అసలు టాపిక్ లోకి వెళ్లేముందు కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం. నాగార్జునకి శివ లాంటి పాత్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ వచ్చాక కొన్నేళ్ల పాటు డిజాస్టర్లు చూడాల్సి వచ్చింది. ప్రయోగాలన్నీ బెడిసి కొట్టాయి. కమర్షియల్ దారిలోకి వచ్చాకే విజయాలు వరించాయి. అల్లూరి సీతారామరాజు తర్వాత సూపర్ స్టార్ కృష్ణకు పదమూడు ఫ్లాపులు. చిరంజీవి ఖైదీ తర్వాత మంత్రిగారి వియ్యంకుడు లాంటి మంచి సినిమాకు ఆధారణ దక్కలేదు. జూనియర్ ఆది తర్వాత అంచనాల బరువు మోయలేక యావరేజ్ లు కూడా నష్టాలు తెచ్చాయి. మగధీర తర్వాత రామ్ చరణ్ ఆరంజ్ చేస్తే జనం ఒప్పుకోలేక నో అనేశారు.
ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వీటికి అల్లు అర్జున్ కనెక్షన్ ఎందుకనే పాయింట్ కు వద్దాం. పుష్ప 2 దెబ్బకు బన్నీ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. తర్వాత వచ్చే ఏ సినిమా అయినా సరే బాలీవుడ్ లోనూ సమాన క్రేజ్ తెచ్చుకుంటుంది. హక్కుల కోసం నార్త్ బయ్యర్లు ఎగబడతారు. దర్శకుడు ఎవరనేది పట్టించుకోరు. జస్ట్ ఐకాన్ స్టార్ బ్రాండ్ చూసి కోట్లు కుమ్మరిస్తారు. పుష్ప హీరోగా ఉత్తరాది ఆడియన్స్ తనను స్వంతం చేసుకున్న తీరు ఏ స్థాయిలో ఉందో బోలెడు వీడియోల రూపంలో కనిపిస్తూనే ఉంది. ఇది అంతకంత పెరగడమే తప్ప తగ్గడం ఉండదు.
కానీ బన్నీ ఈ విషయంలో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ లైన్ లో ఉన్నది త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా. నిర్మాత నాగవంశీ చెప్పిందాన్ని బట్టి చూస్తే ఇది ఆషామాషీగా ఉండబోవడం లేదు. అందులోనూ హీరో దర్శకుడి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాది ఉండాలి. దీనికి సంబంధించి ఎప్పుడో వచ్చిన అనౌన్స్ మెంట్ తప్ప మళ్ళీ అప్డేట్ లేదు. ఒకవేళ నిజమైతే మాత్రం ‘యానిమల్ డైరెక్టర్ విత్ పుష్ప హీరో’ అనే ట్యాగ్ లైనే రెండు వేల కోట్లతో సమానం. సో గత ట్రాక్ రికార్డు దృష్ట్యా ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేనట్టే.
This post was last modified on December 10, 2024 1:56 pm
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…