ఆన్ లైన్ లో పవన్ కళ్యాణ్ అభిమానులకు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మధ్య నంద్యాల పర్యటన నుంచి జరుగుతున్న ఆన్ లైన్ రచ్చ గురించి తెలిసిందే. తమ మధ్య ఏం లేదని అంతర్గతంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్నా సరే సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అసలు పుష్ప 2 లో లేని డైలాగులను సృష్టించి బాస్ అంటూ, తమ్ముడు అంటూ ఏవేవో ఫేక్ ప్రచారాలు తీసుకొచ్చారు. ఇది ఎంత స్థాయికి వెళ్లిందంటే ఒక పేరున్న న్యూస్ ఛానల్ ఈ అబద్దపు వైరల్ వార్తను తీసుకుని ఏకంగా డిబేట్ కూడా పెట్టేసింది. కానీ పుష్ప 2 సక్సెస్ ప్రెస్ మీట్ లో వీటికి చెక్ పెట్టే ప్రయత్నం జరిగింది.
తెలంగాణలో ఇచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ఏ మాత్రం తగ్గకుండా అంతే టికెట్ రేట్లు పెంపు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి కృతజ్ఞతలు చెప్పిన బన్నీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ, పుష్ప 2కి ప్రత్యేక ధరలు రావడంలో ప్రధాన కారణం పవన్ అయినందుకు ధన్యవాదాలు తెలిపాడు. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నానని చెబుతూ కళ్యాణ్ బాబాయ్ థాంక్ యు సో మచ్ అనడంతో ప్రాంగణం ఒక్కసారిగా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. తన ప్రసంగంలో ఉపముఖ్యమంత్రిగా అడ్రెస్ చేశాక తిరిగి కళ్యాణ్ బాబాయ్ అంటూ ప్రత్యేకంగా మాట్లాడ్డం ఆకట్టుకుంది.
అంతకు ముందు నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ తమ సినిమా మీద ఆసక్తితో పెంపు ఇచ్చినందుకు పవన్ తో పాటు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు థాంక్స్ చెప్పారు. పుష్ప 2కి ఇచ్చిన టికెట్ రేట్ల పెంపు రెండు రాష్ట్రాలపరంగా ఇతర నిర్మాతలకు బోలెడంత ధైర్యాన్ని ఇచ్చింది. కల్కి, దేవరలాంటివి కూడా హైక్ తీసుకున్నప్పటికీ బ్లాక్ బస్టర్ కంటెంట్ ఉంటే బడ్జెట్ కు తగ్గట్టు పెంపు తెచ్చుకుంటే ప్రేక్షకులు చూస్తారని పుష్ప 2 ఋజువు చేసింది. రాబోయే సంక్రాంతి రిలీజులకు ఈ పరిణామం చాలా కీలకం కానుంది. ఇంత ఓపెన్ గా బన్నీ పవన్ కళ్యాణ్ మీద అభిమానం చూపించాడు కాబట్టి ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on December 7, 2024 8:00 pm
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…