దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొంత విరామం తర్వాత మళ్లీ ఓ సినిమా తీయబోతున్నాడు. తన దర్శకత్వంలో 90ల్లో అద్భుత విజయం సాధించిన పెళ్ళిసందడి మ్యాజిక్ను రీక్రియేట్ చేయాలన్నది ఆయన ప్రయత్నం. అదే పేరుతో ఆయన తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టెక్నీషియన్లు, ప్రొడక్షన్ టీంను మాత్రమే అనౌన్స్ చేశారు రాఘవేంద్రరావు. నటీనటులు ఎవరన్నది తర్వాత వెల్లడిస్తానని ప్రకటించాడు.
ఐతే ఇందులో హీరో ఎవరనే విషయంలో ఆసక్తికర ప్రచారం సాగుతోంది. పెళ్ళిసందడి హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ను ఈ సినిమాతో కథానాయకుడిగా రీలాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.
రోషన్ ఇప్పటికే నిర్మలా కాన్వెంట్ సినిమాలో హీరోగా నటించాడు. ఐతే అది ఒక రకంగా చెప్పాలంటే పిల్లల సినిమా. ఆ టీనేజ్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రోషన్ లాంచింగ్ అంత బాగా జరగలేదు. దీంతో శ్రీకాంత్ మళ్లీ తొందరపడలేదు. ఈసారి మంచి సినిమాతో కొడుకును రీలాంచ్ చేయాలని భావించాడు. అతడికి తగ్గ కథ కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు శ్రీకాంత్కు హీరోగా లైఫ్ ఇచ్చిన రాఘవేంద్రరావే.. ఇప్పుడు అతడి కొడుకును హీరోగా పెట్టి పెళ్ళిసందడి కొత్త వెర్షన్ తీయాలని భావించాడని అంటున్నారు.
సరికొత్త లుక్తో రోషన్ రీలాంచ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో.. అది నిజమే అయితే జూనియర్ శ్రీకాంత్ను దర్శకేంద్రుడు ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావుతో కలిసి శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించనుండగా.. కీరవాణి సంగీతం సమకూర్చనున్నాడు.
This post was last modified on October 10, 2020 12:20 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…