తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నామనే ప్రకటన రావడంతో ఒక్కసారిగా నైజామ్ బయ్యర్లకు షాక్ కొట్టినట్టయ్యింది. ఎందుకంటే కేవలం నెల రోజుల వ్యవధిలో సంక్రాంతి హడావిడి మొదలవుతుంది. అప్పుడు రిలీజయ్యే సినిమాల మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. ఆయన బ్యానర్ దే సంక్రాంతికి వస్తున్నాం రేసులో ఉంది. డాకు మహారాజ్ కు ఆయనే పంపిణీదారుడు. మొత్తం మూడు బరువైన బాధ్యతలు నెత్తి మీద ఉన్నాయి. వీటి వ్యాపార వ్యవహారాలతో పాటు ప్రమోషన్లు చూసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడీ బెనిఫిట్ షోల బాంబు ఊహించనిది. పైగా టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా ఇకపై పునరాలోంచించే సంకేతాలు మంత్రి గారు ఇవ్వడంతో రాబోయే రోజుల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కేవలం బెనిఫిట్ షోలు రద్దు చేసినంత మాత్రాన తీవ్ర నష్టాలు రావు కానీ మంచి రెవిన్యూ పోతుంది. ఎందుకంటే మిడ్ నైట్ షోలు కేవలం అభిమానులు మాత్రమే చూడటం లేదు. సగటు మూవీ లవర్స్ వీటికి అలవాటు పడిపోయి రాత్రి షో కాబట్టి పగలు సేవ్ అవుతుందనే ఉద్దేశంతో రేట్లు ఎక్కువైనా టికెట్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఎన్ని షోలు వేసినా ప్రతి ఊరిలో హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.
ఇప్పుడీ పరిణామం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది గేమ్ ఛేంజర్. ఎందుకంటే బడ్జెట్ పరంగా అన్నింటికన్నా చాలా పైన ఉంది ఈ సినిమానే. బాలయ్య, వెంకీ సినిమాలకు ఇందులో సగం కూడా ఖర్చు కాలేదు. సో ప్రీమియర్లు వేయకపోయినా పెద్ద డ్యామేజ్ ఉండదు. మరి దిల్ రాజు ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతారో చూడాలి. ఒకవేళ ముందు రోజు సాయంత్రం లేదా రాత్రి షోలు వేసుకుంటే ఇబ్బంది ఉండదు. కాకపోతే బెనిఫిట్ పేరు పెట్టకుండా రెగ్యులర్ షోస్ అని చూపించుకోవాలి. కానీ ప్రాక్టికల్ గా చాలా సమస్యలు వస్తాయి. ఇది పరిష్కారం కాకపోతే ముందొచ్చే ప్యాన్ ఇండియా సినిమాలకూ ఇబ్బంది తప్పదు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…