బీహార్ నుంచి ముంబై దాకా, రాజస్థాన్ నుంచి ఆగ్రా దాకా ఎక్కడ చూసినా ఒకటే సీన్. గత నాలుగు రోజులుగా పుష్ప 2 ది రూల్ థియేటర్లు ఎక్కడ హౌస్ ఫుల్ కాలేదని వెతికితే సమాధానం దొరకడం లేదు. టికెట్ ముక్క దొరికితే ఒట్టు అనేలా నార్త్ లో పుష్పరాజ్ భీభత్సం మాములుగా లేదు. ప్రాధమిక అంచనాల మేరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిన్న నాలుగో రోజు 80 కోట్లకు పైగా నెట్ సాధించిన బాలీవుడ్ మూవీగా పుష్ప 2 సంచలనం సృష్టించబోతోంది. అందులోనూ ఒక డబ్బింగ్ మూవీ ఈ స్థాయిలో అరాచకం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎక్కడా చూసినా ర్యాంపేజ్ అనే మాట చిన్నదే అనిపిస్తోంది.
బుక్ మై షోలో సోమవారం నుంచి వీక్ డేస్ అయినప్పటికీ గంటకు సగటున 3 నుంచి 5 వేల మధ్యలో టికెట్లు అమ్ముడుపోతూనే ఉన్నాయి. సాధారణంగా ఎంత మొదటి వారమైనా సరే డ్రాప్ ఉండటం సహజం. కానీ పుష్ప 2 రివర్స్ లో వెళ్తోంది. గురువారం నుంచి ఆదివారం దాకా టికెట్లు దొరక్క చూడలేకపోయినవాళ్ళు వీలైనంత త్వరగా చూసేందుకు ఎగబడుతున్నారు. ప్రసిద్ధ గెయిటీ గెలాక్సీ థియేటర్ బయట 250 మీటర్ల వరకు టికెట్ కౌంటర్ దగ్గర క్యూ లైన్ ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోల్డ్ అవుట్ బోర్డ్ ఉన్నా సరే మరుసటి రోజు షోలకు ఎగబడుతున్న వీడియోలు వైరలవుతున్నాయి.
ముంబైలో చాలా చోట్ల అర్ధరాత్రి షోలకు ఇదే రెస్పాన్స్ కనిపించింది. ఒంటి గంటకు మొదలుపెడితే నాలుగు గంటలకు బయటికొచ్చే సమయంలోనూ ప్రేక్షకులు పుష్ప 2 కోసం ఫ్యామిలీస్ తో వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనుమతులు లేవు కాబట్టి ఈ సీన్ చూడలేం కానీ ఉత్తరాది నగరాల్లో కనిపించడం టాలీవుడ్ స్థాయి పెరిగిందనడానికి నిదర్శనం. ఒక్క హిందీ వెర్షన్ నుంచే పుష్ప 2 ఎంతలేదన్నా 700 కోట్లను దాటేస్తుందనే అభిప్రాయం నిజమయ్యేలా ఉంది. అంతకు మించి రాబట్టినా వెయ్యి కోట్లకు చేరుకున్నా ఎంత మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకో పది రోజులు ఈ తుఫాను శాంతించేలా లేదు.
This post was last modified on December 9, 2024 2:23 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…