్షన్ టీంను మాత్రమే అనౌన్స్ చేశారు రాఘవేంద్రరావు. నటీనటులు ఎవరన్నది తర్వాత వెల్లడిస్తానని ప్రకటించాడు.
ఐతే ఇందులో హీరో ఎవరనే విషయంలో ఆసక్తికర ప్రచారం సాగుతోంది. పెళ్ళిసందడి హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ను ఈ సినిమాతో కథానాయకుడిగా రీలాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.
రోషన్ ఇప్పటికే నిర్మలా కాన్వెంట్ సినిమాలో హీరోగా నటించాడు. ఐతే అది ఒక రకంగా చెప్పాలంటే పిల్లల సినిమా. ఆ టీనేజ్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రోషన్ లాంచింగ్ అంత బాగా జరగలేదు. దీంతో శ్రీకాంత్ మళ్లీ తొందరపడలేదు. ఈసారి మంచి సినిమాతో కొడుకును రీలాంచ్ చేయాలని భావించాడు. అతడికి తగ్గ కథ కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు శ్రీకాంత్కు హీరోగా లైఫ్ ఇచ్చిన రాఘవేంద్రరావే.. ఇప్పుడు అతడి కొడుకును హీరోగా పెట్టి పెళ్ళిసందడి కొత్త వెర్షన్ తీయాలని భావించాడని అంటున్నారు.
సరికొత్త లుక్తో రోషన్ రీలాంచ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో.. అది నిజమే అయితే జూనియర్ శ్రీకాంత్ను దర్శకేంద్రుడు ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావుతో కలిసి శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించనుండగా.. కీరవాణి సంగీతం సమకూర్చనున్నాడు.
This post was last modified on October 10, 2020 12:20 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…