జూనియర్ ఎన్టీఆర్ను బాగా నిరాశపరిచిన చిత్రాల్లో ‘రభస’ ఒకటి. అసలే వరుస ఫ్లాపుల్లో ఉంటే.. ఈ సినిమా కూడా ఫెయిలవడంతో అతను బాగా డిజప్పాయింట్ అయ్యాడు. ‘కందిరీగ’ లాంటి సూపర్ హిట్ తీసిన సంతోష్ శ్రీనివాస్ ఎన్టీఆర్కు మంచి విజయాన్నిస్తాడనుకుంటే.. రొటీన్ మాస్ ఎంటర్టైనర్ తీసి తారక్ అభిమానుల ఆశలను కూల్చేశాడు. ఐతే ఈ సినిమా మేకింగ్ మధ్యలో ఉండగానే దీన్ని ఆపేయాలని తాను సూచించినట్లు నిర్మాత బెల్లంకొండ సురేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
తనకు ఆ సినిమా ఏమాత్రం నచ్చలేదని ఆయన తెలిపారు. షూటింగ్ మధ్యలో ఉండగా తాను రష్ చూసి ఈ సినిమా ఆడదని.. కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని నమ్మానని సురేష్ తెలిపారు. సినిమాను అక్కడితో ఆపేద్దామని కూడా టీంకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఐతే ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా వర్కవుట్ అవుతుందని.. మీకు అర్థం కావట్లేదు అని తనకు సర్దిచెప్పి సినిమా పూర్తి చేయించినట్లు తెలిపాడు. ఐతే సినిమా రిలీజయ్యాక తన అభిప్రాయమే కరెక్ట్ అని తేలిందని.. సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని సురేష్ తెలిపాడు.
కానీ తాను అన్నట్లుగా సినిమా ఫ్లాప్ మాత్రం కాలేదని సురేష్ అన్నాడు. ఎన్టీఆర్ హీరో కావడం.. కందిరీగ డైరెక్టర్ తీసిన సినిమా కావడంతో ప్రేక్షకులు బాగానే థియేటర్లకు వచ్చారని.. మంచి ఓపెనింగ్స్ ఇచ్చారని.. ఫుల్ రన్లో ‘రభస’ 85 నుంచి 90 శాతం రికవరీ సాధించి బాక్సాఫీస్ లెక్కల్లో ఎబోవ్ యావరేజ్ మూవీగా నిలిచిందని సురేష్ వెల్లడించారు.
ఇది ఎన్టీఆర్ స్టార్ పవర్ వల్లే సాధ్యమైందన్నాడు. తాను అన్నట్లు సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని.. అదే సమయంలో తారక్ నమ్మకం పెట్టుకున్నట్లు బాగానే ఆడిందని ఆయనన్నారు. 2014లో విడుదలైన ‘రభస’లో తారక్ సరసన సమంత, ప్రణీత సుభాష్ కథానాయికలుగా నటించారు.
This post was last modified on December 6, 2024 5:06 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…