జూనియర్ ఎన్టీఆర్ను బాగా నిరాశపరిచిన చిత్రాల్లో ‘రభస’ ఒకటి. అసలే వరుస ఫ్లాపుల్లో ఉంటే.. ఈ సినిమా కూడా ఫెయిలవడంతో అతను బాగా డిజప్పాయింట్ అయ్యాడు. ‘కందిరీగ’ లాంటి సూపర్ హిట్ తీసిన సంతోష్ శ్రీనివాస్ ఎన్టీఆర్కు మంచి విజయాన్నిస్తాడనుకుంటే.. రొటీన్ మాస్ ఎంటర్టైనర్ తీసి తారక్ అభిమానుల ఆశలను కూల్చేశాడు. ఐతే ఈ సినిమా మేకింగ్ మధ్యలో ఉండగానే దీన్ని ఆపేయాలని తాను సూచించినట్లు నిర్మాత బెల్లంకొండ సురేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
తనకు ఆ సినిమా ఏమాత్రం నచ్చలేదని ఆయన తెలిపారు. షూటింగ్ మధ్యలో ఉండగా తాను రష్ చూసి ఈ సినిమా ఆడదని.. కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని నమ్మానని సురేష్ తెలిపారు. సినిమాను అక్కడితో ఆపేద్దామని కూడా టీంకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఐతే ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా వర్కవుట్ అవుతుందని.. మీకు అర్థం కావట్లేదు అని తనకు సర్దిచెప్పి సినిమా పూర్తి చేయించినట్లు తెలిపాడు. ఐతే సినిమా రిలీజయ్యాక తన అభిప్రాయమే కరెక్ట్ అని తేలిందని.. సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని సురేష్ తెలిపాడు.
కానీ తాను అన్నట్లుగా సినిమా ఫ్లాప్ మాత్రం కాలేదని సురేష్ అన్నాడు. ఎన్టీఆర్ హీరో కావడం.. కందిరీగ డైరెక్టర్ తీసిన సినిమా కావడంతో ప్రేక్షకులు బాగానే థియేటర్లకు వచ్చారని.. మంచి ఓపెనింగ్స్ ఇచ్చారని.. ఫుల్ రన్లో ‘రభస’ 85 నుంచి 90 శాతం రికవరీ సాధించి బాక్సాఫీస్ లెక్కల్లో ఎబోవ్ యావరేజ్ మూవీగా నిలిచిందని సురేష్ వెల్లడించారు.
ఇది ఎన్టీఆర్ స్టార్ పవర్ వల్లే సాధ్యమైందన్నాడు. తాను అన్నట్లు సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని.. అదే సమయంలో తారక్ నమ్మకం పెట్టుకున్నట్లు బాగానే ఆడిందని ఆయనన్నారు. 2014లో విడుదలైన ‘రభస’లో తారక్ సరసన సమంత, ప్రణీత సుభాష్ కథానాయికలుగా నటించారు.
This post was last modified on December 6, 2024 5:06 pm
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఎప్పటి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్పడమే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆయన తన వాణిని…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…
టాలీవుడ్ దర్శకుల్లో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కమర్షియల్ లెక్కలకు దూరంగా సెన్సిబుల్ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్,…
ఇండిపెండెన్స్ డేకి ఒక రోజు ముందు ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఎంత డబ్బింగ్ సినిమా…
పెద్ద సినిమాలకు షూటింగ్ పూర్తి చేయడమే కాదు సరైన రిలీజ్ డేట్లు సెట్ చేసుకోవడం చాలా పెద్ద ఛాలెంజ్. ఈ…
కూటమిలో నాయకులకు కలివిడితప్పదు. ఈ విషయాన్ని గతంలో అనేక సందర్భాల్లో టీడీపీ-జనసేన కూడా స్పష్టం చేశాయి. అయినప్పటికీ.. కొందరు నాయకులు…