ఇటీవలే పుష్ప 2 ది రూల్ లో కిస్ కిస్ కిస్సిక్కు అంటూ స్పెషల్ సాంగ్ తో ఊపేసిన శ్రీలీలకు అటు ఉత్తరాదిలోనూ గుర్తింపు వచ్చేసింది. కాకపోతే మరొకరికి మిస్సవుతున్న ఛాన్సులు శ్రీలీలను వెతుక్కుంటూ రావడం కాకతాళీయం. ముందు ఈ పాట కోసం చాలా మందిని అనుకున్నారు. జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, దిశా పటాని ఇలా ఎన్నో ఆప్షన్లు పరిశీలించాక, కలుసుకున్నాక ఏవేవో కారణాల వల్ల డ్రాప్ అయ్యారు. చివరికి మైత్రిలోనే రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్న శ్రీలీలని ఒప్పించారు. కట్ చేస్తే ఇదేమో వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఇంత పెద్ద సక్సెస్ లో గుంటూరు కారం భామ భాగమయ్యింది.
నితిన్ చేస్తున్న రాబిన్ హుడ్ కి ముందు అనౌన్స్ చేసింది రష్మిక మందన్నని. కానీ డేట్స్ కుదరలేదు. పుష్ప 2 షెడ్యూల్స్ వల్ల దీంట్లో నటించడం సాధ్యం కాకపోవడంతో అది కాస్తా శ్రీలీలను చేరింది. తాజాగా నాగచైతన్య సినిమాలోనూ ఒక ఆఫర్ దక్కించుకుందని ఇన్ సైడ్ టాక్. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందబోయే ఫాంటసీ థ్రిలర్ లో తొలుత మీనాక్షి చౌదరిని అనుకున్నారట. కానీ ఇప్పుడా ఆ స్థానంలో శ్రీలీల దాదాపు లాకైనట్టేనని వినికిడి. ఇంతకు ముందు గుంటూరు కారంలో పూజా హెగ్డేతో కొంత షూటింగ్ చేశాక ఆమె ప్లేసులో శ్రీలీల వచ్చిన సంగతి మర్చిపోకూడదు.
ఈ లెక్కన శ్రీలీల దర్శక నిర్మాతలకు మంచి ఆల్టర్నేటివ్ గా మారుతోంది. డిమాండ్ ఎంత ఉన్నప్పటికీ ఎంబిబిఎస్ పరీక్షల కోసం గుంటూరు కారం తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న శ్రీలీల ఇకపై స్పీడ్ పెంచే ఆలోచనలో ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ ప్రకటిస్తే దానికి డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈలోగా ధమాకా కాంబో రిపీట్ చేస్తూ రవితేజతో నటిస్తున్న మాస్ జాతర మే 9 రిలీజైపోతుంది. ఇకపై బ్రేక్ లేకుండా చూసుకుంటానని చెబుతున్న శ్రీలీల ఈ డిసెంబర్ లోనే రెండుసార్లు దర్శనమివ్వనుంది. పుష్ప 2లో డాన్స్ చూశాం. రాబిన్ హుడ్ లో పెర్ఫార్మన్స్ కి స్కోప్ చాలా ఉందని టీమ్ పదే పదే చెబుతోంది.
This post was last modified on December 10, 2024 6:52 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…