దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొంత విరామం తర్వాత మళ్లీ ఓ సినిమా తీయబోతున్నాడు. తన దర్శకత్వంలో 90ల్లో అద్భుత విజయం సాధించిన పెళ్ళిసందడి మ్యాజిక్ను రీక్రియేట్ చేయాలన్నది ఆయన ప్రయత్నం. అదే పేరుతో ఆయన తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టెక్నీషియన్లు, ప్రొడక్షన్ టీంను మాత్రమే అనౌన్స్ చేశారు రాఘవేంద్రరావు. నటీనటులు ఎవరన్నది తర్వాత వెల్లడిస్తానని ప్రకటించాడు.
ఐతే ఇందులో హీరో ఎవరనే విషయంలో ఆసక్తికర ప్రచారం సాగుతోంది. పెళ్ళిసందడి హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ను ఈ సినిమాతో కథానాయకుడిగా రీలాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.
రోషన్ ఇప్పటికే నిర్మలా కాన్వెంట్ సినిమాలో హీరోగా నటించాడు. ఐతే అది ఒక రకంగా చెప్పాలంటే పిల్లల సినిమా. ఆ టీనేజ్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రోషన్ లాంచింగ్ అంత బాగా జరగలేదు. దీంతో శ్రీకాంత్ మళ్లీ తొందరపడలేదు. ఈసారి మంచి సినిమాతో కొడుకును రీలాంచ్ చేయాలని భావించాడు. అతడికి తగ్గ కథ కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు శ్రీకాంత్కు హీరోగా లైఫ్ ఇచ్చిన రాఘవేంద్రరావే.. ఇప్పుడు అతడి కొడుకును హీరోగా పెట్టి పెళ్ళిసందడి కొత్త వెర్షన్ తీయాలని భావించాడని అంటున్నారు.
సరికొత్త లుక్తో రోషన్ రీలాంచ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో.. అది నిజమే అయితే జూనియర్ శ్రీకాంత్ను దర్శకేంద్రుడు ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావుతో కలిసి శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించనుండగా.. కీరవాణి సంగీతం సమకూర్చనున్నాడు.
This post was last modified on October 10, 2020 12:20 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…