బీహార్ నుంచి ముంబై దాకా, రాజస్థాన్ నుంచి ఆగ్రా దాకా ఎక్కడ చూసినా ఒకటే సీన్. గత నాలుగు రోజులుగా పుష్ప 2 ది రూల్ థియేటర్లు ఎక్కడ హౌస్ ఫుల్ కాలేదని వెతికితే సమాధానం దొరకడం లేదు. టికెట్ ముక్క దొరికితే ఒట్టు అనేలా నార్త్ లో పుష్పరాజ్ భీభత్సం మాములుగా లేదు. ప్రాధమిక అంచనాల మేరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిన్న నాలుగో రోజు 80 కోట్లకు పైగా నెట్ సాధించిన బాలీవుడ్ మూవీగా పుష్ప 2 సంచలనం సృష్టించబోతోంది. అందులోనూ ఒక డబ్బింగ్ మూవీ ఈ స్థాయిలో అరాచకం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎక్కడా చూసినా ర్యాంపేజ్ అనే మాట చిన్నదే అనిపిస్తోంది.
బుక్ మై షోలో సోమవారం నుంచి వీక్ డేస్ అయినప్పటికీ గంటకు సగటున 3 నుంచి 5 వేల మధ్యలో టికెట్లు అమ్ముడుపోతూనే ఉన్నాయి. సాధారణంగా ఎంత మొదటి వారమైనా సరే డ్రాప్ ఉండటం సహజం. కానీ పుష్ప 2 రివర్స్ లో వెళ్తోంది. గురువారం నుంచి ఆదివారం దాకా టికెట్లు దొరక్క చూడలేకపోయినవాళ్ళు వీలైనంత త్వరగా చూసేందుకు ఎగబడుతున్నారు. ప్రసిద్ధ గెయిటీ గెలాక్సీ థియేటర్ బయట 250 మీటర్ల వరకు టికెట్ కౌంటర్ దగ్గర క్యూ లైన్ ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోల్డ్ అవుట్ బోర్డ్ ఉన్నా సరే మరుసటి రోజు షోలకు ఎగబడుతున్న వీడియోలు వైరలవుతున్నాయి.
ముంబైలో చాలా చోట్ల అర్ధరాత్రి షోలకు ఇదే రెస్పాన్స్ కనిపించింది. ఒంటి గంటకు మొదలుపెడితే నాలుగు గంటలకు బయటికొచ్చే సమయంలోనూ ప్రేక్షకులు పుష్ప 2 కోసం ఫ్యామిలీస్ తో వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనుమతులు లేవు కాబట్టి ఈ సీన్ చూడలేం కానీ ఉత్తరాది నగరాల్లో కనిపించడం టాలీవుడ్ స్థాయి పెరిగిందనడానికి నిదర్శనం. ఒక్క హిందీ వెర్షన్ నుంచే పుష్ప 2 ఎంతలేదన్నా 700 కోట్లను దాటేస్తుందనే అభిప్రాయం నిజమయ్యేలా ఉంది. అంతకు మించి రాబట్టినా వెయ్యి కోట్లకు చేరుకున్నా ఎంత మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకో పది రోజులు ఈ తుఫాను శాంతించేలా లేదు.
This post was last modified on December 9, 2024 2:23 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…