తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నామనే ప్రకటన రావడంతో ఒక్కసారిగా నైజామ్ బయ్యర్లకు షాక్ కొట్టినట్టయ్యింది. ఎందుకంటే కేవలం నెల రోజుల వ్యవధిలో సంక్రాంతి హడావిడి మొదలవుతుంది. అప్పుడు రిలీజయ్యే సినిమాల మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. ఆయన బ్యానర్ దే సంక్రాంతికి వస్తున్నాం రేసులో ఉంది. డాకు మహారాజ్ కు ఆయనే పంపిణీదారుడు. మొత్తం మూడు బరువైన బాధ్యతలు నెత్తి మీద ఉన్నాయి. వీటి వ్యాపార వ్యవహారాలతో పాటు ప్రమోషన్లు చూసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడీ బెనిఫిట్ షోల బాంబు ఊహించనిది. పైగా టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా ఇకపై పునరాలోంచించే సంకేతాలు మంత్రి గారు ఇవ్వడంతో రాబోయే రోజుల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కేవలం బెనిఫిట్ షోలు రద్దు చేసినంత మాత్రాన తీవ్ర నష్టాలు రావు కానీ మంచి రెవిన్యూ పోతుంది. ఎందుకంటే మిడ్ నైట్ షోలు కేవలం అభిమానులు మాత్రమే చూడటం లేదు. సగటు మూవీ లవర్స్ వీటికి అలవాటు పడిపోయి రాత్రి షో కాబట్టి పగలు సేవ్ అవుతుందనే ఉద్దేశంతో రేట్లు ఎక్కువైనా టికెట్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఎన్ని షోలు వేసినా ప్రతి ఊరిలో హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.
ఇప్పుడీ పరిణామం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది గేమ్ ఛేంజర్. ఎందుకంటే బడ్జెట్ పరంగా అన్నింటికన్నా చాలా పైన ఉంది ఈ సినిమానే. బాలయ్య, వెంకీ సినిమాలకు ఇందులో సగం కూడా ఖర్చు కాలేదు. సో ప్రీమియర్లు వేయకపోయినా పెద్ద డ్యామేజ్ ఉండదు. మరి దిల్ రాజు ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతారో చూడాలి. ఒకవేళ ముందు రోజు సాయంత్రం లేదా రాత్రి షోలు వేసుకుంటే ఇబ్బంది ఉండదు. కాకపోతే బెనిఫిట్ పేరు పెట్టకుండా రెగ్యులర్ షోస్ అని చూపించుకోవాలి. కానీ ప్రాక్టికల్ గా చాలా సమస్యలు వస్తాయి. ఇది పరిష్కారం కాకపోతే ముందొచ్చే ప్యాన్ ఇండియా సినిమాలకూ ఇబ్బంది తప్పదు.
This post was last modified on December 6, 2024 3:28 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…