అల్లరి నరేష్ హీరోగా రూపొందిన బచ్చల మల్లి ఈ నెల 20 విడుదలకు రెడీ అవుతోంది. రిలీజ్ కు ఇంకో పన్నెండు రోజులు మాత్రమే ఉండటంతో టీమ్ ప్రమోషన్లు పెంచింది. అందులో భాగంగా ఇవాళ తుని పట్టణం రాజా గ్రౌండ్ లో ట్రాక్టర్ల మధ్య టగ్ అఫ్ వార్ పోటీ ఏర్పాటు చేసింది. అంటే ఇరువైపులా ట్రాక్టర్ బళ్లను బలమైన తాళ్లతో కట్టి ఎవరు బలంగా తమవైపు లాక్కుంటారో వాళ్లదే గెలుపన్న మాట. మాములుగా అయితే ఇదే పద్ధతి. బచ్చల మల్లి టీమ్ ఏమైనా వెరైటీగా చేస్తుందేమో చూడాలి. విన్నర్లకు 50 వేల రూపాయల బహుమతి ఉంటుంది. పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నందున భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇలా చేయడానికి కారణం బచ్చల మల్లిలో టైటిల్ రోల్ చేస్తున్న అల్లరి నరేష్ ట్రాక్టర్ డ్రైవర్ కావడమే. ఫుల్ మాస్ టచ్ ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని తీసినట్టు దర్శకుడు సుబ్బు చెప్పడం బట్టి చూస్తే కంటెంట్ ఏదో డిఫరెంట్ గా ఉండబోతోందని అర్థమవుతోంది. ట్రైలర్ లో అల్లరోడు మాములు మాస్ గా లేడు. ఒకరకంగా చెప్పాలంటే పుష్ప షేడ్స్ కనిపించాయి. ఎవరూ ఊహించని క్లైమాక్స్ చాలా కాలం వెంటాడటం ఖాయమని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. సో ఇవి కనక నిజమైతే నాంది తర్వాత అల్లరి నరేష్ కు మరో సోలో సీరియస్ హిట్టు పడ్డట్టే. అమృత అయ్యర్ ఇందులో హీరోయిన్ గా నటించింది.
జనాన్ని ఆకట్టుకోవాలంటే పబ్లిసిటీలో ఇలాంటి కొత్త పుంతలు తొక్కక తప్పదు. అసలే బచ్చల మల్లికి విపరీతమైన పోటీ ఉంది. పుష్ప 2 ది రూల్ జోరు అప్పటికి తగ్గేలా లేదు. విడుదల పార్ట్ 2, యుఐ, సారంగపాణి జాతకం, ముఫాసా లయన్ కింగ్, రాబిన్ హుడ్, మ్యాక్స్ ఇలా పెద్ద కాంపిటీషనే ఉంది. పైగా అప్పటి నుంచి మూడు వారాలు దాటడం ఆలస్యం సంక్రాంతి సినిమాల హడావిడి మొదలైపోతుంది. సో బచ్చల మల్లి హిట్టు టాక్ తెచ్చుకున్నా ఇరవై రోజులలోపే మొత్తం రాబట్టాలి. కామెడీ మళ్ళీ ట్రై చేద్దామని అల్లరి నరేష్ ఎంచుకున్న ఆ ఒక్కటి అడక్కు ఫ్లాప్ అయ్యింది. అందుకే బచ్చల మల్లి మీదే ఆశలు పెట్టుకున్నాడు.
This post was last modified on December 9, 2024 12:14 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…