పొరుగింటి పుల్లకూర రుచి అని పెద్దలు ఊరికే అనలేదు. మనింట్లో పదార్థాలు ఎంత కమ్మగా ఉన్నా పక్కింటోళ్ళు ఏమైనా ఇస్తే మాత్రం అదో అమృతంగా ఫీలయ్యే వాళ్ళు మన చుట్టూ బోలెడుంటారు. ఇది సినిమాలకూ వర్తిస్తుంది. ఎలాగో మీరే చూడండి. హాలీవుడ్ కల్ట్ మూవీ ఇంటర్ స్టెల్లార్ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 6 ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా ఐమాక్స్ స్క్రీన్లలో రీ రిలీజ్ చేశారు. కానీ ఇండియాలో జరగలేదు. పుష్ప 2 ది రూల్ కోసం అన్ని తెరలను ముందే రిజర్వ్ చేయడంతో ఇంటర్ స్టెల్లార్ కి చోటు దక్కలేదు. దీంతో మన దేశంలో వాయిదా వేయక తప్పలేదు.
ఇది కొందరు మేధావులైన మూవీ లవర్స్ కి కోపం తెప్పించింది. అదేంటి ఇంటర్ స్టెల్లార్ ని నిర్లక్ష్యం చేసినందుకు ఇండియాకి సినిమా తీసే అర్హత లేదనే స్థాయిలో ఒక పేరున్న మీమ్ పేజీ పోస్ట్ చేసింది. ఇది కాస్తా జాన్వీ కపూర్ కంటబడింది. వెంటనే బలమైన పంచు వేసింది. పుష్ప 2 కూడా సినిమానే, వెస్ట్ ని పొగడాలనే ఉద్దేశంతో మనల్ని మనం మనం తక్కువ చేసుకోవడం ఎందుకు, ఇతర దేశాలు మన క్రియేటివిటీని మెచ్చుకుంటూ, మేకింగ్ పట్ల నిబద్దతను మెచ్చుకుంటూ ఉంటే మనం మాత్రం ఇలా కామెంట్స్ చేయడం ఎంత మాత్రం సబబు కాదని విచారం వ్యక్తం చేస్తూ కౌంటర్ వేసింది.
దెబ్బకు దేవర హీరోయిన్ కు నెటిజెన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అమ్మడు చెప్పిన దాంట్లో నిజముంది మరి. ఆర్ఆర్ఆర్ ని జపాన్ జనాలు నెత్తిన బెట్టుకున్నారు. ఆస్కార్ ఏకంగా నాటునాటు పాటకు పురస్కారం ఇచ్చింది. కల్కి 2898 ఏడి, దేవర, జైలర్, బాహుబలి లాంటివన్నీ ఓవర్సీస్ లోనూ బ్రహ్మాండంగా ఆడినవే. మహారాజ చైనాలో ఆల్ టైం రికార్డులు సృష్టించి అమీర్ ఖాన్ దంగల్ ని వెనకేసే పనిలో ఉంది. అలాంటప్పుడు ఏదో పాత ఇంటర్ స్టెల్లార్ సినిమా కోసం ఇప్పటి పుష్ప 2నో లేదా మరో ఇండియన్ సినిమానో కించపరచడం ఎంత మాత్రం సరికాదు. జాన్వీ ఖండించింది ఇదే.
తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద…
అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…
పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…
ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…
గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13…
రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…