ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు తేల్చి చెప్పింది. ఇదే జరిగితే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ఉండే అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. అయితే.. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ ఆది నుంచి విభేదిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ప్రాజెక్టు కారణంగా.. 70 టీఎంసీల కృష్ణానది నీటిని.. పాలమూరు, మహబూబాబాద్ సహా.. మరిన్ని జిల్లాలకు ఎత్తి పోస్తారు. తద్వారా.. శ్రీశైలానికి వచ్చే కృష్ణానీటిలో కోత పడుతుంది. ఇది.. విద్యుత్ ఉత్పత్తి పైనే కాకుండా.. ఏపీలో రాయలసీమ ప్రాంతాలకు నీటి ఎద్దడి మరింత పెరుగుతుంది. అంతేకాదు.. కృష్ణా వరద జలాలు.. కూడా ఏపీలోకి వచ్చే అవకాశం లేదు. కానీ, ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో నాలుగు కీలక జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి.
ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత ప్రాంతం పాలమూరుకు ఈ ప్రాజెక్టు వర ప్రదాయనిగా మారనుంది. అందుకే.. సీఎం రేవంత్ సైతం.. పాలమూరు-రంగారెడ్డిపై తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వందీనిని కట్టలేక పోయిందని.. తాము నిర్మించి తీరుతామని కూడా చెబుతున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం.. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవాలని.. ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు.. కేసులు కూడా దాఖలు చేసింది.
ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబు వద్ద కేంద్రం పాలమూరుకు ఒప్పుకోవాలని.. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఏర్పడిందని చెబుతోంది.
మరోవైపు.. తెలంగాణలో టీడీపీని విస్తరించాలన్న ప్రతిపాదనలు ఉన్న దరిమిలా.. ఈ ప్రాజెక్టుకు అంగీకరిస్తే మేలు జరుగుతుందని ఇక్కడి దేశం నాయకులు చెబుతున్నారు. కానీ, అదేసమయంలో సీమ ప్రాంతంలో పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు. మరి ఈ వ్యవహారంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on May 13, 2026 6:18 am
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…