ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు తేల్చి చెప్పింది. ఇదే జరిగితే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ఉండే అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. అయితే.. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ ఆది నుంచి విభేదిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ప్రాజెక్టు కారణంగా.. 70 టీఎంసీల కృష్ణానది నీటిని.. పాలమూరు, మహబూబాబాద్ సహా.. మరిన్ని జిల్లాలకు ఎత్తి పోస్తారు. తద్వారా.. శ్రీశైలానికి వచ్చే కృష్ణానీటిలో కోత పడుతుంది. ఇది.. విద్యుత్ ఉత్పత్తి పైనే కాకుండా.. ఏపీలో రాయలసీమ ప్రాంతాలకు నీటి ఎద్దడి మరింత పెరుగుతుంది. అంతేకాదు.. కృష్ణా వరద జలాలు.. కూడా ఏపీలోకి వచ్చే అవకాశం లేదు. కానీ, ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో నాలుగు కీలక జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి.
ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత ప్రాంతం పాలమూరుకు ఈ ప్రాజెక్టు వర ప్రదాయనిగా మారనుంది. అందుకే.. సీఎం రేవంత్ సైతం.. పాలమూరు-రంగారెడ్డిపై తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వందీనిని కట్టలేక పోయిందని.. తాము నిర్మించి తీరుతామని కూడా చెబుతున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం.. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవాలని.. ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు.. కేసులు కూడా దాఖలు చేసింది.
ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబు వద్ద కేంద్రం పాలమూరుకు ఒప్పుకోవాలని.. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఏర్పడిందని చెబుతోంది.
మరోవైపు.. తెలంగాణలో టీడీపీని విస్తరించాలన్న ప్రతిపాదనలు ఉన్న దరిమిలా.. ఈ ప్రాజెక్టుకు అంగీకరిస్తే మేలు జరుగుతుందని ఇక్కడి దేశం నాయకులు చెబుతున్నారు. కానీ, అదేసమయంలో సీమ ప్రాంతంలో పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు. మరి ఈ వ్యవహారంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on May 13, 2026 6:18 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…