జూనియర్ ఎన్టీఆర్ను బాగా నిరాశపరిచిన చిత్రాల్లో ‘రభస’ ఒకటి. అసలే వరుస ఫ్లాపుల్లో ఉంటే.. ఈ సినిమా కూడా ఫెయిలవడంతో అతను బాగా డిజప్పాయింట్ అయ్యాడు. ‘కందిరీగ’ లాంటి సూపర్ హిట్ తీసిన సంతోష్ శ్రీనివాస్ ఎన్టీఆర్కు మంచి విజయాన్నిస్తాడనుకుంటే.. రొటీన్ మాస్ ఎంటర్టైనర్ తీసి తారక్ అభిమానుల ఆశలను కూల్చేశాడు. ఐతే ఈ సినిమా మేకింగ్ మధ్యలో ఉండగానే దీన్ని ఆపేయాలని తాను సూచించినట్లు నిర్మాత బెల్లంకొండ సురేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
తనకు ఆ సినిమా ఏమాత్రం నచ్చలేదని ఆయన తెలిపారు. షూటింగ్ మధ్యలో ఉండగా తాను రష్ చూసి ఈ సినిమా ఆడదని.. కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని నమ్మానని సురేష్ తెలిపారు. సినిమాను అక్కడితో ఆపేద్దామని కూడా టీంకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఐతే ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా వర్కవుట్ అవుతుందని.. మీకు అర్థం కావట్లేదు అని తనకు సర్దిచెప్పి సినిమా పూర్తి చేయించినట్లు తెలిపాడు. ఐతే సినిమా రిలీజయ్యాక తన అభిప్రాయమే కరెక్ట్ అని తేలిందని.. సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని సురేష్ తెలిపాడు.
కానీ తాను అన్నట్లుగా సినిమా ఫ్లాప్ మాత్రం కాలేదని సురేష్ అన్నాడు. ఎన్టీఆర్ హీరో కావడం.. కందిరీగ డైరెక్టర్ తీసిన సినిమా కావడంతో ప్రేక్షకులు బాగానే థియేటర్లకు వచ్చారని.. మంచి ఓపెనింగ్స్ ఇచ్చారని.. ఫుల్ రన్లో ‘రభస’ 85 నుంచి 90 శాతం రికవరీ సాధించి బాక్సాఫీస్ లెక్కల్లో ఎబోవ్ యావరేజ్ మూవీగా నిలిచిందని సురేష్ వెల్లడించారు.
ఇది ఎన్టీఆర్ స్టార్ పవర్ వల్లే సాధ్యమైందన్నాడు. తాను అన్నట్లు సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని.. అదే సమయంలో తారక్ నమ్మకం పెట్టుకున్నట్లు బాగానే ఆడిందని ఆయనన్నారు. 2014లో విడుదలైన ‘రభస’లో తారక్ సరసన సమంత, ప్రణీత సుభాష్ కథానాయికలుగా నటించారు.
This post was last modified on December 6, 2024 5:06 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…