అల్లరి నరేష్ హీరోగా రూపొందిన బచ్చల మల్లి ఈ నెల 20 విడుదలకు రెడీ అవుతోంది. రిలీజ్ కు ఇంకో పన్నెండు రోజులు మాత్రమే ఉండటంతో టీమ్ ప్రమోషన్లు పెంచింది. అందులో భాగంగా ఇవాళ తుని పట్టణం రాజా గ్రౌండ్ లో ట్రాక్టర్ల మధ్య టగ్ అఫ్ వార్ పోటీ ఏర్పాటు చేసింది. అంటే ఇరువైపులా ట్రాక్టర్ బళ్లను బలమైన తాళ్లతో కట్టి ఎవరు బలంగా తమవైపు లాక్కుంటారో వాళ్లదే గెలుపన్న మాట. మాములుగా అయితే ఇదే పద్ధతి. బచ్చల మల్లి టీమ్ ఏమైనా వెరైటీగా చేస్తుందేమో చూడాలి. విన్నర్లకు 50 వేల రూపాయల బహుమతి ఉంటుంది. పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నందున భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇలా చేయడానికి కారణం బచ్చల మల్లిలో టైటిల్ రోల్ చేస్తున్న అల్లరి నరేష్ ట్రాక్టర్ డ్రైవర్ కావడమే. ఫుల్ మాస్ టచ్ ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని తీసినట్టు దర్శకుడు సుబ్బు చెప్పడం బట్టి చూస్తే కంటెంట్ ఏదో డిఫరెంట్ గా ఉండబోతోందని అర్థమవుతోంది. ట్రైలర్ లో అల్లరోడు మాములు మాస్ గా లేడు. ఒకరకంగా చెప్పాలంటే పుష్ప షేడ్స్ కనిపించాయి. ఎవరూ ఊహించని క్లైమాక్స్ చాలా కాలం వెంటాడటం ఖాయమని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. సో ఇవి కనక నిజమైతే నాంది తర్వాత అల్లరి నరేష్ కు మరో సోలో సీరియస్ హిట్టు పడ్డట్టే. అమృత అయ్యర్ ఇందులో హీరోయిన్ గా నటించింది.
జనాన్ని ఆకట్టుకోవాలంటే పబ్లిసిటీలో ఇలాంటి కొత్త పుంతలు తొక్కక తప్పదు. అసలే బచ్చల మల్లికి విపరీతమైన పోటీ ఉంది. పుష్ప 2 ది రూల్ జోరు అప్పటికి తగ్గేలా లేదు. విడుదల పార్ట్ 2, యుఐ, సారంగపాణి జాతకం, ముఫాసా లయన్ కింగ్, రాబిన్ హుడ్, మ్యాక్స్ ఇలా పెద్ద కాంపిటీషనే ఉంది. పైగా అప్పటి నుంచి మూడు వారాలు దాటడం ఆలస్యం సంక్రాంతి సినిమాల హడావిడి మొదలైపోతుంది. సో బచ్చల మల్లి హిట్టు టాక్ తెచ్చుకున్నా ఇరవై రోజులలోపే మొత్తం రాబట్టాలి. కామెడీ మళ్ళీ ట్రై చేద్దామని అల్లరి నరేష్ ఎంచుకున్న ఆ ఒక్కటి అడక్కు ఫ్లాప్ అయ్యింది. అందుకే బచ్చల మల్లి మీదే ఆశలు పెట్టుకున్నాడు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…